Posts

Showing posts from 2014

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్ రావు గారి వ్యాఖ్యానము " అమ్మ "

Image
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్ రావు గారి వ్యాఖ్యానము " అమ్మ " ను గురించి ......

Mahaneeyudu Manishi

మహనీయుడు మనిషి Posted On:12/13/2014 1:35:48 AM షడ్ దోషాః పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్ఛతా! నిద్రా తంద్రా భయం క్రోధ ఆలస్యం దీర్ఘసూత్రతా॥ మనుషులంతా ఉన్నతంగా బతకాలనీ కోరుకుంటారు. అయితే అభ్యున్నతిని కోరేవారు ముఖ్యంగా ఆరు దోషాలను విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతుంది. నిద్ర, బద్ధకం, భయం, కోపం, అలసత్వం దీర్ఘసూత్రత (ఎటు తెగని ఆలోచన) ఈ ఆరు దోషాలను మనుషులు తమ తమ ఆధీనంలో ఉంచుకోవాలి. ప్రణాళికాబద్ధంగా వీటిని జయించి కలలను సాకారం చేసుకునే దిశగా జీవితాన్ని సఫలం చేసుకోవాలి. జీవన పయనంలో ఎత్తుపల్లాలూ, ఆటుపోట్లూ తప్పవు. పరిస్థితులు అందించే అనుకోని అనుభవాలు ఎదురుదెబ్బలు తగిలినప్పుడు, ఎంతటివారైనా కుంగిపోతారు. నిరాశా నిస్పృహలు అలుముకొని ముభావంగా మా జీవితమే ఇంతని గడుపుతుంటారు. తనకు మించి తాను ఉన్నతంగా లేని మానవుడు హీనస్థితికి చేరుకుంటాడన్న మహానుభావుల అనుభవసారం గుర్తుచేసుకుంటూ ఆశాపూరిత భావాలతో కృషి చేయాలి. ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మాన మీవ సాదయేత్‌ ఆత్తైవహి ఆత్మనోబంధుః ఆత్తెవరిపురాత్మనః॥ మానవుడు తనను తానే ప్రోత్సహించుకోవాలి. ఉద్ధరించుకోవాలి. ఎన్నడూ నిరుత్సాహానికి తావివ్వకూడదు. ఎందుకంటే మనిషికి మనిషే మిత్రు...

Satsangatyam

సత్సాంగత్యం Posted On:12/17/2014 1:22:18 AM యద్భావం తద్భవతి అన్నట్లు మనం ఎటువంటివారితో కలిసివుంటే మనకు అటువంటి లక్షణాలు అబ్బుతాయని మన పెద్దల అనుభవం. ఆరునెలల సహవాసం చేస్తే వారు వీరౌతారని లోకప్రసిద్ధి. సదాచారణ, సదాశయాలు కలిగిన సాధుసజ్జనులతో సాంగత్యాన్ని కలిగివుంటే ఐహికమైన సుఖసంతోషాలతో పాటు ఆముష్మికమైన శ్రేయస్సును కూడా పొందవచ్చు. సత్పురుషుల దర్శనం పుణ్యాన్ని కలిగిస్తుంది. సత్పురుషుల స్పర్శవల్ల సకల పాపాలు తొలగుతాయి. సత్పురుషులతో మాట్లాడటం వల్ల పవిత్రమైన అనేక నదుల్లో స్నానం చేసినట్టి ఫలితం కలుగును. సత్పురుషులకు చేసే నమస్కారం ముక్తిని ఇస్తుంది. సాధూ నాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనమ్ సంభాషణం తీర్థకోటి వందనం మోక్షకారణమ్ ॥ అని ఆర్యోక్తి. సత్యాంగత్యం వల్ల మందబుద్ధి తొలగుతుంది. సత్సాంగ త్యం సత్యమైన వాక్కులనే పలికిస్తుంది. పాపాన్ని దూరం చేస్తుంది. మనస్సును నిర్మలంగా ఉంచుతుంది. కీర్తిప్రతిష్ఠలను అంతటా వ్యాపింపచేస్తుంది. సత్సాంగత్యాన్ని కలిగియున్న భక్తులకు అందరి అభిమానం సులభంగా అందుతుంది.ఈ విధమైన బహుళ ప్రయోజనాలను అందించే సత్సాంగత్యం మనకు చేయలేని మేలు అంటూ ఏదీ ఉండదు జాడ్యం ధియో హరతి వాచి స...

