నేటి నుంచి ఉద్యాన ప్రదర్శన

నేటి నుంచి ఉద్యాన ప్రదర్శన

Updated : 1/26/2015 1:59:44 AM
Views : 128

నమస్తే తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఉద్యాన ప్రదర్శనను సోమవారం సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. ఈ ప్రదర్శనలో సుమారు 160స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అయిదు రోజులపాటు జరిగే ఉద్యాన ప్రదర్శనకు 3 లక్షలమంది రైతులు, ప్రజలు హాజరవుతారని అంచనావేస్తున్నారు.

ఈ ప్రదర్శన ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌తోపాటు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎండీ మహమూద్ అలీ, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పార్లమెంట్ కార్యదర్శి కోవ లక్ష్మీ, రాజ్యసభ సభ్యులు వీ హన్మంతరావు, ఎండీ అలీఖాన్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, నాగేశ్వర్, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డిలు పాల్గొంటారు.

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి