Posts

Showing posts from February, 2015

సామాన్యుడికి జనరిక్ అభయం

Image
సామాన్యుడికి జనరిక్ అభయం Posted On:2/26/2015 2:38:05 AM -రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం -ప్రభుత్వ దవాఖానలకు వెళ్లే పేదలకు ఏటా రూ.కోట్లలో ఆదా వైద్యుల సహకారమే కీలకమంటున్న నిపుణులు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సాధారణ జ్వరం వచ్చినా ఓ మోస్తరు వైద్యుడు కూడా యాంటీ బయోటిక్స్ మందులు రాయడం సహజం. కనీసం వారంపాటు ఆ మందులు వాడాలంటే రూ.వందల్లో ఖర్చు పెట్టాల్సిందే. ఈ నేపథ్యంలో పది రూపాయల విలువైన మందులు రెండు రూపాయలకే వస్తే?! సామాన్య జనానికి ఏటా రూ.కోట్లల్లో డబ్బు ఆదా అవుతుంది. ఇందుకు మార్గం ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో చొరవ తీసుకున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రధాన దవాఖానలన్నింటిలోనూ జనరిక్ మందుల దుకాణాలు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. రాష్ట్రంలోని అన్ని బోధన, ప్రధాన దవాఖానలతోపాటు ఏరియా దవాఖానాల్లోనూ జనరిక్ మందుల దుకాణాలు పెట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించాలంటూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం నిరుపేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందనే చర్చ మొదలైంది...

మంచి మేలు తలపెట్టాలి

మంచి మేలు తలపెట్టాలి Posted On:2/26/2015 1:49:27 AM సూర్యోదయంతో మొదలైన రోజు చంద్రోదయంతో ముగుస్తూ అనేక అనుభవాలనూ, జ్ఞాపకాలనూ జీవితఖాతాలో చేరుస్తుంది. గొప్పగా బతకాలి, ఏదో చేయాలి అనే తపన ప్రతీ ఒక్కరిలో గంభీరమై నిగూఢమై ఉంటుంది. కానీ జీవన పోరాటంలో సమయం అలా గడిచిపోతూ మంచి ఆలోచనలకు తావివ్వదు. మనిషి తలుచుకుంటే ప్రయత్నంతో సాధించలేనిది ఏదీ లేదు. అనుకోకుండానే మహాత్ములు చేసిన మంచి అనేదే దానికి ఆలంబన. నిసర్గాదారామే తరుకుల సమారోపసుకృతీ కృతీ మాలాకారో బకులమపి కుత్రాపి నిదధే ఇదం కో జానీతే యదహ మిహ కోణాంతరగతో జగజ్జాలం కర్తా కుసుమభర సౌరభ్యభరితమ్ ॥ అందమైన ఉద్యానవనంలో మొక్కలు నాటే మంచిపనిని చేస్తుండే తోటమాలి అలవాటుగా ఓ మూలన పొగడచెట్టును కూడా నాటుతాడు. అనుకోకుండా ఒక చోటులో పాతిన ఆ చెట్టు తన పుష్పాల పరిమళంలో పరిసర ప్రాంతమంతా పరిమళభరితం చేస్తుందని అతననుకోలేదు. ప్రపంచం చాలా అందమైన అద్భుతం. అందులో భగవంతుడు చేసిన మంచి అపారం. దానిని అందిపుచ్చుకొని సుహృదాలోచనతో జీవించడమే మన బాధ్యత. ఎవరో ఎక్కడో చేసిన మంచికి ఫలాన్ని మనం అనుభవిస్తూ కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాన్ని మనస్ఫూర్తిగా మనస్సులోనే సమర్పించుకోగలం. మరి ప్రతిఫలా...

పవిత్ర జీవనం

పవిత్ర జీవనం Posted On:2/24/2015 12:27:18 AM జీవన దార్శనికత దైనందిన చర్యల్లో ప్రస్ఫుటమవుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఎదుటివారు ఎలా బతకాలో సలహాలివ్వచ్చు. నీటిలోకి దిగితేనే లోతెంతో తెలిసేది. అలాగే ఎవరి బతుకు వారిది. ఒక చిన్న వస్తువు కొనాలంటేనే ప్రణాళిక వేసుకొని, ముందు వెనుకా ఆలోచించి నిర్ణయం తీసుకునే మనం బతికేందుకు వేదం ఏనాడో అద్భుత కర్తవ్యోపదేశం ప్రణాళికబద్ధంగా సూచించింది. పవిత్ర జీవనానికి మార్గం చూపింది. పునంతు మా దేవజనాః పునంతు మనవో ధియా పునంతు విశ్వాభూతాని పవమానః పునంతు మా ॥ నైతిక విలువలతో మనిషి ఎదిగేందుకు నాలుగు విషయాలను జీవన సూత్రాలుగా మలుచుకొని బతకాలనేది వైదిక ప్రబోధం. భావనాజగత్తులో దివ్యగుణాల పరిపాలకులు దేవతలనీ, అసుర గుణసంపత్తి గలవారు రాక్షసులనీ అనుకుంటే సత్యభాషణం. పరోపకారం, దయ, తృప్తి గలిగిన మహజనులతో సహవాసం చేయగలిగితే జీవితం పావనం అవుతుంది. మననశీలి మనిషి. వివేకంతో, బుద్ధితో సామాజిక దృక్పథాన్నీ, మంచి చెడులనూ ఆలోచిస్తూ ఆశావహ దృక్పథంతో, మంచి భావనలతో మనసును పదేపదే ప్రేరేపించే శక్తిని మనిషి సాధించాలి. మంచి ఆలోచన తప్పక మంచి కర్మలనే చేయిస్తుంది. పవిత్ర భావనలతో సమాజం వర్ధిల్లుతుం...

ధనానికి మూడే గతులు

ధనానికి మూడే గతులు Posted On:2/21/2015 1:36:50 AM ధనవంతుని వద్దనున్న ధనం దానం చేయుటకు ఉపయోగపడును. అట్లే పంచభక్ష్యపరమాన్నాలను సమకూర్చుకొనుటకు, సుగంధపరిమళద్రవ్యాలను, హార చందనాదులను, సుందరమైన వస్త్రములను కొనుటకు, సుఖనివాసమునకు అవసరమైన భవన నిర్మాణమునకు, అలంకరించుకొనదగిన ఆభరణములను పొందుటకు, ఇష్టమైన అవసరమైన ప్రదేశాలలో సంచరించుటకు కావలసిన వాహనములను కొనుటకు ఉపకరిస్తూ ధనికునియొక్క భోగానుభవమునకు కారణమై నిలుచును. దానధర్మాలకు, అనుభవం కోసం ధనాన్ని ఉపయోగించకపోతే ఆ ధనం నశిస్తుందని, ధనానికి దానము, భోగము, నాశము అనే మూడు గతులే ఉన్నాయి దానం భోగో నాశః తిస్రో గతయో భవంతి విత్తస్య యో న దదాతి, న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి ॥ అని భర్తృహరి మహాకవి పేర్కొన్నాడు. రాశులకొద్ది ధనం ఉన్న వ్యక్తి తన దగ్గర ఉన్న ధనాన్ని తన అవసరాలకో, తన పరివారం యొక్క అనుభవానికో ఏ మాత్రం ఉపయోగించకపోతే, ఆపదలో ఉన్నవారికి, ఆకలితో అలమటించేవారికి, ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారికి సహాయంగా అందించకపోతే, విద్వాంసులను, కళాకారులను సత్కరించుటకు, దేవాలయ నిర్మాణమునకు, యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించుటకు వీలుగా దానంగా ధర్మంగా సమర్పించకపోతే ఆ ధనరాశ...

సహజత్వం

సహజత్వం Posted On:2/20/2015 1:17:45 AM జీవితం అంటే... మహామహులు ఇచ్చే నిర్వచనాలు, ప్రతీరోజూ దుర్భరంగా బ్రతికే సగటు మనుషుల అభిప్రాయాలే కళ్ళముందూ, మనసులో మెదలుతాయే గానీ వాస్తవం ఆలోచించమెందుకు? జీవితం అంటే జీవించడం. తృప్తిగా బతకడం. మనకు నచ్చినట్టుగా బతికే ప్రయత్నంలో పరిస్థితుల ప్రభావం తప్పక ఉంటుంది. కానీ మనదైన సహజత్వం కోల్పోలము. సహజంగా వచ్చిన జీవన రుచులు పొమ్మంటే పోవు. కస్తం లోహితలోచనాస్య చరణో హంసః కుతోమానసాత్ కిం తత్రాస్తి సువర్ణ పంకజవనాన్యంభః సుధా సన్నిభమ్! తత్తీరం నవరత్న ఖండఖచితం కల్పద్రుమాలంకృతమ్ శంబూకాః కిముసంతినేతి చ బకైరాకర్ణ్య హీ హీకృతమ్ ఒకసారి కొన్ని కొంగలు... ఎర్రని కళ్ళూ, ముక్కు, కాళ్ళూ ఎవరు నువ్వు? అని అడిగాయి హంస ను. నేనూ హంస అంది. ఎక్కడి నుంచి వచ్చావు? మానససరోవరం నుంచి, అక్కడేముంటుంది? బంగారు పద్మవనాలు అమృతం లాంటి నీళ్ళు, దానిచుట్టూ నవరత్నములు ఖండాలుగా పొదిగి ఉంటాయి. కల్పవృక్షాల చేత అలంకృతమై చాలా అందంగా ఉంటుంది. నత్తగుల్లలుంటాయా? ఉండ వు. ఈ మాట వినగానే కొంగలు హహహ అంటూ నవ్వాయి. హంస కొంగల ఈ సంవాదం మనమూ నవ్వుకునేలా చేస్తాయి. కానీ ఆలోచిస్తే ఎవరిజీవితం వారిది. సహజగుణాలకతీతంగా...