Bhaktuni Pratigna

భక్తుని ప్రతిజ్ఞ Posted On:12/18/2014 1:50:21 AM భక్తరక్షణకై దుష్టశిక్షణకై శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా, ఇంకా ఎన్నెన్నో రూపాలతో పరమాత్మ భూమిపైకి దిగివచ్చాడు. ఆయా అవతారాలను ఎత్తిన సమయంలో పరమాత్మ తాను చేసిన ప్రతిజ్ఞకు చెప్పిన మాటలకు కట్టుబడి భక్తజనులను ఎందరెందరినో ఉద్ధరించాడు.అయితే కొన్నిసార్లు తన భక్తుడి ప్రతిజ్ఞను నెరవేర్చే క్రమంలో తన ప్రతిజ్ఞను కూడా వదిలాడు. తాను తన మాటకు కట్టుబడి ఉండుటకన్నా, తన భక్తుని ప్రతిజ్ఞ నెరవేర్చుటయందే దృఢదీక్షను పూనియుంటానని తన ఆచరణ ద్వారా లోకానికి చాటిచెప్పాడు. శ్రీకృష్ణావతార సందర్భంలో భగవానుడు ఆయుధం పట్టనని తాను చేసిన ప్రతిజ్ఞకన్నా తన భక్తుడైన భీష్మాచార్యుడు పరమాత్మచేత ఆయుధం పట్టిస్తాను అని చేసిన ప్రతిజ్ఞను నెరవేరుస్తూ యుద్ధభూమిలో రథచక్రాన్ని చేపట్టాడు. అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరుటకు తన చక్రంతో సూర్యకిరణాలను అడ్డుకొని సూర్యాస్తమయం అయినట్లు భావించేరీతిలో ఒక సందర్భాన్ని కల్పించాడు. హిరణ్యకశుపుని, రావణాసురుని తపస్సులను మెచ్చి బ్రహ్మరుద్రులు ఇచ్చిన వరాలకు ఆటంకం లేకుండా శ్రీహరి నృసింహ, శ్రీరామాది అవతారాలనెత్తాడు. పరమాత్మ అంతటా వ్యాపించియున్నాడు అని భక్తప్...

చాగంటి గారి ప్రవచనములు

Image
Courtesy:  http://chagantipravachanamulu.blogspot.in/search?updated-min=2014-01-01T00:00:00-08:00&updated-max=2015-01-01T00:00:00-08:00&max-results=13 చాగంటి గారి ప్రవచనములు  Chaganti gari Speech at HMA Part 1 Part 2 Part 3 Part 4 No comments: Email This BlogThis! Share to Twitter Share to Facebook Share to Pinterest Facts about Sri Chaganti Koteswara Rao Gari GURUVANI No comments: Email This BlogThis! Share to Twitter Share to Facebook Share to Pinterest About Lord Hanuman by Sri Vaddiparthi Padmakar Garu No comments: Email This BlogThis! Share to Twitter Share to Facebook Share to Pinterest About Chaganti Koteswara Rao garu Brahmasri Chaganti Koteswara Rao (చాగంటి కోటేశ్వరరావు) is an eminent speaker on matters related to Sanathana Darma. He was born to Sri Chaganti Sundara Siva Rao garu and S...

