Wednesday, December 27, 2017

JAGJIT SINGH BHAJANS_ANUPJALOTA_HARIOMSHARAN_FREE DOWNLOADHDEVOTIONAL1

ANUP JALOTA BHAJANS ZIPPED FOLDERS https://mega.nz/#F!ICJRFCyL!T6tmZtzuyG9nGv42TxT3CQ HARIOM SHARAN BHAJANS ZIPPED FOLDERS https://mega.nz/#F!4SwBkazK!hcnkM7BHui0YR6Ge7aznHg JAGJIT SINGH BHAJANS ZIPPED FOLDERS https://mega.nz/#F!0PgSjJTK!SLFKjogr5p-AEz1JrCTq0g




JAGJIT SINGH BHAJANS_ANUPJA JALOTA_HARIOM SHARAN FULL ALBUMS FREE DOWNLOAD...

HINDUDEVOTIONAL1

JAGJIT SINGH



ANUP JALOTA


HARI OM SHARAN




  PLAY OR DOWNLOAD LINK:

 https://my.pcloud.com/publink/show?code=kZn9QJ7ZyQsFGnebOOyIyaJsQivT7YkVkWay

HARI OM SHARAN BHAJANS mp3 free downoad

ANUP JALOTA BHAJANS ZIPPED FOLDERS https://mega.nz/#F!ICJRFCyL!T6tmZtzuyG9nGv42TxT3CQ HARIOM SHARAN BHAJANS ZIPPED FOLDERS https://mega.nz/#F!4SwBkazK!hcnkM7BHui0YR6Ge7aznHg JAGJIT SINGH BHAJANS ZIPPED FOLDERS https://mega.nz/#F!0PgSjJTK!SLFKjogr5p-AEz1JrCTq0g


HARI OM SHARAN BHAJANS FULL LIST mp3 free downoad 
play or free downoad Link:
https://my.pcloud.com/publink/show?code=kZhktF7ZlNU9pOfjw6u4sK7Q9VGajJ8A96wk

HARI OM SHARAN BHAJANS FULL LIST mp3 free downoad
Aisa Pyar Bahade — Hari Om Sharan Best Of, Vol. 1 mp3 free downoad
Arti Archan 016 Hari Om Sharan mp3 free downoad
Bhajan Samrath — Hari Om Sharan mp3 free downoad
Bhajan Sangam, Vol. 1 mp3 free downoad
Bhakti Bha V Geeto -Hai mp3 free downoad
Dalata Ek Rann 2016 Hai Onn Sharan mp3 free downoad
Darshan Dwaar 2008 Hai Om Shaan mp3 free downoad
Gaiye Ganpati Gungan — Bhajan Sangam, Vol. 1 mp3 free downoad
Hari Om Sharan - Kahat Kabi SunO Bhai Sadh0 WO2 mp3 free downoad
Hari Om Sharan - Memorable Bhajan ( King Scorpian) mp3 free downoad
Hari Om Sharan - Premanjali Pushpanjali Divine Bhajans (King Scorpian) mp3 free downoad
Hari Om Sharan - Shree Hanuman Chalisa Jai Jai Shri Hanuman (King Scorpian) mp3 free downoad
Hari Om Sharan Best Of Vol.1_Bhaj Le Re Man Ram RamBhor Bhaye mp3 free downoad
Hari Om Sharan Best Of Vol. 5 mp3 free downoad
Hari Om Sharan Best of, Vol. 2 mp3 free downoad
Hari Om Sharan Best of, Vol. 3 mp3 free downoad
Hari Om Sharan Best of, Vol. 6 mp3 free downoad
Hari Om Sharan Best of, Vol. 7 mp3 free downoad
Hari Om Sharan Best of, Vol. 8 mp3 free downoad
HARI OM SHARAN BHAJANS (muZigle) mp3 free downoad
HARI OM SHARAN BHAJANS ARCHIVES COLLECTION mp3 free downoad
hari om sharan samp00Tna Sundar kand mp3 free downoad
Hari Om Sharan- Kabir Bhajans mp3 free downoad
Hari Om Saran - Shri Hanuman Chalisa mp3 free downoad
Hari Om Sharan Daata Ek Ram mp3 free downoad
Jai Jai Aarti Sab Mil Gayen Stuti Karen Shri Gana mp3 free downoad
Pavitra Saicharitra Padavali 2017 by Hari Om Sharan mp3 free downoad
Pooja Ke Phool Vol 2 (Hari On Saran ) mp3 free downoad
Pooja Ke Phool-1 (Hari Om Saran ) mp3 free downoad
Teri Kripa Ko Maine Paya Bhajan Sanrath Hari Om Sharan mp3 free downoad
gOWind-ke-gun-gaale.mp3  free downoad
hari-Om-sharan-govind-ke-gun-gaale.mp3 mp3 free downoad
hari-Om-sharan-he-naath-ab-to.mp3 mp3 free downoad
hari-Om-sharan-jiske-Sir-par-haath-hai-tera.mp3 mp3 free downoad
hari-Om-sharan-moksha-shloka.mp3 mp3 free downoad
hari-Om-Sharan-na-yeh-tera-na-yeh-mera.mp3 free downoad
hari-Om-sharan-at-laagi-mohe-Sai-tere-naam-ki.mp3 free downoad
hari-Om-Sharan-Sai-naam-tu-gaale.mp3 free downoad
hari-Om-sharan-Sai-tera-bana-sahe-darbar.mp3 free downoad
hari-Om-Sharan-tera-ram-ji-karenga-beda-paar.mp3 free downoad
hari-Om-Sharan-teri-kripa-ko-maine-paaya.mp3 free downoad
hari-Om-sharan-vipda-mitanewale.mp3 free downoad
he-naath-ab-to.mp3 free downoad
he-naath-ab-to.mp3 free downoad
jiske-sir-par-haath-hai-tera.mp3 free downoad
man maila auritan kO(bhajan).mp3 free downoad
na-yeh-tera-na-yeh-mera.mp3 free downoad
nandini-Sharan-SanWare-kanhaiya-banSUriya-ki-taan.mp3 free downoad
Rakh Laaj Meri Ganpati By Hari Om Sharan.mp4.mp3 free downoad
Ram Sumir Ke Rahem Karen Na - Daata Ek Ram Hari Om  Sharan.mp3 free downoad
Sai Teri Yaad Maha Sukhdaayi Sai Bhajan_Hariom Sharan mp3 free downoad
Premanjali Pushpanjali.mp3 free downoad
Sankat Mochan Hanuman Ashtak. By Hariom Sharan (Full Video Song).mp3 free downoad
SweekarOmere parnam(bhajan).mp3 free downoad
tera-ram-ji-karenga-beda-paar.mp3 free downoad

teri-Kripa-ko-maine-paaya.mp3 free downoad



  • JAGJIT SINGH BHAJANS FREE mp3 DOWNLOAD

    ANUP JALOTA BHAJANS ZIPPED FOLDERS https://mega.nz/#F!ICJRFCyL!T6tmZtzuyG9nGv42TxT3CQ HARIOM SHARAN BHAJANS ZIPPED FOLDERS https://mega.nz/#F!4SwBkazK!hcnkM7BHui0YR6Ge7aznHg JAGJIT SINGH BHAJANS ZIPPED FOLDERS https://mega.nz/#F!0PgSjJTK!SLFKjogr5p-AEz1JrCTq0g

    JAGJIT SINGH BHAJANS FULL ALBUMS FREE DOWNLOAD...

    HINDUDEVOTIONAL1








    jagjit singh bhajans albums full list mp3 free downoad

    Aarogya Mantra mp3 free downoad
    Amritanjali mp3 free downoad
    Antardhwani (Maa Dhun) mp3 free downoad
    Baba Sheikh Farid (Shabads Shlokas) mp3 free downoad
    Bhaj Mann Pyare - Jagjit Ke Shresht Bhajans mp3 free downoad
    Bhjans jagjit mp3 free downoad
    Dhun By Jagjit Singh mp3 free downoad
    Gayatri Mantracjagjit Singh) mp3 free downoad
    Guru Gobind Singh mp3 free downoad
    Hari Om Tatsat mp3 free downoad
    Hey Gobind Hey Gopal mp3 free downoad
    Hey Ram mp3 free downoad
    Holy chants of lord ganesh mp3 free downoad
    Jagjit Singh instrumental mp3 free downoad
    Jai Radha Madhav mp3 free downoad
    Jai Shree Ram mp3 free downoad
    Jai Siya Ram mp3 free downoad
    Jeevan Maranchheek-jagjit singh mp3 free downoad
    Kabir-Jagjit Singh mp3 free downoad
    KARUNA - JAGUT SINGH mp3 free downoad
    Maa mp3 free downoad
    Madh0 Hum Aise TUAisa mp3 free downoad
    Mahamirityunjay Mantra mp3 free downoad
    Man Jeetai Jagjeet mp3 free downoad
    Man The RaiTn BaSalle mp3 free downoad
    Moksha mp3 free downoad
    Om — Jagjit Singh mp3 free downoad
    Radha Ballabh Kunj Bihari-non Stop mp3 free downoad
    Radhe Krishan Radhe Shyam mp3 free downoad
    Saan Wara mp3 free downoad
    Man The Rann BaSalle mp3 free downoad
    Moksha mp3 free downoad
    Om — Jagjit Singh mp3 free downoad
    Radha Ballabh Kunj Bihari-nom Stop
    Radhe Krishan Radhe Shyam mp3 free downoad
    SaanWага mp3 free downoad
    Sai Ohun mp3 free downoad
    Sam Wedna mp3 free downoad
    Satnam Sri Wahe Guru mp3 free downoad
    Shiva Dhuns Bhajans mp3 free downoad
    Shree Gainesh mp3 free downoad
    Wakratunda Mahakaya mp3 free downoad



    ANUP JALOTA BHAJANS mp3 free downlaod

    ANUP JALOTA BHAJANS ZIPPED FOLDERS https://mega.nz/#F!ICJRFCyL!T6tmZtzuyG9nGv42TxT3CQ HARIOM SHARAN BHAJANS ZIPPED FOLDERS https://mega.nz/#F!4SwBkazK!hcnkM7BHui0YR6Ge7aznHg JAGJIT SINGH BHAJANS ZIPPED FOLDERS https://mega.nz/#F!0PgSjJTK!SLFKjogr5p-AEz1JrCTq0g

    ANUP JALOTA ALBUMS FULL LIST mp3 free downlaod
    free downlaod Link: 
    https://my.pcloud.com/publink/show?code=kZ8oqF7ZDG3tOobBtt7r6DLKaFjEzb4Ht1qy
    -------------------------------------------------
    https://my.pcloud.com/publink/show?code=kZjRtF7Z9KxQR744oXHGs1OnEatAqXEmmww7
    Sampurna Ramayan(Anup Jalota)
    Bhajans - Anup Jalota
    BHAGAVADGITA(ANUP JALOTA)
    -------------------------------------------------
    ANUP JALOTA ALBUMS FULL LIST mp3 free downlaod
    AaoHumBhajan Karen-Anup Jalota mp3 free downlaod
    AdyashaktiMahamayaVol.2-Anup.Jalota mp3 free downlaod
    Aisi Laagi Lagan(Anup Jalota) mp3 free downlaod
    AnupJalota – NaZul Geeti by AnupJalota mp3 free downlaod
    AnupJalota Bhajans  mp3 free downlaod
    ANUPJALOTA BHAJANS(HUMMAA) mp3 free downlaod
    ATributeToNationIndia-Anup Jalota mp3 free downlaod
    Basareecha SOOTAala mp3 free downlaod
    Best Of Anoop Jalota mp3 free downlaod
    Bestsellers of Anup.Jalota mp3 free downlaod
    Bhajan - Aarti_ANUPJALOTA mp3 free downlaod
    Bhajan Bansuri-AnupJalota mp3 free downlaod
    Bhajan Ganga mp3 free downlaod
    Bhajan Ganga (Live) mp3 free downlaod
    Bhajan Gyan prabha-Anup Jalota mp3 free downlaod
    Bhajan Rath Vol. 2 mp3 free downlaod
    Bhajan Rath Vol-1 mp3 free downlaod
    Bhajan Sandhya mp3 free downlaod
    Bhajan Teeth Wol. 2 mp3 free downlaod
    Bhajan Teerth Wol. 1 mp3 free downlaod
    Charan Kamal BandO mp3 free downlaod
    Chayya (Anoop Jalota ) mp3 free downlaod
    Hari Naam Ka. Pyala (Anup Jalota) mp3 free downlaod
    Hari Sumiran mp3 free downlaod
    Jai Jai Hanuman mp3 free downlaod
    Jai Ram (Anoop Jalota mp3 free downlaod)
    LaagaChunariMein Daag-AnupJalota mp3 free downlaod
    Magic Of Anup Jalota - Ram Bhajans Vol. 1 mp3 free downlaod
    MagicOfAnup.Jalota-RamandKrishnaBhajans Wol-3 mp3 free downlaod
    Main Nahin Makkan Khayo (Anup Jalota ) mp3 free downlaod
    ManaJapaNaam mp3 free downlaod
    Mere Krishan Kanhaiya (Anoop Jalota ) mp3 free downlaod
    Meri Ganga Maiya-Anu.pJalota mp3 free downlaod
    Meri Papon Se Bhari Gagariya mp3 free downlaod
    Nayee Bhajan Sandhya mp3 free downlaod
    Om Namo Bhagvate Wasudevay (Mantra) mp3 free downlaod
    Patit Paawani mp3 free downlaod
    Prabhu Darshan Vol_3 mp3 free downlaod
    Prabhu Darshan Vol_4 mp3 free downlaod
    Prabhu Darshan Vol_2 mp3 free downlaod
    Prabhu Darshan Vol_1 mp3 free downlaod
    Prabhu Tero Naam (Anoop Jalota ) mp3 free downlaod
    Prabhu Darshan Vol.2.-AnupJalota mp3 free downlaod
    Pratah Smaran - A Complete Peace For Body & Soul mp3 free downlaod
    Raah Dikhavo Shyam mp3 free downlaod
    Raghunandan Raghav Ram Hare (Single) mp3 free downlaod
    Rann Ki Mahima mp3 free downlaod
    Ram Ramaiyya Gaye Ja (Anup Jalota) mp3 free downlaod
    Rann Naam Ki Mala mp3 free downlaod
    Ram Shyam Gun(Gaaiye-AnupJalota mp3 free downlaod
    Rang De Chunariya mp3 free downlaod
    Shanti-Anupjalota mp3 free downlaod
    Shohrat Vol. 2 (EP) mp3 free downlaod
    Shree Ram Chale VanWas-Anup Jalota & Sarita Joshi mp3 free downlaod
    Shri Hanuman Chalisa mp3 free downlaod
    Shri Satyanarayan Ki Vrat Katha mp3 free downlaod
    ShriGaneshMala-Anup Jalota mp3 free downlaod
    Shyam Teri Bansi mp3 free downlaod
    Siya Ram Bina Dukh Kaun Hare mp3 free downlaod
    Sri ST Brahma Sahnita mp3 free downlaod
    Shanti-Anupjalota mp3 free downlaod
    Shohrat Vol. 2 (EP) mp3 free downlaod
    Shree Ram Chale Van Was-Anup Jalota & Sarita Joshi mp3 free downlaod
    Shri Hanuman Chalisa mp3 free downlaod
    Shri Satyanarayan Ki Vrat Katha mp3 free downlaod
    ShriGaneshMala-Anup Jalota mp3 free downlaod
    Shyam Teri Bansi mp3 free downlaod
    Siya Ram Bina Dukh Kaun Hare mp3 free downlaod
    Sri ST Brahma Sahnita mp3 free downlaod
    Tere Mān Mein Ran mp3 free downlaod
    Teri Sharian mp3 free downlaod
    The best of an upjalota mp3 free downlaod


    Friday, December 15, 2017

    A musical tribute to Jagjit Singh


    A musical tribute to Jagjit Singh

    DOWNLOAD LINK:
    A musical tribute to Jagjit Singh...DOWNLOAD LINK:
    Jagjit Singh Melody Bhajans(Folders=52;Bhajans=363)...play or download....
    https://my.pcloud.com/publink/show?code=kZn9QJ7ZyQsFGnebOOyIyaJsQivT7YkVkWay

    Sunday, December 10, 2017

    Antaryami

    అంతర్యామి

    వైరాగ్య వైభవం
    క మహారాజు, తన మంత్రితో పాటు దేశాటనం సాగించాడు. ఇద్దరూ మారువేషాలతో వూరి బయట ఉన్న శిథిలాలయానికి చేరుకున్నారు. అక్కడ చెట్టు కింద ఓ సాధువు ఆనందంగా వైరాగ్య గీతాలు ఆలపించడం గమనించారు. మహారాజుకు ఆశ్చర్యం కలిగింది. ఆ బైరాగి చినిగిన వస్త్రాలతో ఉన్నాడు. ఒంటి మీద ఉన్నవన్నీ చింకిపాతలే! పక్కనే సత్తు గిన్నె పడి ఉంది. కటిక నేలమీద పడుకొన్న అతడు, ప్రపంచంలోని ఆనందమంతటినీ ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఎంతో పరవశించి పాడుతున్నాడు.
    ‘ఇదెలా సాధ్యం’- అని ప్రశ్నించాడు రాజు.
    ఆ సాధువు ఇలా బదులిచ్చాడు... ‘మనిషి తనకు తానుగా బంధనాల్లో చిక్కుకుంటున్నాడు. కోరి సంకెళ్లు తగిలించుకుంటున్నాడు. నా వంటి విరాగికి బంధనాలు ఏముంటాయి? ఒకవేళ ఉన్నా, వాటిని సునాయాసంగా తెంచుకుంటున్నాను. నా విచారానికైనా, ఆనందానికైనా కారణమేమిటో తెలిసింది కదా! వైరాగ్యానికి మించిన మహా వైభవం జీవితంలో మరేదీ లేదు. విరాగి స్వేచ్ఛాజీవి. అన్ని లోకాలూ అతడివే. ఆనందమంతా అతడి సొత్తే...’ అంటూ, సాధువు మరో పాట అందుకున్నాడు.
    నిజమే. మహారాజు అధికారం తన రాజ్యపరిధుల వరకే ఉంటుంది. కుటుంబీకుడి యాజమాన్య హక్కు అతడి గృహం హద్దులకే పరిమితమవుతుంది. విరాగికి హద్దులూ ఉండవు. వేషంలో తప్ప, ఇతరులతో పోలిస్తే అతడి మానసిక స్థితిలో ఎటువంటి తేడా ఉండదు. అలాగని సాధు వేషధారులంతా విరాగులని ఎవరూ పొరపడకూడదు.
    వైరాగ్యం అనేది వేషంలో ఉండదు. మనసులో ఉంటుంది. మనోవైరాగ్యమే అసలైన వైరాగ్యం. వస్తు ప్రేమ, బంధుజన ప్రేమ, భోజన ప్రియత్వం, లాలస- ఇవన్నీ మనసును అంటిపెట్టుకుని ఉండే మాలిన్యాలు. ఇవేవీ సాధారణ స్నానంతో వదిలేవి కావు. మనిషి ఆత్మస్నానం చేయాలి. ఆత్మ తేజోవంతం కావాలంటే, ఎన్నింటినో మనిషి త్యాగం చేయాలి. అన్నీ తనకే కావాలని మనసు అనుకుంటుంది. అందువల్ల మనిషి తన మనసుకే త్యాగబుద్ధిని అలవాటు చేయాలి. క్రమంగా మనసు అతడి మాట వింటుంది. వైరాగ్య చింతనకు లోబడుతుంది.
    మోహాన్ని త్యాగం చేశానని ఎవరైనా సాధకుడు అనుకుంటే, ఆ తరవాత స్థితిగతులు మారతాయి. అతడి సమక్షానికి ఓ అందాలరాశి రాగానే, మానసికంగా అలజడి మొదలవుతుంది. ఆ స్థితిని అతడు తట్టుకోలేనప్పుడు- విశ్వామిత్రుడవుతాడు. తట్టుకోగలిగితే నారాయణ రుషిగా మారతాడు. మేనకా విశ్వామిత్ర కథే దీనికి ఉదాహరణ.
    నారాయణ రుషిని కొందరు ప్రలోభపెట్టాలని ప్రయత్నిస్తారు. అప్పుడు అప్సరసలు సిగ్గుపడేలా, వారిని మించిన సౌందర్య దేవతను ఆయన సృష్టిస్తాడు. ఆ యువతే వూర్వశి! మానసిక నిగ్రహశక్తికి ఆ వృత్తాంతమే నిదర్శనం. క్రోధానికి మారుపేరు దుర్వాసుడు. ఆ లక్షణం వల్ల ఆయన అనేక అగచాట్లు పడాల్సి వచ్చింది. మహా శివభక్తుడైనప్పటికీ, రావణుడు మదమాత్సర్యాల్ని జయించలేకపోయాడు. అందుకే అతడికీ గర్వభంగం తప్పలేదు.
    పురాణాలన్నీ చూసుకుంటూ వెళ్తే, సంపూర్ణ వైరాగ్య వైభోగిగా పరమ శివుడు కనిపిస్తాడు. మన్మథుణ్ని భస్మం చేయడం ద్వారా, మోహావేశానికి తాను అతీతమని నిరూపించుకున్నాడు. సాక్షాత్తు కుబేరుడే తన మిత్రుడైనా, శివుడు ఏనాడూ కాసు కోసం ఎదురుచూడలేదు. రుద్రనేత్రుడైనా, పరమ శాంతుడైనా ఆయనే!
    మహేశ్వరుడు విశ్వప్రభువైనా, అధికారాలన్నింటినీ అందరికీ పంచిపెట్టాడు. వైరాగ్యధామమైన శ్మశాన సంచారి, విభూతి ధారి ఆయనే! సృష్టికి అతీతుడైనా, సృష్టి నియమాల్ని గౌరవించిన మహోన్నతుడు. అన్నీ తానే అయినా, ‘ఏమీ లేనివాడు’గా గోచరిస్తాడు. ఎప్పుడూ ఏకాంతవాసిగా, ధ్యానంలో నిమగ్నుడై ఉంటాడు.
    పరమ శివమే వైరాగ్య భోగం. శివానందమే వైరాగ్య వైభవం. అందరి జ్ఞానతృష్ణనూ తీర్చగల అమృతజల రూపుడు శివుడు. ఆ దక్షిణామూర్తి, ఏకేశ్వరుడి ఉపాసనే భక్తజన మానసిక వైరాగ్య వైభవ సాధనం. అలనాటి మహర్షుల వైరాగ్య వైభవానికి, వారి శివభక్తే మూలాధారం!
    - కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌

    Antaryami


    అంతర్యామి

    జ్యోతి దర్శనం
    గవంతుణ్ని దర్శించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయంటారు పెద్దలు. భక్తులు అనేక దేవాలయాల శిలావిగ్రహాల్లో దేవతామూర్తుల్ని చూసి పరవశిస్తారు. నిరాకారం అని భావించి ప్రార్థించేవారూ ఎందరో ఉన్నారు. పరమ శివుడు లింగాకారంలో దర్శనమిస్తాడు. దేవతల్ని కొందరు వృక్షరూపాల్లో ఆరాధించడమూ కనిపిస్తుంది. చెట్లను పూజించడం, వాటి చుట్టూ ప్రదక్షిణలు చేయడం పరిపాటి.
    పరమేశ్వరుడు జ్యోతి స్వరూపుడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అదే రూపంలో పరమాత్మను దర్శించి పూజించేవారూ ఉంటారు. అరుణాచలం పేరు విన్నా, పలికినా ముక్తి లభిస్తుందంటారు. అరుణాచలమే కైలాసమని రమణ మహర్షి భావించేవారు. ఆయన భావనలో- ఆ కొండపైనే శివకుటుంబం ఉంది. అక్కడే పార్వతీ పరమేశ్వరులతోపాటు వారి తనయులు వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్నారు. వారిని బ్రహ్మ, విష్ణువు దర్శించుకొని వెళ్లేవారని మహర్షి భావం. అందుకే ఆయన గిరి ప్రదక్షిణానికి ప్రాముఖ్యమిచ్చేవారు. అందుకు శిష్యుల్ని, ఇతర భక్తుల్ని ఎంతో ప్రోత్సహించేవారు.
    అరుణగిరిపై కార్తిక మాసంలో పౌర్ణమినాడు అఖండజ్యోతి వెలిగిస్తారు. సంధ్యాసమయంలో ఆవునేయి, కర్పూర వినియోగంతో నిర్వహించే కార్యక్రమమది. ఆ జ్యోతి దర్శనం కోసం పలు ప్రాంతాల నుంచి భక్తులు అరుణాచలానికి తరలి వెళతారు. జ్యోతిని దర్శించి పులకరిస్తారు. అది కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికీ గోచరిస్తుంది. అందువల్ల పలువురు అక్కడి నుంచే జ్యోతి పరమాత్మను దర్శించుకుంటారు. నమ్మకమే ప్రధానంగా, అనేకులు తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యస్థలాల్ని సందర్శిస్తే ప్రశాంత చిత్తం ఏర్పడుతుందని భావిస్తుంటారు.
    అవతారం చాలించే ముందు- శబరిమల అయ్యప్పస్వామి శబరిగిరిని చేరినప్పుడు, అష్టాదశ దేవతలు ఎదురవుతారు. స్వామి ఆ కొండను ఎక్కడానికి వీలు కల్పిస్తూ, పద్దెనిమిది మెట్లుగా ఏర్పడతారు. అక్కడ మణికంఠుడు కాలు మోపి, శబరిగిరిని అధిరోహించి, చిన్ముద్ర- అభయహస్తంతో దర్శనమిస్తాడు. ఆయనను అంతకుముందు అనుసరించి వెళ్లిన మహారాజు, రాణి, ప్రజలు భక్తిపరవశులవుతారు. పెంచిన మమకారం వల్ల రాజు, రాణి ‘నిన్ను చూడకుండా ఉండలేం’ అంటారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతినాడు సంధ్యాసమయంలో దర్శనమిస్తానంటాడు స్వామి. కనీసం మండల కాలం బ్రహ్మచర్య దీక్ష పాటించి శరణాగతితో శబరిమల చేరినవారు తన జ్యోతి స్వరూపాన్ని దర్శించవచ్చని చెబుతాడు. ఆ తరవాత జ్యోతి రూపంలోనే అంతర్థానమవుతాడనే ఒక కథ ప్రచారంలో ఉంది.
    అనంతరం పరశురాముడు ఆ స్వామి విగ్రహాన్ని శబరిమల శిఖరంపై ప్రతిష్ఠిస్తాడు. ఆయనే పద్దెనిమిది మెట్లూ నిర్మించాడని అంటారు. నియమాల్ని పాటించి శబరిమల యాత్ర చేసినవారికి జ్యోతి దర్శనం కలుగుతుందని చెబుతారు. కలియుగ వరదుడు, ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు- ఆ హరిహర సుతుడు. శబరిమల ఆలయ సిబ్బంది మకర సంక్రాంతి రోజు సాయంత్రం వేళ స్వామిని ఆభరణాలతో అలంకరిస్తారు. గుడిలో హారతి ఇవ్వగానే, పొన్నంబలమేడు శిఖరంపై జ్యోతి కనిపించే ఏర్పాటు ఉంది.
    శబరిమల సన్నిధానంలో అదే సాయంత్రం అయిదున్నర నుంచి ఇంచుమించు గంటసేపు భక్తులు స్వామి శరణుఘోష చేస్తారు. ఆ నామాలు చెబుతూ, పారవశ్యంతో తూర్పు దిక్కు కొండపై దృష్టి కేంద్రీకరిస్తారు. అప్పుడు ముందుగా ఆకాశంలో మకర నక్షత్రం కనిపించి, ఆ తరవాత ముమ్మారు దివ్యజ్యోతి దర్శనమవుతుంది. అవి కొంతసేపు గోచరించి అంతర్థానమవుతాయి. ఆ దివ్యజ్యోతిని, మకర జ్యోతిని చూడటానికే లక్షల సంఖ్యలో భక్తులు వెళతారు. స్వామి దీక్ష చేసి, అడవుల్లో కొండల్లో నడిచి, శబరిమల యాత్ర సాగిస్తారు!
    - మహాభాష్యం నరసింహారావు

