Wednesday, November 29, 2017

అంతర్యామి-పారాయణం-మహోన్నతం

అంతర్యామి









పారాయణం
రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత- ఇలా ఏదో ఒక గ్రంథ భాగాన్ని కొందరు రోజూ పఠిస్తుంటారు. తమ భక్తిశ్రద్ధలు అనుసరించి లేదా పెద్దల సూచన పాటించి వాటిని చదువుతుంటారు. వాటితో పాటు సహస్ర నామాలు, స్తోత్రాలు, చాలీసాలు ఎన్నింటినో పఠిస్తుండటం పరిపాటి. స్త్రీ పురుష భేదాలకు, బాలలు వృద్ధులు అనే తేడాలకు తావు లేకుండా అందరూ కలిసి పారాయణం చేయడాన్ని అలవాటుగా మార్చుకుంటారు. దినచర్యలో భాగంగా ఇళ్లలో, ప్రార్థనా మందిరాల్లో, ఇతర ప్రదేశాల్లో నియమ నిష్ఠలతో పఠించడమే వారికి ఆనందదాయకం.
‘ఆధ్యాత్మిక గ్రంథాల్ని ఏళ్లతరబడి పారాయణ చేస్తే సరిపోతుందా’ అని ప్రశ్నించేవారున్నారు. ఎటువంటి మానవ ప్రయత్నమూ చేయకుండా, అన్నీ దేవుడే చూసుకుంటాడంటూ పఠిస్తూ కూర్చోవడం సరైనదేనా అని వారు అడుగుతుంటారు. పురాణాల్ని పారాయణం చేయడంవల్ల మానసిక శాంతి కలుగుతుందని అనుభవజ్ఞుల మాట. ఆ గ్రంథాల పఠనం ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. కష్టాల్ని ఎదుర్కొనే శక్తిని కలిగిస్తుంది. చక్కని భాష వస్తుంది. పౌరాణిక, ఇతిహాస కథలు కంఠస్థమవుతాయి. ఉమ్మడి పారాయణం ఐక్యభావాలకు మూలమవుతుంది.
సృష్టిలోని శాశ్వత సత్యాల్ని తరచుగా గుర్తుచేసుకోవడానికి పారాయణమే దోహదకారి. పండిత పామరులకు, సాధువులు సాధకులకు, సర్వులకూ ప్రయోజనకరం. అది ఒక నిరంతర సాధన. మనసును భగవంతుడి వైపు మళ్లిస్తుంది. ధ్యానం, యజ్ఞం, అర్చన, జపం, యోగం- అన్నీ సాధనకు ఉపయోగపడతాయి.
ఏ పనినైనా చేసేవాడు, చేయించేవాడు, ప్రోత్సహించేవాడు, చూసి సంతోషించేవాడు- అందరూ ఫలితం రీత్యా భాగస్థులవుతారు. అవి లౌకిక, అలౌకిక ఫలితాలని రెండు విధాలుగా ఉంటాయి. భగవద్గీత, సహస్ర నామ పారాయణం వంటివి అమృత తుల్యాలు. అందుకే వాటిని గీతామృతం, నామామృతం అని పిలుస్తారు. ఆదిత్య హృదయాన్ని శ్రీరాముడికి అగస్త్యుడు ఉపదేశించాడు. దాన్ని రావణాసురుడితో యుద్ధానికి దిగేముందు రాముడు పఠించడమే ఉత్తమ ఫలితమిచ్చిందంటారు.
స్తోత్రాల్ని ఆత్మవిశ్వాసంతో పఠించాలి. భగవద్గీతను రోజూ భక్తితో పారాయణ చేయడం, జీవితంలో ప్రశాంతతకు కారణమవుతుంది. భాగవతాన్ని మించిన మానసిక ఔషధం లేదంటారు విజ్ఞులు. భాగవతం అంటే- కేవలం కృష్ణుడి కథలు కావు. మహాభక్తుల చరిత్రలెన్నో అందులో ఉన్నాయి. వాటిని పఠించడం స్ఫూర్తిదాయకం.
ఆరాధ్య దైవాలకు ఉన్నంత శక్తి మహాభక్తులకూ ఉంటుంది. ఆంజనేయుడు రామభక్తుడు. ‘మీ అభిమతాలు నేనూ తీరుస్తాను’ అని రామభక్తులతో ఆయన పలు సందర్భాల్లో అంటాడు. ప్రహ్లాదుడు, గజేంద్రుడు, అంబరీషుడు వంటి భక్తుల చరితలు ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు. అందుకే అవి నిత్యపారాయణ గ్రంథాలుగా నిలిచి ఉన్నాయి. పారాయణం చేసే భారతీయుల్లో, అందులోనూ తెలుగువారిలో అనేక ప్రగాఢ విశ్వాసాలున్నాయి. రుక్మిణీ కల్యాణం, శ్రీకృష్ణ జనన ఘట్టం, అంబరీష ఉపాఖ్యానం, విరాటపర్వ పారాయణాలే వీటికి ఉదాహరణలు. రామాయణంలోని సుందర కాండ, లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర స్తోత్రం, విష్ణు-పార్వతీదేవి సహస్ర నామాలు, శివ పంచాక్షరి-నారాయణ మంత్రం పఠనాలూ భక్తుల నమ్మకాలకు ప్రతీకలు.
నరమూర్తిని కీర్తించే బదులు హరిమూర్తిని స్తుతించడం ఎంతో మేలు అంటారు. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపరంలో అర్చన కారణంగా భక్తులు కృతకృత్యులయ్యారు. కలియుగంలో నామ సంకీర్తనమూ అదే ఫలితమిస్తుందని విశ్వాసం. భగవంతుడి నామస్మరణతో మానవుడు భవసాగరం దాటగలడన్నదే పురాణగాథల సారాంశం!
- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు































































































































































































అంతర్యామి మహోన్నతం ‘ఆ ప్రఫుల్ల సుందర వదనం... మబ్బు దొంతరల్లో మిరుమిట్లు గొలిపే మెరుపు తీగ’ అంటూ అరబ్బీ కవి హజ్లీ రాసిన కవిత- ప్రవక్త మొహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లమ్‌కు చక్కగా సరిపోతుందని హజ్రత ఆయెషా (రజి॥) అభివర్ణించారు. ప్రవక్త రూపురేఖల గురించి స్పష్టమైన పటం కాని, దృశ్యం కాని మన ముందు లేదు. ఎలాంటి చిత్రమూ రేఖామాత్రంగానైనా ఎవరి వద్దా లేదు. స్వయంగా ప్రవక్త (స.అ.వ.) ప్రజల్ని చిత్రపటాల నుంచి దూరంగా ఉంచారు. ఏ కల్పనా చిత్రాలూ ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించలేకపోయాయి. అసాధారణ వ్యక్తిత్వం కలిగినవారు నవ నాగరికత నిర్మాతలు. వారి ప్రత్యేకమైన ఆలోచనలు ప్రపంచంలో ప్రభావవంతమైన పరిణామాలకు కారణమవుతాయి. అటువంటి సాటిలేని ఆధ్యాత్మిక విప్లవ సారథి, కారుణ్య కిరణమైన ప్రవక్త మొహమ్మద్‌ (స.అ.వ.) సుందర విగ్రహం- ఆయన సందేశ సరళి, సాధించిన మహోన్నత విజయాల అద్దంలో మనకు కనిపిస్తుంది. ప్రవక్త సహచరులు ఆయన ముఖ వర్చస్సు, శరీర కాంతి, మాటతీరును వర్ణించారు. ముఖారవిందాన్ని అభివర్ణించి తరవాతి తరాలవారి కోసం భద్రపరచారు. మొహమ్మద్‌ (స.అ.వ.) వాక్చాతుర్యం, వివేచన, వినయం, సహనశీలత వంటి గుణగణాలతో గాంభీర్యంగా ప్రకాశించేవారు. ‘దైవభీతి మాత్రమే ముఖాల్ని ప్రకాశవంతం చేస్తుంది’ అని మొహమ్మద్‌ (స.అ.వ.) ప్రకటించారు. దైవ విశ్వాసులు మహాతేజస్సు కలిగి ఉండటం సహజమే. ఆయన ఆభరణాలకు అలంకరణలకు దూరంగా దైవదాసుడిగా వస్త్రధారణ చేసేవారు. సువాసనల్ని ఇష్టపడుతూ, ఎవరైనా ఆ ద్రవ్యాల్ని కానుకగా ఇస్తే సంతోషంగా స్వీకరించేవారు. ప్రవక్త తన జీవితాంతం అర్ధరాత్రి తరవాత లేచి ‘వుజూ’ చేసుకొనేవారు. ‘తహజ్జుద్‌’ నమాజు చేసేవారు. దివ్య ఖుర్‌ఆన్‌ను పఠించేవారు. ఒక్కోసారి ఆయన ప్రార్థనల్లోనే నిలబడినప్పుడు, కాళ్లు వాచిపోయేవి. ‘మీరు ఇంతగా శరీరాన్ని కష్టపెట్టాలా, అల్లాహ్‌ మీకు క్షమాభిక్ష హామీ ఇచ్చాడు కదా’ అని సహచరులు అడిగినప్పుడు ‘నేను కృతజ్ఞుడినైన దాసుడిగా ఉండవద్దా’ అనేవారు. మెత్తటి పడకపై నిద్రిస్తే ప్రార్థనకు లేవలేనని భావించి, నారతాళ్లు పేనిన మంచాలపై పడుకొనేవారు. ఇతరుల పట్ల ప్రేమాభిమానాలు ప్రదర్శించలేని వ్యక్తి, వారినుంచి వాటిని ఆశించరాదని చెబుతుండేవారు. దుఃఖసమయాల్లో ‘మాకు అల్లాహ్‌ చాలు. ఆయనే శ్రేష్ఠుడైన కార్యసాధకుడు’ అని ప్రవక్త పలికేవారు. సున్నిత మనస్కులైన ఆయన కఠిన పరిస్థితుల్లో మొక్కవోని సహనాన్ని, చిత్తాన్ని ప్రదర్శించేవారు. ఇది గొప్పవారికి మాత్రమే సాధ్యం. ప్రవక్త (స.అ.వ.)కు కవిత్వం పట్ల అభిరుచి ఉండేది. భిన్నశైలిలో ఆయన కవిత్వం సాగేది. యుద్ధరంగంలోనూ కవితాత్మకంగా మాట్లాడేవారు. శత్రువులపై కరవాలం కంటే కవిత్వం చాలా ప్రభావం చూపుతుందనేవారు. హజ్రత ఆయెషా (రజి) ప్రస్తావించిన ప్రకారం- ఆయన నడవడి, పద్ధతి అంతా దివ్య ఖుర్‌ఆన్‌. అల్లాహ్‌ అనుగ్రహ విధానాల్ని పాటించడమే కర్తవ్యంగా భావించేవారు. హిజ్రీ శకం 11వ సంవత్సరం సఫర్‌ మాసంలో ప్రవక్త ఆరోగ్యం క్షీణించింది. ‘అన్ని వ్యవహారాల్నీ దేవుడి ఆదేశంతో నిర్వహిస్తుంటారు. ఏదైనా ఆలస్యం జరిగినా తొందర పడవద్దు. ఈ లోకంలో ఎవరూ శాశ్వతంగా జీవించి ఉండటం జరగదు. నేను మీకన్నా ముందు వెళుతున్నాను. మీరు కూడా వచ్చి నాతో కలుస్తారు. మనం స్వర్గలోకంలోని కౌసర్‌ సరస్సు వద్ద కలుద్దాం’ అంటూ సహచరులకు అంతిమ సందేశమిచ్చారు. ఆ మాసంలోని 12వ రోజున అల్లాహ్‌ సాన్నిహిత్యానికి తరలివెళ్లారు. తీవ్రమైన వేధింపుల్ని భరించిన వ్యక్తి ఆయన. అన్నివిధాలైన కష్టనష్టాల్నీ ఎదుర్కొన్నారు. వివిధ తెగల మధ్య అంతర్గత పాలన వ్యవస్థను పటిష్ఠపరచిన మహోన్నతుడు. ఆయన సాధించిన ఘనకార్యాలు అనేకం. ఎలాంటి ప్రతిఫలాన్నీ ఆశించలేదు. మానవాళిని సురక్షితమైన ఇస్లాం రుజుమార్గాన నడిపే ప్రయత్నంలో సమస్తాన్నీ త్యాగం చేశారు. ఆ మహాపురుషుడికి ఏ పరిహారం చెల్లించినా సరిపోదు. మొహమ్మద్‌ ప్రవక్త (స.అ.వ.) ఆత్మపై కారుణ్యాన్ని వర్షించాలని అల్లాహ్‌ను ప్రార్థిద్దాం. ఆమీన్‌. - షేక్‌ బషీరున్నీసా బేగం

Monday, November 27, 2017

Gita jayanthi celeberations_25-11-2017 to 03-12-2017 from 6.30 to 8.30 PM at Sujatha high school,chapel road nampally by Shri poojya Acharya sree Prem sidhartha pravachnamulu

Gita jayanthi celeberations_25-11-2017 to 03-12-2017 from 6.30 to 8.30 PM at Sujatha high school,chapel road nampally by Shri poojya Acharya sree Prem sidhartha pravachnamulu

అంతర్యామి సంకల్ప సాధన

అంతర్యామి

సంకల్ప సాధన
కార్యసాధనకు ఎన్నో సంకల్పిస్తాం. వాటిలో కొన్ని నెరవేరతాయి. మరికొన్ని కార్యరూపం ధరించవు.నెరవేరని సంకల్పాలు చిరాకు కలిగిస్తాయి. అందువల్ల సంకల్పసిద్ధికి అడుగు ముందుకుపడదు. అటువంటి అనుభవం పలువురికి ఎదురవుతుంటుంది. అసామాన్యులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. సంకల్పించిన కార్యం నెరవేరేవరకు విశ్రమించరు. అపజయాల్ని వారు విజయాలకు సోపానాలుగా మలచుకుంటారు.

అనుకున్న కార్యం మంచిదైనప్పుడే, ఇతరుల తోడ్పాటు లభిస్తుంది. స్వార్థప్రయోజనాల కోసం వెంపర్లాడేవారిని కార్యసాధకులనరు. వారి వల్ల సమాజానికి ఒరిగేదీ ఉండదు. ఆ కార్యజయం లోకానికి కంటకంగా మారే ప్రమాదమూ ఉంది. రామకార్యం సాధించేందుకు ఆంజనేయుడు సంకల్పించాడు. లోకహితమే హనుమ లక్ష్యం. మంచిని పరిరక్షించేందుకు మనుషులతోపాటు అనేక ప్రాణులూ తమ శక్తులు ఒడ్డటాన్ని రామాయణ మహాకావ్యం స్పష్టం చేసింది.