LORD KRISHNA AT OUR HOME TODAY

Image
LORD KRISHNA AT OUR HOME TODAY

Mahaneeyudu Manishi

మహనీయుడు మనిషి Posted On:12/13/2014 1:35:48 AM షడ్ దోషాః పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్ఛతా! నిద్రా తంద్రా భయం క్రోధ ఆలస్యం దీర్ఘసూత్రతా॥ మనుషులంతా ఉన్నతంగా బతకాలనీ కోరుకుంటారు. అయితే అభ్యున్నతిని కోరేవారు ముఖ్యంగా ఆరు దోషాలను విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతుంది. నిద్ర, బద్ధకం, భయం, కోపం, అలసత్వం దీర్ఘసూత్రత (ఎటు తెగని ఆలోచన) ఈ ఆరు దోషాలను మనుషులు తమ తమ ఆధీనంలో ఉంచుకోవాలి. ప్రణాళికాబద్ధంగా వీటిని జయించి కలలను సాకారం చేసుకునే దిశగా జీవితాన్ని సఫలం చేసుకోవాలి. జీవన పయనంలో ఎత్తుపల్లాలూ, ఆటుపోట్లూ తప్పవు. పరిస్థితులు అందించే అనుకోని అనుభవాలు ఎదురుదెబ్బలు తగిలినప్పుడు, ఎంతటివారైనా కుంగిపోతారు. నిరాశా నిస్పృహలు అలుముకొని ముభావంగా మా జీవితమే ఇంతని గడుపుతుంటారు. తనకు మించి తాను ఉన్నతంగా లేని మానవుడు హీనస్థితికి చేరుకుంటాడన్న మహానుభావుల అనుభవసారం గుర్తుచేసుకుంటూ ఆశాపూరిత భావాలతో కృషి చేయాలి. ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మాన మీవ సాదయేత్‌ ఆత్తైవహి ఆత్మనోబంధుః ఆత్తెవరిపురాత్మనః॥ మానవుడు తనను తానే ప్రోత్సహించుకోవాలి. ఉద్ధరించుకోవాలి. ఎన్నడూ నిరుత్సాహానికి తావివ్వకూడదు. ఎందుకంటే మనిషికి మనిషే మిత్రు...

Manava Sambandhalu

మానవ సంబంధాలు Posted On:12/19/2014 12:48:09 AM దేశమంటే మట్టి మాత్రమే కాదు, దేశమంటే మనుషులు అన్నట్లు వ్యక్తి ఎన్నడూ ఒంటరి కాదు. వ్యక్తి అంటే వ్యవస్థ. కుటుంబం అనే పునాది వేసుకొని, బంధాలు, అనురాగాలు స్నేహాలు, మరువలేని పరిచయాలు, నైతిక విలువలు... ఇటుకలుగా చేసుకొని ప్రపంచమనే మహాసౌధాన్ని నిర్మించుకున్న మహా మనిషి మనిషి. వ్యతిషజతి పదార్థానంతరః కోపి హేతుః నఖలు బహిరుపాధీన్ ప్రీతయః సంశ్రయంతే! వికసతి హి పతంగ స్యోదయే పుండరీకం ద్రవతి చ హిమరశ్మావుద్గతే చంద్రకాంతః॥ మానవ విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీరాముని మానసిక దృక్పథానికి అద్దంపట్టే సందర్భాన్ని నిశితంగా పరిశీలిస్తే - సూర్యోదయం కాగానే కమలం వికసిస్తుంది. చంద్రుని వెన్నెల రాగానే చంద్రకాంతశిల ద్రవిస్తుంది. అనంత వినీలాకాశంలో ఉండే సూర్యచంద్రులకూ, అల్లంతదూరంలో భువిపై, నీటిలో ఉండే వాటికి గల ఆకర్షణశక్తి ఎంతబలీయమైనది, దృఢమైనది. అలాగే లవుడు, శ్రీరామునికి ఎదురుపడినపుడు నిమిత్తమెరుగని స్నేహం, ప్రేమ, వాత్సల్యం హృదయసీమను అలంకరించాయట. బాంధవ్యంలోని గొప్పతనమేమిటంటే అంతః కరణాదులను వ్యక్తీకరించలేని కారణం దగ్గరకు లేస్తుంది. బుద్ధికతీతమై కారణం ఆకర్షణకు గు...