    World Telugu Conference 2017 to Be Held in Hyderabad from Dec 15th


    World Telugu Conference 2017 to Be Held in Hyderabad from Dec 15th


    కడలి అంచులు దాటి కదిలింది తెలుగు.. ఎదల లోతులు మీటి ఎగసింది తెలుగు.. ఏ భాష చెణకైన ఏ యాస చినుకైన తనలోన కలుపుకొని తరలింది తెలుగు.. అన్న సినారె కవితా స్ఫూర్తికి అక్షర హారతులు పడుతూ.. తెలుగు సంబరాలకు భాగ్యనగరం సర్వం సిద్ధమవుతోంది. తెలుగు భాషా సాహిత్య వైభవాన్ని చాటిచెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా, అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్న తెలుగు పండుగలకు భాషాభిమానులంతా తరలివస్తున్నారు. ప్రాచీన కాలం నుంచీ తెలంగాణ గడ్డ మీద ప్రభవించిన సాహితీ సుమాలను సుకుమారంగా స్పృశించేందుకు.. సారస్వత సంపదను పొదివిపట్టుకునేందుకు ఈ ప్రపంచ తెలుగు మహాసభలు వేదిక కాబోతున్నాయి. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో.. అన్న దాశరధి పలుకుల సాక్షిగా.. ఎంతోమంది తెలంగాణ కవిసార్వభౌములు, సాహితీ సృజనశీలురు సాహితీ ద్వారాల్లో స్వాగత సత్కారాలు అందుకోబోతున్నారు. తెలుగింట పర్వదినాలను తలపించే ఈ తెలుగు మహాసభల సందర్భంగా నేటి నుంచి ఈనాడు వెలువరిస్తున్న కథనాలు. అనాది కవితా మాగాణం కోటి తెలుగుల బంగారు కొండ క్రింద పరచుకొన్నట్టి సరసు లోపల వసించి ప్రొద్దుప్రొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణతల్లి కంజాతవల్లి! ఈ దాశరథి కృష్ణమాచార్య పద్యం సదాస్మరణీయం! తెలుగు సాహిత్య చరిత్రను తిరగేస్తే తెలంగాణ పుటలు అక్కడక్కడ కనిపిస్తాయి. కానీ ప్రాచీన కాలం నుంచీ తెలంగాణ గడ్డ మీద ప్రభవించిన ప్రక్రియా వైశిష్ట్యం... అనంతం! తొలి తెలుగు అలంకార గ్రంథం, ఎలుగెత్తి పాడుకునే ద్విపద, తొలి తెలుగు స్వతంత్ర కావ్యం, శతకం, ద్విపద రామాయణం, అచ్చ తెలుగు కావ్యం, యక్షగానం, సాంఘిక చరిత్రం.. ఇలా ఎన్నింటికో ఈ గడ్డ తొలి పురుడు పోసింది. పదునుదేలిన సమర కవిత మాత్రమే కాదు.. ఎంతో విలక్షణమైన ప్రాచీన కవిత్వం ఈ నేల మీద ప్రవహించింది. కన్నడభాషలో ఆదికవి అయిన పంప మహాకవి తెలంగాణకు చెందినవాడు. ఇప్పటి వరకూ ఆదికవిగా స్థిరపడిన నన్నయ రాసిన భారతంపై పంప మహాకవి ప్రభావం ఉందన్నది పరిశోధకుల ప్రగాఢ విశ్వాసం. తొలి చాటుకవిగా, వశ్యవాక్కు గలవాడిగా, శ్రీనాధుడు ‘వచియింతు వేములవాడ భీమనభంగి ఉద్దండలీల’ అని సగర్వంగా చెప్పుకున్న వేములవాడ భీమకవి తెలంగాణాలోని వేములవాడకు చెందినవాడని జయంతి రామయ్య పంతులు, మానవల్లి రామకృష్ణ కవివంటి వారు నిరూపించారు. భీమకవి ఎన్నడో 11వ శతాబ్దం చివర్లోనే.. నాకు శాపాలు పెట్టే శక్తి ఉంది, నన్ను ఏమన్నా ఊరుకోనని కన్నెర్ర చేస్తూ.. ‘శాపాను గ్రహపటువును రాపాడెడి కవుల నెత్తిరంపంబనగా భూపాల సభల పూజ్యుడ’ అన్నాడంటే పోరుగడ్డగా తెలంగాణ ఆది నుంచీ మహమాన్వితమైనదేనని అర్థమవుతుంది. దురదృష్టం ఏమిటంటే భీమకవి రచనలు లభ్యం కాకపోవటం! లభ్యమైతే తెలంగాణ ప్రాచీన కవితా పటిమ తెలిసేది. జాను తెలుగు.. సోమన శకం! తెలంగాణ ప్రాచీన కవితా వైభవానికి నిలువుటద్దం పాల్కురికి సోమన! 12వ శతాబ్దంలో అంతకు ముందున్న మార్గ కవిత్వపు మార్గంలో పయనించకుండా ‘అనితర సాధ్యం నా మార్గం’ అంటూ దేశికవితా ప్రస్తానం చేసి ‘తెలంగాణ ఆదికవి’ అనిపించుకున్న వీరశైవ కవి సోమన. శైవేతర దూషణ అన్న అవాంఛనీయత ఒక్కటి తప్ప సాహిత్యాంశాలలో శిఖరప్రాయమైనవాడు సోమన. శ్రీకృష్ణదేవరాయల కంటే 400 సంవత్సరాల పూర్వమే తెలుగును తేలికగా చూడొద్దని హెచ్చరిస్తూ.. ‘‘తెలుగు మాటలనంగవలదు వేదముల కొలదియగా చూడు’’డని సంస్కృత విద్వాంసుల మధ్య ఎలుగెత్తి చాటిన అచ్చమైన తెలుగు