ఆత్మగౌరవమే జాతి గౌరవం

ఆత్మగౌరవమే జాతి గౌరవం Posted On:2/18/2015 2:58:07 AM ఆలోచనే అన్నింటికీ మూలం. మానవ దృక్పథాన్ని చాటిచెప్పే అద్భుత సాధనం ఆలోచన. ఆత్మసాక్షిగా స్ఫురించే భావన గౌరవాన్ని పెంపొందించి ప్రపంచంలో సగర్వంగా నిలబడేలా చేస్తుంది. ఆత్మగౌరవమే జాతిగౌరవమై అలరారుతుంది. మనుషులంటేనే అంత. అని హేళనగా మాట్లాడి ఏదో చెప్పాలనే కసిని బహిర్గతం చేస్తాం. కానీ ఆ మనుషుల్లో మనమూ ఉన్నామనే సూక్ష్మ విషయాన్ని విస్మరిస్తాం. త్రోటీపుటం కరట కుడ్మల యాథ తాత యావత్ ప్రతివ్రజతి నాకమయం మరాలః నోచేద మంగళ కఠోరరవా విహంగాః సర్వే భువీతి నిజసంసది శంసితానః ॥ అనుభవం గల ఒక పక్షి కాకితో, హంస అనే అతిథి తన స్థానానికి వెళ్ళేవరకూ కొంచెం నీ నోరు కట్టిపెట్టు. లేదంటే భూ లోకంలోని పక్షులన్నీ అమంగళంగా, కఠోరంగా అరుస్తాయని వారి లోకంలో చెబుతుందని అంటుంది. ఈ మాత్రం అభిమానం మనుషులకు లేదా! పిల్లలు తప్పుచేస్తే తల్లిదండ్రులు ఆ దోషాన్ని నెత్తిన వేసుకుంటారు. తల్లిదండ్రులే తప్పుచేస్తే పిల్లలు అనుభవించక తప్పదు. ఎంత కుటుంబ కలహాలున్నా బయటివారి ముందు లోకువ కాము. ఎంతటి చెడుగుణం కలవాడైనా విదేశీయుల ముందు చెడ్డగా ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తిస్తే ఆ దేశమే అలాంటిదనే అ...

Seavadharmam

సేవాధర్మం Posted On:2/17/2015 2:01:16 AM శిశువును నవ మాసాలు గర్భంలో ధరించి, ఆ తరువాత జన్మనిచ్చి దేహ పోషణకు అవసరమైన పాలను ఇచ్చి, నడక నేర్పి, మాటల మూటను అందించే మాతృమూర్తి యొక్క సేవాతత్పరత మహనీయమైనది. మాటలతో వర్ణించలేనిది. తల్లిప్రేమకు సాటిరాగల ప్రేమగాని, తల్లి సేవలను వివరించే మాటలుగాని లభించుట దుర్లభము. సేవాభావం కల వ్యక్తులు అక్కడక్కడ మనకు దర్శనమిస్తారు. శిష్యులు గురువుల సేవలో, దేశసేవలో సైనికులు, రోగుల సేవలో వైద్యులు, అధికారుల సేవలో ఉద్యోగులు, ప్రజల సేవలో ప్రభువులు పాల్గొనటం జగద్విదితమే. వనవాస సమయంలో సీతారాములకు లక్ష్మణస్వామి చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలుచునట్టివి. శ్రీరామచంద్రు డు రాజ్యాన్ని పరిపాలించే సందర్భంలో తనను తాను ప్రభువుగా కాకుండా, ప్రజలకు సేవచేసే వ్యక్తిగానే భావించుకున్నాడు. చూపులేని తల్లిదండ్రులకు శ్రవణకుమారుడు చేసిన సేవ, అరణ్యవాసియైన వ్యాధుడు తల్లిదండ్రుల పట్ల సేవాధర్మమును కలిగియున్న తీరు అందరికీ ఆదర్శ ప్రాయమైనట్టిదే. అయితే లోకంలో చాలాచోట్ల సేవలనందుకునే వ్యక్తులు సేవాభావంతో సేవలను అందిస్తున్నవారిపట్ల కృతజ్ఞతాభావం లేకుండా వ్యవహరిస్తారని, సేవచేసే వారిలో తప్పులు...

భగవద్గీత నుండి లాభం పొందడం ఎలా?

