ఈ విషాద గాధ చదవండి .... నిన్న జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా ఛాంపియన్గా నిలిచింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో, టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీని ప్రకారం, మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 20 ఓవర్లలో 255 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ 159 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీం ఇండియా 96 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం తర్వాత ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. తన జీవితంలో అత్యంత కష్టతరమైన క్షణాలలో ఒకదాన్ని పంచుకున్నాడు. అది ఓ మరణ వార్త కావడం గమనార్హం..! ఫైనల్ మ్యాచ్ కు ముందే నా సోదరి చనిపోయింది. నేను ప్రపంచ కప్ గెలవాలని ఆమె కోరుకుంది. కానీ ఇప్పుడు ఆమె లేదు. ఈ ప్రపంచ కప్ ను ఆమెకు అంకితం చేస్తున్నాను” అని ఇషాన్ కిషన్ ఆనంద క్షణాల మధ్య తన బాధను పంచుకున్నాడు. మార్చి 7న పశ్చిమ బెంగాల్లోని 27వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇషాన్ కిషన్ సోదరి వైష్ణవి సింగ్, ఆమె భర్త మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న ఆ దంపతులకు ఆరు నెలల మూడు సంవత్...