Bheeshmuni Jananam

భీష్ముని జననము Posted On:12/20/2014 2:02:09 AM ఒకనాడు వేట నిమిత్తము బయలుదేరిన శంతనుడు గంగానదీ తీరమున మహాద్భుతమైన అందమైన స్త్రీని చూసెను. ఆమె అపర లక్ష్మీదేవీ వలె రూప సౌందర్యమును కలిగి ఉండటం చూసి శంతనుడు చకితుడయ్యెను. ఆ దివ్యమైన స్త్రీ యెడల తన ప్రేమ ఇనుమడించి శంతనుడు తన మిక్కుటమైన కోరికను తెలిపెను. ఆ గంగాదేవి ఇట్లనెను- ఓ రాజా ! నేను మీకు రాణిగా ఉండటం నాకిష్టమే కానీ మీరు నా మాట ఎప్పుడూ కాదనకూడదు. ఒకవేళ మీరు నన్ను విమర్శిస్తే నేను వెళ్లిపోగలను. అష్ట వసువులు వసిష్ఠుని శాపము వలన శంతనుని ద్వారా గంగకు జన్మించిరి. వెనువెంటనే గంగలో, గంగచేతనే విసిరివేయబడి శాప విమోచన పొందిరి. అష్టమ వసువైన భీష్మున్ని కూడా గంగ తీసికెళ్లు సమయములో శంతనుడు వారించినందువలన భీష్మున్ని శంతనునికి వప్పగించి తాను వెళ్లుటకు సిద్ధపడెను. శంతనుడు గంగను ఉద్దేశించి ఇట్లడిగెను- ఈ వసువులకు వసిష్ఠుడు శాపమెందుకిచ్చెను మరియు అష్టమ వసువైన భీష్ముడు భూలోకమున ఎందుకుండ వలెను? గంగాదేవి ఇట్లు చెప్పెను- విశ్వ విఖ్యాతమైన వసిష్ఠుడు వరుణుని పుత్రుడు. అతడు మేరు పర్వతము దగ్గర ఉన్న ఆశ్రమములో ఉండేవాడు. కామధేనువు యొక్క పుత్రికయైన నందిని వసిష్ఠున...

Parusha Vakku

పరుషవాక్కు Posted On:12/24/2014 1:51:55 AM విస్పష్టమైన భావవ్యక్తీకరణకు భగవంతుడు మానవులకు ప్రసాదించిన అమోఘమైన వరమే వాక్కు. ఈ వాగ్భూషణం మానవులను మహనీయులుగా తీర్చిదిద్దగలుగుతుంది. పశుపక్ష్యాదులకు లేని సౌకర్యం మానవులకు లభించినందుకు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొనవలసినదే. అంతే తప్ప ఏ దశలోనూ వాక్కును దుర్వినియోగం చేయరాదు. ప్రియమైన వాక్కుతో సాధ్యమైనంతగా అందరినీ సంతోషింపచేయాలి. అంతే కాని ఎదుటివారిని నొప్పించే పద్ధతిలో పరుషమైన వాక్కులను పలుకవద్దు అని ఆర్యాశతకకర్తయైన సుందరపాండ్యుడు లోకానికి హితప్రబోధం చేశాడు. యుద్ధాలలో మనుషలను ఆయుధాలు గాయపరుస్తూ ఉంటాయి. విషం మానవుల ప్రాణాల ను హరిస్తుంది. నిప్పు నిలువునా మనిషిని కాల్చివేస్తుంది. పాపకర్మలు మనిషిని అప్పుడప్పు డూ ఆయా సందర్భాలనుబట్టి పీడిస్తూ ఉంటాయి. కాని ఇవేవీ బాధించని రీతిలో హృదయానికి కుచ్చుకున్న ముల్లులా మనుషలను ప్రతి క్షణం పట్టి పీడించేవి పరుషంగా పలికే పలుకులే . న తథా రిపుః న శస్త్రం నాగ్నిః న విషం న దారుణో వ్యాధిః పరితాపయతి చ పురుషం యథా కటుకభాషిణీ వాణీ ॥ అని సుందరపాండ్యుని ఆర్యోక్తి. (ఆర్యావృత్తంలో పలికిన సూక్తి). కఠినంగా, ప...

Vijaya Patham

విజయపథం Posted On:12/26/2014 2:27:08 AM లోకంలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ తమ తమ రంగాల్లో తప్పక విజయా న్ని సాధించాలని కోరుకుంటూనే ఉంటారు. ఆటల్లో, పాటల్లో, మాటల్లో, వివిధ వ్యవహారాలలో, విద్యా ఉద్యోగ వ్యాపార పరిపాలనాది రంగాలలో విజయాన్ని స్వంతం చేసుకోవాలనుకునేవారి కి జిహ్వా యేన జితా త్రైలోక్యమపి తేన జితం అనే సూక్తి ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తున్నది. ఎవరైతే నాలుకను గెలుస్తారో, వారు ముల్లోకాలను గెలిచినట్లేనట. నాలుకను గెలవడం అంటే .... నాలుకతో చేసే రెండు పనులలో జాగ్రత్త వహించటమే. 1)నాలుకతో మాట్లాడే మాటలపై నియంత్రణ కలిగియుండటం. అవసరమైన మాటలనే మాట్లాడ టం. మితిమీరి మాట్లాడకపోవటం. 2)నోటితో తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించటం. కొందరు రుచికరమైన పదార్థాలపై వ్యామోహంతో ఎంతపడితే అంత, ఎక్కడపడితే అక్కడ, ఏదిపడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తింటూ రకరకాల అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటూ ఉంటారు. జిహ్వాచాపల్యంతో తినడానికే బ్రతుకుతున్నట్లుగా భావిస్తారు. ఇది సరికాదు. నాలుకను తమ నియంత్రణలో పెట్టుకున్న మహనీయులు మాత్రం మితమైన, హితమైన ఆహారాన్ని తీసుకుంటూ బతకడానికే తిండి అనే యథార్థ బుద్ధితో...

Yeka lavya Katha

ఏకలవ్య కథ Posted On:12/27/2014 1:46:17 AM ఒకరోజు ఆచార్యుల వారి అనుమతి తీసుకొని రాజకుమారు లెల్లరు అడవికి వెళ్లిరి. వారి సరుకులు మోస్తూ ఒక అనుచరుడు, ఒక కుక్క కూడా వస్తూ ఉండెను. ఆ కుక్క అటూ ఇటూ తిరుగుతూ ఏకలవ్యుడు సాధన చేస్తున్న తావుకు వెళ్లెను. ఏకలవ్యుడు మొదట ద్రోణాచార్యుని వద్ద శిష్యరికము చేయతలంచెను. కానీ అది కుదరక ఆచార్యుల బొమ్మ పెట్టుకొని అందులో నిపుణుడాయెను. ఆ కుక్క మొరుగుచూ ఆటంక పరచగా ఏకలవ్యుడు ఏడు బాణములు సుతి మెత్తగా దాని నోటిలో నాటెను. ఆ సునిశితమైన బాణవిద్యను గమనించిన అర్జునుడాదిగా గల రాకుమారులు పలుకరించగా నేను ఏకలవ్యుడను, ద్రోణాచార్యుని శిష్యుడననెను. ఆశ్రమమును చేరుకున్న అర్జునుడు ద్రోణాచార్యునితో ఇట్లనెను. గురువర్యా ! ఏకలవ్య నామధేయుడైన మీ శిష్యుడు నా కన్నా మేటి ధనుర్ధరుడు అని విషయమంతా పూసగ్రుచ్చినట్లు వివరించెను. కొద్దిసేపు మౌనంగా ఉన్న ద్రోణాచార్యుడు ఆ పిదప అర్జునున్ని తీసుకొని ఏకలవ్యుని దగ్గరకు చేరుకొనెను. ఆ సమయములో ఏకలవ్యుడు ఎడతెరపి లేకుండా బాణములు సంధిస్తూ అభ్యాసము చేయుచుండెను. ఆచార్యున్ని చూడగానే ఏకలవ్యుడు దగ్గరగా వచ్చి సాష్టాంగ దండ ప్రణామమాచరించి, విధి పూర్వకముగా పూజచే...

