ద్వాదశాక్షర మంత్ర స్తోత్రము మూలం: వేదవ్యాస మహర్షి వ్యాఖ్య: స్వామి సుందర చైతన్యానంద #తెలుగు వికీపీడియా LINK
కలియుగము ప్రబల దోషయుత మైనను దాని
నివారణము కూడా కలియుగము - నందే కలదని శుకమహర్షి భాగవతంలో పరీక్షిన్మహారాజుకు చెబుతాడు.
కలి దోషముల నన్నింటిని భగవన్నామము హరిస్తుందని ప్రవచిస్తాడు.
“ఓం నమో భగవతే వాసుదేవాయ”
ఈ పవిత్ర మంత్రం కలి దోషాలను హరిస్తుంది. వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. బుద్ధిని శుద్ధి పరుస్తుంది. మనసులోని మాలిన్యాన్ని తొలగిస్తుంది. హృదయాన్ని తేలిక పరుస్తుంది.
హరిః సదా వసే తత్ర యత్ర భాగవతా
జనా:గాయని భక్తి భావేన హరేర్నామైవ
కేవలమ్ భక్తులు గుమిగూడి ఎచ్చట హరినామమును గానము చేయు చుందురో అచ్చట శ్రీహరి వసించుచుండును.
నామమున్నచోట నారాయణుడుంటాడు. నామము మనకు నామిని ప్రసాదిస్తుంది. స్వామిని ప్రసాదిస్తుంది. నారాయుణు డున్నచోట నరకముండదు. జనార్దన నామంతో జగడాలు దూరమౌతాయి. హరినామంతో హత్యలు అదృశ్యమవుతాయి. కృష్ణనామంతో తృష్ణ నశిస్తుంది. రామనామంతో కామం పలాయన మౌతుంది. భవరోగాలకు భీతి చెందకండి. భగవన్నామం భయాలను భయ పెడుతుంది.
వాతావరణ కాలుష్యం పోవాలా ?
ఇంటి చుట్టూ తులసి మొక్కలు పెంచండి. ఆంతర్య కాలుష్యం తొలగాలా ? అచ్యుతుని నామాన్ని గానం చేయండి. - ఏ కులంవా రెనా చేయవచ్చు. ఏ మతం వారైనా చేయవచ్చుకుళ్ళు సృష్టించినకులాలు కుళ్ళిపోనీ..
ముళ్ళు పరచిన మతాలు మరలిపోనీ. కులాలు మనకొద్దు. అనుకూలమే మన కులం....... మతాలు మనకొద్దు. సమ్మతమే మన మతం..........
నవ సమాజ నిర్మాణానికి నడుం కట్టండి.
కలి పురుషుని ఆగడాలకు కళ్ళెం వేయండి. మంచితనానికి మనిషి తనానికి శుభ పరిణామం ఈ సమయం. కలసి కట్టుగా నామం చేద్దాం ప్రభునామానికి నియమం లేదు....
బుధజన సేవలో
సుందర చెతన్యాశ్రమం గాంధీ జయంతి
ధవళేశ్వరం 2-10-193
.
Comments