భగవద్గీత నుండి లాభం పొందడం ఎలా? Courtesy:  Praveen Goud goudp68@yahoo.com గీతాజయంతి నాడు దేశంలో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా భగవద్గీతను గురించి మారుమ్రోగి పోతూంటుంది. ఇన్ని పత్రికలు, 24గంటలూ పనిచేసే శతాధిక T.V.చానెళ్ళూ వచ్చాక, విషయబాహుళ్యం బాగా పెరిగింది. ఏది ఎంతవరకు గ్రహించాలో, ఎట్లా ఉపయోగించుకోవాలో (ఆచరణలో పెట్టుకోవాలో) దిక్కుతోచనంత విశాల విషయ ప్రసారమే ఈనాటి అసలు సమస్య ! ఉదాహరణకు: గణితశాస్త్రమనేది, 1వ తరగతి విద్యార్థినుండి Ph.D.స్థాయి, ఆపైన Original Scientist (Mathematician)స్థాయి వరకు అందరికీ ఉపయోగపడేదే. అలాగని, 3వ తరగతి చదివే మన పిల్లలకు పేపర్లు, T.V.లలో చూపించే విచిత్ర, కాలక్షేప, ఆసక్తికర Maths Prograammes అన్నీ పనికి రావు గదా ! అదేవిధంగా భగవద్గీతా శాస్త్రం కూడా. మన పిల్లలకు ( ఆధ్యాత్మికంలోకి ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్న పెద్దలు కూడా పిల్లలతో సమానమే – వారుకూడ అధ్యాత్మికతా ప్రారంభ బాలశిక్ష నేర్చుకోవాల్సిందే కాబట్టి ) మొదటిమెట్టుగా ఉపయోగపడే గీతాంశాలను గూర్చి స్థూలంగా చర్చించుకుందాం ! ౧. భారతీయుల ప్రతిగృహంలోనూ ఉండవలసిన గ్రంథం భగవద్గీత ! “ఎవరు చదువుతారులే” అనే మీమాంసకు తావు ఇవ్వకు...

MAHA SHIVARATRI_2015_TELUGUDEVOTIONALSWARANJALI

Image
MAHA SHIVARATRI_2015 శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి? Courtesy:  Praveen Goud goudp68@yahoo.com సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు. శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు. 1.ఉపవాసం శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంత...

పరనింద-స్వస్తుతి

పరనింద-స్వస్తుతి Posted On:2/13/2015 11:33:37 PM ఇతరులను ఎవరినీ నిందించకూడదు, మాటలతో హింసించకూడదు. కఠినంగా మాట్లాడితే, నిష్కారణంగా నిందిస్తే, ఎప్పుడూ అప్రియములనే పలుకుతూ ఉంటే మనకంటూ ఆత్మీయులు, ఆప్తులు ఉండనే ఉండరు. తనలో శక్తిసామర్థ్యాలు అపరిమితంగా ఉన్నప్పటికీ, తనను తాను స్తుతించుకోకూడదు. ఎవరైతే ఇతరులను ఎప్పుడు కూడా నిందించరో, అట్లాగే తమను తాము స్తుతించుకోరో, తమ గొప్పతనా న్ని తామే చెప్పుకుండా ఉంటారో, అటువంటి వ్యక్తులే గుణసంపన్నులుగా కీర్తింపబడుతారు. గొప్పనైన యశస్సును పొందుతారు. అబ్రువన్ కస్యచిత్ నిందాం ఆత్మపూజాం అవర్ణయన్ విపశ్చిత్ గుణసంపన్నః ప్రాప్నోత్యేవ మహద్యశః॥ అని వ్యాసమహాభారతం శాంతిపర్వంలోని శ్లోకం ద్వారా ప్రకటింపబడినది. కొందరు తమను తాము ఎక్కువగా ప్రశంసించుకుంటూ ఉంటారు. ఇతరులు కూడా ఈ ప్రశంసలను విని వారు తమను గొప్పగా భావించి గౌరవించాలని భావిస్తారు. ఇట్టివారిని వ్యాసమహాభారతం శాంతిపర్వంలోని సూక్తి- మూర్ఖులు నలోకే దీప్యతే మూర్ఖః కేవలాత్మప్రశంసయా అని సంబోధించి, ఇట్టివారికి లోకంలో ప్రకాశం కలుగదు, సత్కీర్తి ప్రతిష్ఠలు లభించవు అని పేర్కొన్నది. పూలలో ఉండే సుగంధాన్ని గురించి ఎవరూ చెప్...