కపివీరుడైన హనుమంతుడి స్వామికార్య సఫలత కోసం, ఎలుగుజాతి జాంబవంతుడు పథకం వేశాడు. దానవ జాతికి చెందిన విభీషణుడు, పర్వత రూపుడైన మైనాకుడు, పక్షిరాజు జటాయువు, సముద్రుడు సహాయం అందించారు. ఓ చిట్టి ఉడుత సైతం తనవంతుగా తోడ్పడింది. రావణ చెర నుంచి త్రిలోక జనని సీతాదేవి విడుదలయ్యేలా ప్రకృతీ తపన పడింది. ఆ లోకపావనిని రామచంద్రుడి చెంతకు చేర్చిన మహత్కార్యంలో ప్రభుహితం, లోకహితం ఇమిడి ఉన్నాయి. అందుకే ముల్లోకాలూ ఆంజనేయుడి సాహస లంకాయాత్రను వేనోళ్ల కీర్తించాయి. అనుకూలత ఉన్నప్పుడు, కార్యసాధన సులభసాధ్యమవుతుంది. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడే, కార్యసాధకుడి శక్తిసామర్థ్యాలు లోకానికి వెల్లడవుతాయి.

అరిషడ్వర్గాల్లో ఒకటైన క్రోధానికి రావణుడు ఎలా బలయ్యాడో రామాయణం తెలియజేస్తుంది. హనుమ సంకల్పదీక్ష నిరుపమానం. రాముడి పట్ల స్వామిభక్తి పరాయణతలోనూ హనుమంతుడు మేటి. అవే ఆయనకు సీతాన్వేషణ వంటి ఘనకార్యాలు చేసే శక్తిని ప్రసాదించాయి. రామాయణాన్ని కొత్త కోణంలో చూస్తే, ఎన్నో మహత్వపూర్ణ అంశాలు బోధపడతాయి. శ్రీరాముడి త్యాగశీలత ఎటువంటివారికైనా ప్రేరణ కలిగిస్తుంది. కార్యసాధనకు సంబంధించి హనుమ, సుగ్రీవుడు పెంచి పోషించిన విలువలు సాటిలేనివి. జీవితాల్లో ఎదురయ్యే పలు వ్యక్తిగత, సామాజిక సమస్యలకు పరిష్కారాల్ని సామాన్యులు ఆ పాత్రల పరిశీలన ద్వారా తెలుసుకోవచ్చు.

రావణవధ వరకు కార్యసాఫల్యం దిశగా రాముడి పయనం ఏ విధంగా సాగిందో రామాయణం విశదపరుస్తుంది. కార్యం సిద్ధించిన విధానమంతటినీ ఆ పవిత్ర గ్రంథ అధ్యయనం ద్వారా యువత తెలుసుకోవాలి. రాముణ్ని పరిపూర్ణ మానవుడిగా దర్శించినప్పుడే, ఆ కథానాయకుడి పాత్ర ప్రత్యేకత అవగతమవుతుంది. ఆయన పరాక్రమం, మితభాషిత్వం, అనుచరుల పట్ల ఆప్యాయత అందరికీ ప్రస్ఫుటమవుతాయి. సీతారాముల ఉదాత్త దాంపత్యం, రామలక్ష్మణుల సోదర అనుబంధం రామాయణ పఠనంతో ఎంతగానో తేటతెల్లమవుతాయి. శత్రువును సమర్థంగా ఎదుర్కొని విజయాన్ని కైవసం చేసుకోవడంలోని ధీరత్వం గురించి, ఆ కావ్యమే లోకానికి మార్గదర్శనం చేస్తుంది.

అబ్దుల్‌ కలామ్‌ జీవితచరిత్ర కార్యసాధకులకు కరదీపిక. కృషి వల్ల ఒక సామాన్యుడు జీవితంలో ఎంత ఎత్తుకు ఎదగవచ్చో నిరూపించిన గ్రంథమది. శాస్త్రజ్ఞుడు, విద్యావేత్త, సామాజికవాది, అభ్యుదయ రైతు- ఎవరికైనా కార్యసాధన క్రమంలో ఒడుదొడుకులు, అపజయాలు ఎదురుకావచ్చు. అనుకున్న పనిని ఎప్పటికైనా పూర్తిచేయగలనన్న ప్రగాఢ విశ్వాసమే కార్యసఫలతకు పునాది!

