*స్థూల పంచభూతములు స్థూలమగు శరీరమునే బాధింపగలవు కాని మనసుకు కాదు అట్టిచో అతి సూక్ష్మమగు ఆత్మనెట్లు అయ్యవి భాధించగలవు...? || గీత -2 అ -23 || *ఆత్మ యొక్క యిట్టి స్వభావమును మననము చేయుచుండినచో జీవునకు అపరిమిత ధైర్యము చేకూరగలదు. || గీత -2 అ -22 || *జ్ఞానము సంపాదించి కర్మ సంచయ మొనర్చుకొని, మరల జన్మగాని, మరణకు గాని లేకుండ చేసుకొనుటయే సర్వోత్తమమని భగవానుడు మున్ముందు తెలుపుతున్నాడు.|| గీత -2 అ -25 || *మనస్సులయించినపుడు శేశించు వస్తువే అత్మ, మనస్సును శుద్ధమొనప్పుట ద్వారా అద్దానిని అధిష్ఠానమందు లయింపజేయునపుడు మిగులునదియే ఆత్మ. ఈప్రకారముగ మనోవిలయముచే లభించు వస్తువు మనస్సున కెట్లు గోచరించపగలదు? శరీరము నశించినను ఆత్మ నశింపదని చెప్పినందువలన శరీరము కంటె వేరై ఆత్మ సాక్షిగనున్నాడని స్పష్టమగుచున్నది. కావున మనుజుడు నశించు శరీరముతో తాదాత్మ్యము చెందక నహింపని ఆత్మయే తానని నిరంతరము భావించుచుండవలెను. దానిచే అపరిమిత ధైర్యము, ఆనందము కలుగును. నిర్భయత్వము జనించును, మరణ భయము పటాపంచలై పోవును. || గీత -2 అ -20 || *నిష్కామకర్మ, భక్తి, వైరాగ్యము, ధ్వానము...