స్వర్గధామం జన్మభూమి

స్వర్గధామం జన్మభూమి Posted On:2/13/2015 12:25:41 AM నింగికెగిసే సామర్థ్యం నేలపై నిలబడి ఆకాశంవైపు చూసే ఆనందం ముందు చిన్నబోతుంది. వర్షపు జల్లుకై ఎదురుచూపు కన్నా దానికి ముందే పరిమళించే మట్టివాసన తృప్తినిస్తుంది. మనిషి ఎదిగినా తల్లిదండ్రులకు తనయుడే. వాస్తవం కంటే ఊహ చాలా అందంగా ఉంటుంది. కానీ చిరకాలం తోడుండేది వాస్తవమే. అట్లాగే విస్తృతమైన ప్రపంచంలో ఉద్యోగపర్వంలో, బతుకువేటలో అనేక ప్రాంతాలు వలస వెళ్ళే జనం ఉన్నవూరి కన్నా తన ఊరికై తపిస్తుంటారు. ఆ సంబంధం అం త బలీయమైంది. అస్థిత్వాన్నిచ్చిన తల్లిఒడిలాంటి జన్మస్థలం, నాది అనుకునే హక్కులిచ్చిన ఊరు ఎవ్వరికైనా అపురూపమైనదే. వాసః కాంచన పంజరే నృపకారమ్భోజైస్తనోర్మార్జనం భక్ష్యం సాధు రసాల దాడి మపలం పేయం సుధాభం పయః పాఠః సంసది రామనామ సతతం ధీరస్స కీరస్యమే హావాహన్త తథాపి జన్మవిటపిక్రోడే మనోధావతి॥ స్వేచ్ఛాకజీవిగా, ధీరగా జీవించిన నేను చిలుకను, బంగారు పంజరంలో నివసిస్తున్నారు. రాజు తన చేతులతో నన్ను ప్రేమగా స్పృశిస్తుంటాడు. మంచి మామిడి, దానిమ్మ పళ్ళను ఆరగిస్తున్నాను. అమృతం లాంటి నీళ్ళు తాగుతుంటాను. రామనామం స్మరిస్తుంటాను. ఇన్ని ఉన్నా నా మనస్సు నే పుట్టిన చెట్ట...

ఆత్మావలోకనం

ఆత్మావలోకనం Posted On:2/6/2015 11:53:44 PM లోక పరిశీలనాశక్తి, ఆత్మసంకల్పం మనిషిని తారాస్థాయికి చేర్చాయి. జీవన పోరాటంలో కాలం సంధించే సమస్యల వలయాలు చేజేతులా చేసుకున్న పొరపాట్లు తాలూకు గుణపాఠాలు మనిషిని మరింత దృఢం చేస్తూనే ఉన్నాయి. కానీ యాంత్రిక జీవనాన్ని పక్కకునెట్టి బతుకు నడుస్తుంది కదా అనే ఆలోచనకు తెరదించి జీవితాన్ని పరికిస్తే మనసు ఆత్మావలోకనం చేసుకొమ్మని సలహా ఇస్తుంది. ఎక్కడి జీవితం మొదలయ్యిందో అక్కడి నుంచి జీవన చిత్రం మనోఫలకంపై కదలాడుతుంటే ఎంతో సాధించామన్న గర్వం ఎన్నిటిని దాటి ఈ స్థాయికి చేరామనే భావం ఏదో మూలన దాగుంటా యి. ఏమీ చేయలేకపోయామనే బాధ మనసును తొలి చేస్తుంటే అసంతృప్తి హుదయ సామ్రాజ్యాన్ని ఆక్రమిస్తుంది. అశాంతి జీవితాన్ని చీకటి చేస్తుంది. నేను అనే భావనలో భగవంతుడున్నాడు. ప్రపంచమంతా భగవత్సరూపం. పరస్పర స్నేహభావంతో, నేను-నాకు అని కాక ఏ ఒక్కరికైనా చేసిన సహాయం, దానం మంచి పనులుగా జీవిత ఖాతాలో చేరిపోతాయి. పుణ్యకర్మలు జీవితాన్ని పునీతం గావిస్తాయి. శిక్షాక్షయం గచ్ఛతి కాలపర్యయాత్ సుబద్ధమూలా నిపతన్తి పాదపాః జలం జలస్థానగతం చశుష్యతి హుతం చదత్తం చ తథైవ తిష్ఠతి॥ కాలం అనేది గడుస్తూ వుంటే...

దుర్జన వచనాలు

దుర్జన వచనాలు Posted On:2/9/2015 11:53:47 PM అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను అనే పద్యము తెలుగువారందరికీ సుపరిచితమే. సజ్జనులు ఇతరుల మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా మాట్లాడుతారు. అల్పుడు తనను అందరూ గొప్పగా భావించాలనే ఉద్దేశ్యంతో తనలో లేని గొప్పతనాన్ని ఉన్నట్టుగా చెప్పుతాడు. గొప్పలకు పోతాడు. అసత్యాలను పలుకడానికి కూడా వెనుకాడడు. అయితే అల్పుల పలుకుల కన్న సజ్జనుల సంభాషణ కన్న భిన్నంగా దుర్జన వచనాలు ఉంటాయి. ఇవి ఇతరులను అమితంగా బాధించేవిగా ఉంటాయి. పైగా చాలా తీక్ష్ణంగా ఉంటాయి. మండు వేసవిలో భరించలేనంత తీక్ష్ణంగా ఉండే సూర్యకిరణాలవలె మలమల మాడుస్తాయి. తీవ్రంగా తపింపజేస్తాయి. తెలిసి పట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా కాల్చే అగ్నివలె దుర్జనుల వాక్కులు తీవ్రంగా గాయపరుస్తాయి. మసిచేస్తాయి. స్వపరభేదం లేకుండా అందినదాన్నల్లా కాల్చేసే స్వభావం కల అగ్నికన్నా, వేల మైళ్ళ దూరంలో ఉన్నవారిని కూడా బాధించే సూర్య కిరణాల కన్నా ఎక్కువ తీక్షంగా ఉండేవే దుర్జన వచనాలు. సూర్యకిరణాలలోని, అగ్నిలోని వేడిమి శరీరాన్ని మాత్రమే గాయపరుస్తాయి. కాని దుర్జన వచనాలు మనసును గాయపరుస్తాయి. మనసుకు గాయమైతే మనిష...

సుభాషితం

సుభాషితం Posted On:2/11/2015 1:55:52 AM భూమండలంపై జలం, అన్నం, సుభాషితం అనే మూడు రత్నాలు వెలుగొందుతాయనీ, అవే జీవ న రత్నాలనీ విజ్ఞుల ప్రభోధం. మనిషి భౌతికంగా ఎదిగేందుకు జలం, అన్నం ఎంత అనివార్యమో మానసిక మనుగడకు సుభాషితం అంతే అవసరం. మంచి ఎవరు చెప్పినా, ఎక్కడ నుంచి వచ్చినా నేర్చుకోవాలని వేదం చెబుతుంది. సామాజిక నేపథ్యంలో మనిషి ఎదగాలంటే తల్లిదండ్రులూ, గురువులూ, స్నేహితులూ, శ్రేయోభిలాషులూ, మార్గదర్శకులు ఇలా ప్రతి ఒక్కరూ మంచిమాటలు చెబుతూ భావితరాన్ని ప్రోత్సహించాలి. వారు చెప్పేమాటలు వింటూ పిల్లలు ఎదగాలి. జీవితం అందించే విభిన్న కోణాల్లో మనిషి మనుగడ కొనసాగాలంటే సుభాషితం మాత్రమే ఆలంబనం. సుభాషితం హారి విశత్యధో గలాన్న దుర్జనస్యార్క రిపోరివామృతమ్ తదేవ ధత్తే హృదయేన సజ్జనో హరిర్మహారత్నమివాతి నిర్మలమ్‌॥ సూర్య భగవానుని శత్రువైన కేతువుకు తల తప్ప శరీరమే లేదు గనుక అమృతం హృదయంలోకి చేరదు. సహృదయమే లేని దుర్జనుడికి సుభాషితం హృదయాన్నెలా చేరుతుంది. అదే సుభాషితం శ్రీహరి హృదయసీమను కౌస్తుభం చేరినట్లుగా సజ్జనుని హృదయంలో నిలిచిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ మూలాలను ఆధారం చేసుకొని వివేకానందుడు చెప్పిన సుమధుర ...

దీర్ఘాయుష్యం

దీర్ఘాయుష్యం Posted On:2/12/2015 3:39:44 AM పెద్దలకు నమస్కరించే సంప్రదాయం మనది. పెద్దలందరూ తమకు నమస్కరించేవారికి చిరంజీవ (చాలా కాలం జీవించుము), దీర్ఘాయుష్యం అస్తు (దీర్ఘమైన ఆయుర్దాయము లభించుగాక) అనే ఆశీర్వాదాన్ని అందిస్తూ ఉంటారు. మానవులు శతం జీవ శరదః అనే రీతిలో వంద సంవత్సరాలు జీవించాలని వేదమాతెక్క ఆకాంక్ష. శతమానం భవతి అంటూ మనుష్యులు నూరు సంవత్సరాలు జీవించాలని వేద పండితులు ఆశీర్వదిస్తూ ఉంటారు. సర్వేజనాః సుఖినో భవంతు (జనులందరూ సుఖంగా ఉందురుగాక), లోకాస్సమస్తా స్సుఖినో భవంతు (లోకాలన్నీ సుఖంగా ఉండుగాక), స్వస్తి ప్రజాభ్యః (ప్రజలకు శుభం కలుగుగాక) అని పురోహితులు ఆశీర్వాద పురస్సరంగా ఆకాంక్షిస్తూ ఉంటారు. జనులలో సజ్జనులు, దుర్జనులు ఉంటారు కదా. అందరూ బాగుండాలి అని కోరుకుంటే సజ్జనులతో పాటు దుర్జనులు కూడా బాగుండాలని కోరినట్లు అవుతుంది. దుర్జనులు బాగుంటే వారు చేసే దుర్మార్గాలు కూడా రోజురోజుకీ పెరిగిపోతుంటాయి కదా. అందువల్ల జనులందరూ ముందుగా సజ్జనులు కావాలి. సజ్జనులందరూ క్షేమంగా ఉండాలని కోరడంలోనే ఔచిత్యం ఉంటుంది. సర్వేజనాః సజ్జనాః భవంతు, సజ్జనాః సర్వే సుఖినో భవంతు అని సమాజానికి హితాన్ని ప్రబోధిస్త...