విఖ్యాత శాస్త్రవేత్త థామస్‌ ఆల్వా ఎడిసన్‌ తొలిరోజుల్లో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.నిరాశచెందని తత్వం, అలసట ఎరుగని ఆయన ప్రయత్నమే అనేక ఉపకరణాల సృష్టికి మూలమయ్యాయి. జీవితంలో ఎంత ప్రేరణఉన్నా, ఎంతో స్వేదం చిందిస్తేనే విజ యంవరిస్తుందనడానికి ఆయన జీవితమూ ఓ ఉదాహరణ.కార్యసాధకులవిజయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలియువత.జీవితంలోఎదిగే ప్రయ త్నం కొనసాగిస్తే, ప్రతి వ్యక్తీ కాగలడొక విజేత!

- గోపాలుని రఘుపతిరావు

అంతర్యామి



జ్ఞాన సాధన
విద్యార్థులు తెల్లవారుజామునే నిద్ర లేచి చదువుకోవాలని పెద్దలు చెబుతారు. ఇప్పటికీ పలువురు అభ్యాసకులు అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. ఉదయం పూట మనసు నిర్మలంగా ఉంటుంది. చదివే అంశం పూర్తిగా మనసుకు హత్తుకుంటుంది. సూర్యోదయానికి ముందు సమయాల్లో దేవతలు సంచరిస్తారంటాయి పురాణ గాథలు. అందువల్ల, ప్రాతఃకాలంలో మనసుపెట్టి చేసే పనులన్నింటినీ ప్రార్థనతో సమానంగా భావిస్తారు. అలా చేసేవాటికి మెరుగైన ఫలితాలు లభిస్తాయంటారు. ఆ కారణంగానే, సాధకులు బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యాన ప్రక్రియలు చేపడుతుంటారు.
దైనందిన జీవితంలో ఉదయానికి విశిష్టమైన స్థానం ఉంది. దాన్ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. కొన్ని సందర్భాల్లో, ‘ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా’ అని వేచిచూసేవారూ ఎందరో కనిపిస్తుంటారు. రోజుకు ఉదయం, సాయంకాలం ఉన్నట్లే మనసుకూ సుఖదుఃఖాలు ఉంటాయి. మనసుకు రెండు దారులు ఉండటమే దానికి కారణం. అది సరైన మార్గంలో వెళితే, వెలుగు నిండుతుంది. అదే జ్ఞాన సముపార్జన. అలా కాకుండా, మనసు అపసవ్య దిశలో పయనిస్తే చీకటి మిగులుతుంది. అంటే, అజ్ఞానంలో కూరుకుపోవడం!
అంతటా వెలుగు పంచే సూర్యుడు, ఎప్పుడూ అదే చోట ఉంటాడు. అలా అని చీకటి, వెలుగులకు తాను కారణం కాదు. భూ పరిభ్రమణం వల్ల రాత్రింబగళ్లు ఏర్పడుతున్నాయి. సూర్యుడికి భూమి అభిముఖంగా తిరుగుతున్నప్పుడు వెలుతురు వస్తుంది. దానికి వ్యతిరేక దిశలో వెళితే, చీకటి కమ్ముకుంటుంది. అవిశ్రాంతంగా చలించే మనసుకూ అంతే! అది అనుక్షణం ఆత్మజ్యోతి వైపు ప్రణమిల్లి ఉండాలి. అందుకు భిన్నంగా హద్దూపద్దూ లేని ఆలోచనలతో మనసు బయట వూరేగడం దుఃఖహేతువు. అంతులేని కోరికలతో ఆకాశానికి ఎగరడం సరికాదు. ఉన్న జీవితాన్ని యథాతథంగా స్వీకరించేలా ధైర్యసాహసాలు చేయకపోవడం, నెరవేరని కోరికలు తెచ్చే నైరాశ్యం అంతులేనివి. అవన్నీ మనసును అనేక విధాలుగా అతలాకుతలం చేస్తాయి. ఆ దుఃఖసాగరం నుంచి బయటపడేందుకు మనిషి పలురకాలుగా ఆలోచిస్తాడు. ఎలాగైనా ఆనందం పొందడానికి ప్రయత్నిస్తాడు. విముక్తి కోసం పరితపిస్తాడు. అలా మెలమెల్లగా అతడిలో తిరుగు ప్రయాణం ఆరంభమవుతుంది.