Gruhastha Jeevanamu

గృహస్థజీవనము Posted On:12/25/2014 1:55:22 AM సృష్టిలోని ప్రాణులలో మానవజన్మ ఎంతో విశిష్టమైనది అనే విషయాన్ని నరత్వం దుర్లభం లోకే, ప్రాణినాం నరజన్మ దుర్లభం, దుర్లభో మానుషో దేహః వంటి శావాక్యాలు ధ్రువపరు స్తున్నాయి. ఈ మానవజన్మ పూర్వజన్మలలోని పుణ్యఫలంగా లభిస్తుంది మానుష్యం పుణ్య సంచయాత్ అని చెప్పబడింది. మనుష్య జీవనము బ్రహ్మచర్య-గృహస్థ-వానప్రస్థ-సన్యా సము అనే నాలుగు విభాగములతో కూడినది. వేదవేదాంగాది విద్యా సముపార్జనకై ఉద్దేశింపబడినది బ్రహ్మచర్యము. బ్రహ్మచారి విద్యాభ్యాసం తరువాత ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీః అనే శ్రుతివాక్యరూపమైన గురూపదేశాన్ని పురస్కరించుకొని యథా యోగ్యమైన కన్యను అన్వేషించి ఆమెను వివాహం చేసుకొని గృహ స్థ జీవనాన్ని కొనసాగించవలెను.బ్రహ్మచర్య-గృహస్థ-వానప్రస్థ-సన్యా సాశ్రమములలో ఏది ముఖ్యమైనది అనే చర్చ ఉదయించి నప్పుడు, ఏది గొప్పదని తూకం వేసి చూసినట్లయితే బ్రహ్మచర్య- వానప్రస్థ-సన్యాసములు అనే మూడు ఒక ఎత్తు కాగా, గృహస్థజీవనము ఒక్కటియే మరొక ఎత్తు అని పండితులు నిర్ణయించి చెప్పుదురు - ఆశ్రమాం స్తులయా సర్వాన్ ధృతానాహుర్మనీషిణః ఏకతశ్చ త్రయో రాజన్ గృహస్థాశ్రమ ఏకతః ॥ అనే మహాభారతసూక్తి తెలియ...

HYDERABAD BOOK FAIR 2014

Image
HYDERABAD BOOK FAIR 2014

తప్పక చదవండి.. తెలుగు టైపింగ్ లో ఇక మీ సందేహాలకు వీడ్కోలు పల్కండి

Image
  http://telugukala.blogspot.in/2009/12/blog-post_08.html తప్పక చదవండి.. తెలుగు టైపింగ్ లో ఇక మీ సందేహాలకు వీడ్కోలు పల్కండి కంప్యూటర్లో తెలుగు రాయడం తెలుగులో టైపింగు 2007 లో నా ప్రశ్నలు… 1.తెలుగు వికీపీడియాలో టైపు చెయ్యడం సులభంగా వుంది.కాని నెట్లోకి వెళ్ళకుండానే ఎమ్.ఎస్.వర్డ్ లో ఇలా టైపు చెయ్యడం కుదురుతుందా? 2.పి.డి.యఫ్.ఫైళ్ళలోని తెలుగు టెక్స్ట్ ను ఎమ్.ఎస్.వర్డ్ ఫైలులోకి పేస్టు చేసుకో గలమా? __ 3.అనూ ఫాంట్లలో ఉన్న పాఠ్యాన్ని (text) యూనికోడ్లోకి మార్చడం ఎలా? ఆపరేటింగ్ సిస్టమ్ లలో తెలుగును స్ధాపించడం: 1. స్టార్ట్ మెనూ లో Settings > Control Panel కి వెళ్ళండి 2. Control Panel లో Regional and Language Options ని ఎంచుకోండి 3. Languages టాబ్ కి వెళ్ళి అక్కడ Install files for complex script and right-to-left languages (including Thai) అనే చెక్ బాక్సుని ఎంచుకోండి. 4. Apply అనే మీట ని నొక్కండి. 5. Do you want to restart your computer now? అన్నప్పుడు Yes అనే మీటని నొక్కండి.మీ కంప్యూటర్ రీబూట్ అయ్యిన తరవాత తెలుగు చక్కగా కనిపిస్తుంది. ...