12 HOUR SIVARATRI MUSIC FESTIVAL ON 17.02.2015

Image
Mahidhara Seeta Rama Sarma Yesterday at 10:44am  ·  I INVITE ALL FOR THE 12 HOUR SIVARATRI MUSIC FESTIVAL ON 17.02.2015. PLEASE COME AND ENJOY THE MUSIC.

SRIKALAHASTHI_SIVARATRI BRAHMOTSAVAMS-2015 FEB 12 TO 24

Image
​​హరిఃఓమ్ ఓమ్ నమో నారాయణాయ శివరాత్రి బ్రహ్మోత్సవాలు-శ్రీకాళహస్తి- 2015 ఫిబ్రవరి 12-24  SIVARATRI BRAHMOTSAVAMS-2015 FEB 12 TO 24 http://telugudevotionalswaranjali.blogspot.in/2015/02/maha-shivaratri2015.html హరిఃఓమ్ ఓమ్ నమో నారాయణాయ. భగవత్సేవలో, బ్రహ్మచారి విజయానంద .-081 06 85 19 01 శ్రీ శుకబ్రహ్మఆశ్రమము-517640 శ్రీకాళహస్తి-ఆంధ్రప్రదేశ్-ఇండి యా HARI OM. OM NAMO NARAYANAYA, IN THE SERVICE OF THE ALMIGHTY, BRAHMACHARI  VIJAYANANDA, SRI SUKA BRAHMA ASHRAM-517640. SRIKALAHASTI-(AP)-INDIA 081 06 85 19 01 Sivaratri Cultural Programmes-శ్రీకాళహస్తి Sivarayri Bramhostava Invitation

kamba-ramayana-in-english

Today by the wishes, blessings and prayers of you all I completed the translation of Kamba Ramayanam In to English.May God bless you all. The index of the various sections is given in  http://englishkambaramayanam. blogspot.in/2015/01/index-of- kamba-ramayana-in-english.html

శ్రేయోమార్గం

Image
శ్రేయోమార్గం Posted On:2/6/2015 2:55:40 AM పశుపక్ష్యాదులకంటె విశిష్టుడైన మానవునికి శ్రేయస్సును కలిగించే మార్గాలను ఆర్షవాఙ్మయం మనకు విస్పష్టంగా తెలుపుతున్నది. సర్వప్రాణుల పట్ల మృదు ప్రవర్తనను, వ్యవహారాలలో ఋజుప్రవర్తనను కలిగియుండుట, తోటి వ్యక్తులతో మధురంగా మాట్లాడుట, నిస్సంశయమైన శ్రేయోమార్గం - మార్దవం సర్వభూతేష వ్యవహారేష చార్జవమ్ వాక్ చైవ మధురా ప్రోక్తా శ్రేయ ఏతదసంశయమ్ ॥ అని మహాభారతం శాంతి పర్వంలో చెప్పబడింది. మిత్రులపట్ల అనుగ్రహమును, శత్రువులపట్ల నిగ్రహమును కలిగియుంటూ శాస్త్రోక్త ప్రకారంగా ధర్మాచరణ చేస్తూ ధర్మబద్ధంగా ధనార్జనను, భోగానుభవాన్ని కొనసాగించెడివారు శ్రేయస్సును పొందుతారు. అనుగ్రహం చ మిత్రాణాం అమిత్రాణాం చ నిగ్రహమ్ సంగ్రహం చ త్రివర్గస్య శ్రేయ ఆహుర్మనీషిణః ॥అని శాన్త్రపండితులు పేర్కొన్నారు. వ్యాస మహాభారతంలోని గురుపూజా చ సతతం, వృద్ధానాం పర్యుపాసనమ్‌ శ్రవణంచైవ శాస్త్రాణాం కూటస్థం శ్రేయ ఉచ్యతే ॥ అనే శ్లోకము పేద-ధనిక, పండిత-పామర తారతమ్యం లేకుం డా జాతి-మత-వయో-ప్రాంత భేదము లేకుండా, అందరూ తమకు విజ్ఞానాన్ని ప్రబోధించిన గురువులకు, వయోవృద్ధులకు, జ్ఞాన వృద్ధులకు, అనుభవజ్ఞులకు గౌరవమర్...

SRI LAKSHMI VENKATESHWARA POLAPRAGADA CHARITABLE TRUST

Image
SRI LAKSHMI VENKATESHWARA POLAPRAGADA CHARITABLE TRUST 

Parama gurustotramu

Image
Parama gurustotramu ​​ హరిఃఓమ్ ఓమ్ నమో నారాయణాయ. భగవత్సేవలో, బ్రహ్మచారి విజయానంద .-081  06 85 19 01 శ్రీ శుకబ్రహ్మఆశ్రమము-517640 శ్రీకాళహస్తి-ఆంధ్రప్రదేశ్-ఇండియా HARI OM. OM NAMO NARAYANAYA, IN THE SERVICE OF THE ALMIGHTY, BRAHMACHARI  VIJAYANANDA, SRI SUKA BRAHMA ASHRAM-517640. SRIKALAHASTI-(AP)-INDIA

తపశ్చర్య

తపశ్చర్య Posted On:2/4/2015 1:33:07 AM వేదవిహితములైన పరమపావనకరములైన యజ్ఞ-దాన-తపములు అను కర్మలను ప్రతిఒక్కరు తప్పక ఆచరించవలసిందే. వేదవిహిత కర్మలలో ఒకటైన తపమును ఆచరించడమంటే అన్నం తినకుండా, ఏ రకమైన ద్రవ పదార్థాలను కూడా తీసుకోకుండా, ఉపవాసదీక్షతో ఉంటూ శరీరాన్ని శుష్కింపచేసుకోవడం కాదు. మనసు యొక్క, ఇంద్రియముల యొక్క ఏకాగ్రతయే గొప్ప తపము మనసశ్చేంద్రియాణాంచాపి ఐకాగ్య్రం పరమం తపః అని చెప్పబడినది.అహింస, సత్యము, దమము, నీచబుద్ధి లేకుండుట, మార్దవము, దయ అనే గుణములను అలవరచుకొనుటయే నిజమైన తపస్సు - అహింసా సత్యవచనం ఆనృశంస్యం దమో ఘృణా ఏతత్ తపోవిదుః ధీరా న శరీరస్య శోషణమ్ ॥ అని మహాభారతం శాంతిపర్వంలోని సూక్తి మనకు ప్రబోధిస్తున్నది. మాటలతో కాని, చేష్టలతోకాని, మన సంకల్పములలోగాని ఎవరినీ ఏ రకంగా కూడా బాధించకపోవడాన్ని అహింస అంటారు. మూడు కాలాలలో బాధింపబడని సరైన వాక్కును సత్యమని అంటారు. ఉన్నది ఉన్నట్లు చెప్పడం కాకుండా సర్వ ప్రాణి సంక్షేమా న్ని కోరుతూ చెప్పే మాటలే, చేసే క్రియలే సత్య శబ్దముచే ప్రకటింపబడుతాయి సత్యం భూతహితం ప్రోక్తం యథార్థ కథనం నహి అనే వ్యాస భారతసూక్తి వెల్లడిస్తున్నది. బాహ్యంగా ఉండే ఇంద్రియముల...

ఆధ్యాత్మికం,ఆహ్లాదం,అడ్వెంచర్‌ చెర్వుగట్టు క్షేత్రం

Image
ఆధ్యాత్మికం,ఆహ్లాదం,అడ్వెంచర్‌ చెర్వుగట్టు క్షేత్రం Updated : 1/29/2015 12:24:41 PM Views : 599 మూడు కిలోమీటర్ల దూరంలో ఉండగానే మైకుల నుంచి శివ-పార్వతుల స్తోత్రాలు చెవులను చేరుతున్నాయి. నార్కట్‌పల్లికి సమీపంలో యల్లారెడ్డిగూడెం వద్ద అద్దంకి హైవేను దాటి ముందుకు సాగుతోంది మా ప్రయాణం. పార్వతీ సమేత జడల రామలింగేశ్వరుడు కొలువైన చెర్వుగట్టు క్షేత్రమే మా గమ్యం. శివాలయమే కావచ్చు.. కానీ ఆధ్యాత్మికతను మించిన ఆహ్లాదాన్నీ, అడ్వెంచర్‌నూ అక్కడ రుచి చూడవచ్చు. బ్రహ్మోత్సవాల వేళ కిక్కిరిసిన జన సందోహం నడుమ గుట్ట పైకి మెట్ల మార్గంలో వెళ్లినా.. ఫీట్లు పడుతూ ఘాట్ రోడ్డులో పయనించినా.. ఆ థ్రిల్ అనుభవించాల్సిందే తప్ప మాటల్లో చెప్పలేం. ఇక పైనున్నంత సేపూ కలిగే ప్రత్యేక అనుభూతి.. మూడు గుండ్ల ముచ్చట.. కోనేటి స్నానం.. కొత్తగా కట్టిన కల్యాణ మండపం.. వాటిని మించి రామలింగేశ్వరుడి దర్శనం ఇలా ప్రతిదీ వర్ణనకు కొత్తగా మాటల మూటలను చేర్చే అంశమే. నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు.. ఇక్కడ నిత్యం జన సందోహమే.. ఇక జాతర సమయంలో అయితే.. ఇసుకేస్తే అన్న చందంగా గుట్ట నిండా జన జాతరే. స్వాగత తోరణం నుంచే జాతర సంబురం కళ్లల్లో నింప...