‘జీవకోటిలో మనిషి మాత్రమే- బ్రహ్మానందం పొం దాలని, మోక్షప్రాప్తి కలగాలని కోరుకుంటాడు. మిగతా జీవులు కోరుకోవు. ఎందుకు’ అని ఒక శిష్యుడు గురువును అడిగాడు. ఆయన ఇలా బదులిచ్చాడు- ‘మానవేతర జీవులకు మనుగడకు కావాల్సినంత జ్ఞానమే ఉం టుంది. అవి ఆహారం దొరికితేనే ఆకలి తీర్చుకుంటాయి. పరిస్థితులకు అనుగుణంగా అలవాటు పడతాయి. ప్రమాదాలు ఎదురైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లి, అక్కడ గూళ్లు కట్టుకుంటాయి. ఆహారమూ సమకూర్చుకుంటాయి. వాటికీ అనుభవాలు, జ్ఞాపకాలు ఉంటాయి. వాటిని జీవితావసరాలకే ఉపయోగిస్తాయి. ఇతర జీవులతో పోల్చుకోవు. గడచినవాటి గురించి దిగులు పడవు. రేపు ఏమవుతుందోనన్న భయమూ వాటికి ఉండదు. కాబట్టి, వాటికి మానసికంగా దుఃఖం కలిగే అవకాశం లేదు. ఆనందం తాలూకు అవసరమూ వాటికి రాదు. అవి ఉన్న స్థితే వాటికి ఆనందమైనా, ఆ విషయం మాత్రం వాటికి తెలియదు’. గురువు మాటల్లోని పరమార్థాన్ని శిష్యుడు అప్పుడు గ్రహించాడు.
దుఃఖం అనేది మనిషికి మానసికంగా కలిగేది. ఉపశమనం పొందడానికి, దుఃఖమూలాన్ని అతడు వెతికి పట్టుకోవాలి. అది దొరకడం అంటే, సంబంధిత సత్యం తెలియడం! అప్పుడే దుఃఖం తొలగిపోతుంది. సత్యం తెలియడం, దుఃఖం తొలగడం రెండూ వేర్వేరు ప్రక్రియలు కావు. ఆ రెండూ ఒకటే! అది ఉలితో చెక్కిన శిల శిల్పం కావడం వంటిది. శిలను ఉలితో తొలుస్తున్నప్పుడే, లోపలి శిల్పం బయటకు తొంగిచూడటం మొదలవుతుంది. అలాగే చీకటి వెళ్లిపోవడం, సూర్యుడు రావడం ఏకకాలంలో జరుగుతుంటాయి.
కళ్లు తెరిస్తే, బయటి వెలుగు కనిపిస్తుంది. కళ్లు మూస్తే లోపలి అఖండ వెలుగు అనుభూతిలోకి వస్తుంది. కనులు మూసి ధ్యానసాధన చేస్తుంటే, ‘ఆత్మజ్యోతి’ దర్శనమవుతుంది. అది ఉదయంలా మెల్లగా సమీపిస్తుంది.
- మునిమడుగుల రాజారావు

Sunday, November 26, 2017

How to Copy YouTube Playlists


How to Copy YouTube Playlists
HOW TO USE YOUTUBE MULTIDOWNLOADER.COM
https://youtu.be/T0uPfwsA1zE
How to Import a Playlist from Youtube https://youtu.be/PAbiY6UvoOE How to Download Youtube Full Playlist Using IDM - Bangla Tutorial
https://youtu.be/uYgqWUkDfJw
https://youtubemultidownloader.com
https://youtubemultidownloader.com

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular