#chaitanya_bhagavad_gita #12th_Chapter_20_slokam#lyricsvideo #telugu_lyrical
యే తు ధర్మ్యామృత మిదం యథోక్తం పర్యుపాసతే | శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తే.. తీవ మే ప్రియాః ॥ 20॥ యే-తు- ధర్మామృతం- ఇదం-యథా-ఉక్తం-పర్యుపాసతే శ్రద్ధధానా:-మత్పరమాః-భక్తాః-తే-అతీవ-మే-ప్రియాః అర్జునా! ఈ ధర్మము అమృత స్వరూపము. నా భక్తులు శ్రద్ధావంతులై, నన్నే పరమగతిగా భావించి, నేను చెప్పిన ఈ ధర్మాన్ని ఆచరిస్తారు. అందుకే వాళ్ళు నాకు అత్యంత ప్రీతి పాత్రులు. వ్యాఖ్య ధర్మామృతం ఇది ధర్మ్యామృతం. ఈ అధ్యాయంలో బోధించ బడింది (ఇదం యథోక్తం) ధర్మ్యామృతము ( ధర్మ్యామృతము ). అంటే, ధర్మ్యరూపము మరియు అమృత స్వరూపము అని అర్ధము. ధర్మము నుండి తొలగనిది, వేరు కానిది కనుక ధర్మ్యం ( ధర్మాత్ అనపేతం ధర్మ్యం ). ఇది అమృతత్వానికి కారణం కావడం చేత అమృత స్వరూపము ( అమృతహేతుత్వాత్ ). జనన మరణాల నుండి ఉద్ధరిస్తుంది కనుకఇది అమృత స్వరూపము. కనుకనే భక్తి అమృత స్వరూపము అన్నాడు భక్తి సూత్రాలలో నారద మహర్షి ( అమృత స్వరూపాచ ). భక్తి అమృత స్వరూపము. భగవంతుడు అమృత స్వరూపుడు. భక్తుడు కూడా అమృత రూపుడే.కనుకనే ఈ భక్తియోగం అనే అధ్యాయంలో అమృత వర్షం కురిసింది. అమృత స్వరూపమైన భక్తిని అనుష్టించినవారు అమృత స్వరూపులవుతారు. భగవంతుని పరమగతిగా భావించ...