భాషాభిమాని పాల్కురికి సోమన. ‘తిన్నని సూక్తుల ద్విపద రచింతు’ అని శపథం చేసి, ద్విపద కావ్యాలు రాశాడు. సంస్కృత భూయిష్ట రచన సామాన్యులకు అందదు. కాబట్టి జానుతెనుగులో రాశాను అన్నాడు. కోకమ్మి, ముల్లోకవంద్య, దీపకంబము వంటివి స్వేచ్ఛగా వాడి ‘‘నాకు ప్రజలే ముఖ్యం కాని లాక్షణికులు కాదు’ అనే సందేశాన్ని ఆ కాలంలోనే ఇవ్వటం సోమనకే చెల్లింది. సోమన రచనలు పరిశీలిస్తే 12వ శతాబ్దాన్ని ‘‘పాల్కురికి సోమన యుగం’’గానే పేర్కొనటం సముచితం. ఎందుకంటే తొలి ద్విపద కావ్యం, తొలి శతకం, తొలి ఉదాహరణ కావ్యం’ తొలి అష్టకం, తొలి రగడరచన, తొలి అక్షరాంకగద్య.... ఇన్ని రచనలకి శ్రీకారం చుట్టినవాడు యుగకర్తే! మహబూబ్‌నగర్‌ దగ్గర్లోని వర్తమానపురం కోనవంశీయుల నివాస స్థలం. ఈ కోనవంశీయులు కాకతీయ చక్రవర్తులకు సామంతులై రాయచూర్‌ ప్రాంతాన్ని పాలించారు. ఈ వంశానికి చెందిన గోన గన్నారెడ్డి ‘రంగనాథ రామాయణం’ ద్విపదలోరాసి తొలి ద్విపద రామాయణ కవిగా నిలిచిపోయాడు. ఈ రామాయణం ఎంతగా జనంలోకి వెళ్లిందంటే బొమ్మలాటల వాళ్లు కూడా దీని ఆధారంగా పాటలు, మాటలు సమకూర్చుకొనేవారు. అంత ప్రాచుర్యం పొందిన రంగనాథ రామాయణం నిన్నమొన్నటి వరకూ అనాదరంగా పడి ఉండటం శోచనీయం. రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ, పింగళి లక్ష్మీకాంతంగార్ల కృషి వల్లే ఇది సాహిత్య చరిత్రలో పాఠ్యాంశంగా స్థిరపడింది. ‘అల్లవో రఘురామ! నయనాభిరామ! ... బాపురే, రామభూపాల! లోకములనీ పాటివిలుకాడు నేర్చునే కలుగ’ అని రావణాసురుడు రాముడ్ని ప్రశంసించటం పరమ ఔచిత్యవంతంగా వుంటుంది. తెలుగులో చంపూ రామాయణం లేని లోటును భాస్కర రామాయణం పూరించింది. ‘‘సకల సుకవిజన సంస్తూయమాన యశోమూర్తి’’ అయిన భాస్కరుడు దాదాపు 1140 పద్యాలు రాస్తే రావలసినంత ప్రఖ్యాతి రాలేదు. ఎఱ్ఱన రామాయణం రాశాడని చెప్తున్నా లభ్యం కాలేదు. హుళక్కి భాస్కరుడు, మల్లికార్జునభట్టు, కుమార రుద్రదేవుడు, అయ్యలార్యుడు కలిసి భాస్కర రామాయణం రచించారు. పూర్తి రామాయణం లభ్యమవుతున్నా కూడా ఇది ఇటీవల ఆచార్య రవ్వా శ్రీహరి పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందిన తర్వాత గానీ కొంత వ్యాప్తిలోకి రాలేదు. భాస్కర రామాయణం ‘ఇతిహాస కావ్యం’గా రాయబడింది. వాల్మీకి రామాయణానికే బద్ధం కాకుండా స్వతంత్రానువాదంగా విలసిల్లిన ఈ రచన పురాణపఠన ప్రక్రియలో పేరు పొందింది. శబ్ద చమత్కారాలు, రసవత్తర సంభాషణలు, నవ్య ఉపమానాలు భాస్కర రామాయణ ప్రత్యేకతలు. రాజనింద చేసిన తొలికవిగా, భక్తితత్వాన్ని కొత్త పాఠంగా బోధించిన సహజకవిగా, కర్షక కవిగా, తెలుగు భాషాశక్తిని సంపూర్ణంగా హస్తగతం చేసుకున్న పరమభాగవతోత్తముడు బమ్మెర పోతన. వరంగల్‌ జిల్లా బమ్మెర స్వగ్రామమని చారిత్రకంగా, సాహిత్యపరంగా నిరూపితమైంది. ‘పోతనకు పునర్జన్మలేదు. అసలు పోతన మరణిస్తేగదా’’ అన్నాడు ఆరుద్ర! ‘దీనిని దెనిగించి నా జననంబున్‌ సఫలంబుచేసెద పునర్జన్మంబు లేకుండగన్‌’’ అని ఉప్పొంగిపోయి తెలుగువారికి భాగవత మకరంద మాధుర్యాన్ని అందించాడు. సంపదలు, రాజాశ్రయాలు కోరని స్వేచ్ఛాజీవి, పరమ భాగవతోత్తముడు పోతన. ఆయన ‘సత్కవుల్‌’ హాలికులైననేమి?’ అనటంలో ఆశ్చర్యంఏముంటుంది? శ్రీనాథుడికీ, పోతనకీ వ్యక్తిత్వంలో, కవిత్వంలో చాలా తేడావుంది. దీనికి ‘‘విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపఱతు’’ అని పోతన అనటమే నిదర్శనం. శ్రీనాథుని చాటువులు వ్యాప్తికెక్కితే పోతన భాగవతం అందరి హృదయాలలోకి వ్యాప్తి చెందింది. ‘ఇందుగలడందులేడని సందేహము వలదు....’ అంటూ ఎన్నడో 15వ శతాబ్దంలో రాసింది నేటికీ పత్రికా శీర్షికల్లో కనబడుతోందంటే పోతన కవితా వ్యవసాయం మనకెంతటి మధుర ఫలాలను అందించిందో కదా! బమ్మెరపోతన తెలుగు భాషా మాధుర్యానికి ద్వారాలు తెరిచాడు!! ‘‘చింతమదిలేక మనుజులు చింతించిన కొలది చవులు చేకూర్చుచుని (చవులు = రుచులు) శ్చింతులుగా నొనరించెడు చింతకు సరిగలదె లోక చింతామణికిన్‌’’ అంటూ ‘చింత’ చమత్కారంతో ‘సింహాసన ద్వాత్రింశిక’ రాసిన కవి కొరవి గోపరాజు. ఈ కావ్యాన్ని సాంఘిక విజ్ఞాన సర్వస్వం అంటారు. అంతకు ముందు ఇటువంటి కథాకావ్యం రాలేదు. 32 బొమ్మలు చెప్పే కథలతో నవరసభరితంగా రాసిన మణిరత్నం ఇది. ఒకనాటి తెలంగాణ పలుకుబడులను భద్రపరచిన కవిగా, సురవరం ప్రతాపరెడ్డిగారి సాంఘిక చరిత్రకు మూలకవిగా గోపరాజును పేర్కొనాలి. చిన్న చిన్న మాటలతో తేనెలు కురియునట్లుగా కొత్త ఒరవడి సృష్టించిన సామాజిక కవిగా గోపరాజును ప్రశంసించాలి. ‘క్రీడాభిరామం’ తొలి వీథిరూపకంగా సుప్రసిద్ధం. శ్రీనాథుడు రాశాడా? వల్లభామాత్యుడు రాశాడా? అన్న వివాదంవుంది. అసలు రహస్యం ఏమిటంటే ఎవరు రాసినా మూలం తెలంగాణ కవిరచనే!! ఆ కవి రావిపాటి త్రిపురాంతకుడు. ఆ రచన ‘ప్రేమాభిరామం’ (సంస్కృతం). ఇందులోని ఓరుగల్లు వైభవ వర్ణన క్రీడాభిరామంలోనూ కనిపిస్తుంది. అందుకే క్రీడాభిరామం కాకతీయుల కాలం నాటి పరిస్థితుల్ని వివరించిన రచనగా స్థిరపడింది. ‘కవులలో ముందు చూపుగలవారును, వర్తమాన చరిత్రాంశములు భావి భాగ్యోదయానికి మూలకందములని భావించినవారును, సంప్రదాయమునకు ఎదురీదినవారును అగు కవిగ్రామణులు లేకపోలేదు. ఆంధ్ర వాజ్మయ చరిత్రలో అట్టివారిని వ్రేళ్ళమీద లెక్కచెప్పవచ్చును. అట్టి కొద్దిమందిలో కాసె సర్వప్ప అను కవీశ్వరుడొకడు’ అని మాడపాటి హనుమంతరావు శ్లాఘించారు. క్రీ.శ. 1600 ప్రాంతంలో చెర్వుపల్లిలో నివసించి, హన్మకొండ రాజాస్థానంలో పనిచేసిన సర్వప్ప ‘శ్రీ సిద్దేశ్వర చరిత్ర’ ద్విపద కావ్యం రాశాడు. వీరందరికీ పాల్కురికి సోమన దిశానిర్దేశకుడనిపిస్తుంది. ఈ చారిత్రక కావ్యంలో వజీర్లు, సరదార్లు, బత్తీసు, ఎల్లెము, తోకొంచు వంటి తెలంగాణ పదాలు కనిపిస్తాయి. రాజుల చరిత్రను ద్విపద కావ్యంగా మలచిన వారిలో సర్వప్ప ప్రప్రథముడు. ఇంతవరకు ఈ కావ్యంపై లోతుగా పరిశోధన జరగలేదు. తెలంగాణ తొలి రచనలకు కాణాచి అనేందుకు మరో సాక్ష్యం ‘సకలనీతి సమ్మతం’. ఇది తొలి సంకలన గ్రంథం. మడికి సింగన కృషి ఫలితం. 17 పుస్తకాల నుంచి రాజనీతి, లోకనీతి, శాస్త్ర అంశాలు మొదలైన మేలిముత్యాలను సేకరించి సంకలనం వెలువరించటం, అసలు 15వ శతాబ్దంలో అటువంటి ఆలోచన రావటమే అపూర్వం. ‘లోకోపకారముగ’ రచించానని చెప్పటంలో సమాజహితం లక్ష్యం అని తెలుస్తుంది. రాయబారికి మేధ, వాక్పటుత్వం, ప్రజ్ఞ, ఇంగితజ్ఞానం, ధైర్యం, రాజ భక్తి, వైరి ధర్మసంశోధన, విశుద్ధచరిత్ర - అనే లక్షణాలుండాలన్న పద్యం గమనిస్తే రాజకీయంగా ఎవర్ని రాయబారిగా నియమించాలో నేటికే కాదు, ఎప్పటికీ సార్వకాలిక సత్యమే. మరుగునపడ్డ మరొక కవి చరిగొండ ధర్మన్న. ‘‘చిత్రభారతం’’ కావ్యకవిగా అటుంచి- అవధాన విద్యకు ఆధ్యుడన్నది విశేషం. గంటకు అవలీలగా నూరు పద్యాలు చెప్పేవాడట! ‘శతలేఖిన్యవధాన పద్య రచనా....’ అని స్తుతి పొందటం అక్షర సత్యమే. విమర్శకులు సారంగు తమ్మయ్య రాసిన ‘వైజయంతీ విలాసం’ ప్రబంధానికి సముచిత స్థానం ఇవ్వకపోగా నీతిబాహ్యమైనదని ఆడిపోసుకున్నారు. అంతకుముందు శృంగారస ప్రవాహం గల కావ్యాలు, అంగాంగ శృంగారం దట్టించిన ప్రబంధాలు లేవా? గోల్కొండ ప్రభువును స్తుతించి కూడా, గౌరవం పొంది కూడా అతనికి అంకితం ఇవ్వకుండా తన కులదైవం శ్రీరాముడికి అంకితం ఇవ్వటంలో తమ్మయ్య వ్యక్తిత్వం, దైవభక్తి అవగతమవుతాయి. పైగా ఈ కవి గురువైన కందాళ అప్పలాచార్యులు సామాన్యుడు కాడు. విష్ణు భక్తుడు. స్త్రీ లోలత్వం తగదన్న సందేశమిచ్చే ‘వైజయంతీ విలాసం’లో తెలుగుదనం, సరళత్వం నిండుగా ఉందని నిష్కర్షగా ప్రకటించారు ఆరుద్ర. 16వ శతాబ్దానికి చెందిన అద్దంకి గంగాధర కవి రాసిన ‘తపతీ సంవరణోపాఖ్యానం’ ప్రబంధాన్ని కూడా విమర్శకులు ఆదరించలేదు. ఈ కథ నన్నయ భారతంలోదే తప్ప స్వతంత్రమైనది కాదు. శృంగార నైషధంలో స్వర్ణహంసలా, ప్రభావతీప్రద్యుమ్నంలో శుచిముఖిలాగా, కళాపూర్ణోదయంలో చిలుకలాగా ఈ ప్రబంధంలోనూ చిలుక తపతి-సంవరణుల్ని కలుపుతుంది. మంచి కల్పనలతో వసుచరిత్రలా వుందని కందుకూరి కితాబు ఇచ్చినా గంగాధర కవికి అన్యాయం జరుగుతూనే వుంది. మహమ్మదీయ ప్రభువైన ఇబ్రహీం కుతుబ్‌షాకి తపతీసంవరణం అంకితమీయబడటం విశేషం. గోల్కొండ నవాబు తెలుగును ఆదరించాడన్నది సత్యం. అందుకే కవులు ఇబ్రహీం కుతుబ్‌షాను ‘మల్కిభరాముడు’గా కీర్తించారు. తెలంగాణ నుంచి వెలువడిన మరొక అపూర్వ కావ్యం ‘యయాతి చరిత్ర’. ఇది తొలి అచ్చ తెలుగు కావ్యం అని గుర్తుంచుకోవాలి. దీన్ని రాసిన పొన్నగంటి తెలగన పోటం చెర్వు (ఇప్పటి పటాన్‌చెరు) నివాసి. తన అచ్చతెలుగు కావ్యాన్ని ఇబ్రహీంకుతుబ్‌షా సర్దారుగా ఉన్న అమీన్‌ఖాన్‌కి అంకితమిచ్చాడు. ఏదో ఆశించి ఇవ్వలేదు. స్వయంగా అమీన్‌ఖాన్‌ ‘నీ చేయునచ్చ తెనుగు గబ్బమన్నియెడల మించి వెలయగాన మీను ఖానునకిచ్చి’ అని మరింగంటి అప్పన్న ద్వారా కబురు పంపి అంకితం తీసుకున్నాడు. అంటే గోల్కొండ పాలకులకు తెలుగన్నా, తెలుగు కవులన్నా ఎంత మక్కువ వుందో గ్రహింపవచ్చు. ఈ కావ్యంలోని కథ కూడా మహాభారతంలోదే. ఆత్మనివేదనకు పరాకాష్ఠగా రామదాసు కీర్తనలను ఆరాధిస్తూ, భజనలు చేస్తూ తెలుగుజాతి పునీతమవుతోంది. ఈ కంచర్ల గోపన్న తన భక్తి తన్వయత్వంలో ప్రజల చేత భక్తరామదాసుగా ప్రశంసించబడ్డాడు. భక్తులలో రామదాసు ధైర్యశాలి. అంతా ఆ పరమాత్ముడే చూసుకుంటాడన్న దాస్యభక్తికి నిలువెత్తు సాక్ష్యం. గుళ్ళల్లో, ఉత్సవాల్లో, జానపదుల కళారూపాలలో రామదాసు కీర్తనలు ఉండవలసిందే. కాళ్ళకు గజ్జె కట్టి, చెక్కభజన చేస్తూ ‘ఓ రామ, ఓ రామ...’ అని పాడుతూ వుంటే ఇహలోకాన్ని మర్చిపోతాం. వాడుక తెలుగులో ఎంత శక్తి వుందో రామదాసు తేటతెల్లం చేశాడు. కీర్తనలతో ఆగిపోకుండా ‘దాశరథ శతకం’ రాసి కవితేజుడ్ని అని చాటాడు. మనసునిండా కరుణాపయోనిధిని పదిలపరచుకొని చదివితే చాలు- రామానుగ్రహం కలుగుతుందని హితోపదేశం చేశాడు. నల్గొండ జిల్లా వాస్తవ్యులైన మరింగంటి కవులు, పండితులు ఎన్నో రచనలు చేసి తెలంగాణలో మహావిద్వాంసులకు, వేదాంతులకు లోటులేదని చాటారు. మరింగంటి కుటుంబాలన్నీ సంప్రదాయ కవిత్వానికి ఆటపట్టులే. ఇటీవల శ్రీరంగాచార్యులు ఈ కవులపై పరిశోధనచేసి వారి ప్రతిభాపాటవాలను వెల్లడించి తెలంగాణ ప్రాశస్త్యాన్ని మరోసారి ప్రకటించారు. తెలంగాణలో యక్షగాన వాఙ్మయం ఎంతగానో విస్తృతి చెందినా పట్టించుకోలేదు. ఇటీవల ఆచార్య బాగయ్య, శ్రీకాంత్‌ కుమార్‌ కలిసి ‘తెలంగాణ యక్షగాన వాఙ్మయం’ అనే 665 పుటల బృహత్‌ గ్రంథం రాశారు. ఇంకా... ఇంకా ఎందరో తెలంగాణ ప్రాచీన కవితా సామ్రాజ్యమేనని నిరూపించినవారున్నారు. ‘‘ముంగిలి’’లో డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి మొదటగా ప్రాచీన కవిత్వంపై పుస్తకం తీసుకువచ్చారు. పాల్కురికి సోమన, పోతన... వంటి వారు సరే కానీ- ఈ వ్యాసంలో ప్రస్తావించిన మరుగునపడిన లేదా అనాదరణకు గురైన, అముద్రిత రచనల, కవులపైనా ప్రత్యేకమైన కృషి జరగాలి. యక్షగానాలపై విస్తృతంగా, ప్రామాణికంగా అధ్యయనం చేస్తే తెలంగాణ తెలుగునుడికారం వెలుగులోకి వస్తుంది. ఈ ప్రపంచ తెలంగాణ మహాసభలు ఆ దిశగా కొత్తబాటలు వేస్తాయని ఆశిద్దాం. డా।। ద్వా.నా.శాస్త్రి కవిసార్వభౌములెందరో!! బమ్మెర పోతన ‘శ్రీ కైవల్యపదంబుజేరుట’ లక్ష్యంగా వ్యాస భాగవతాన్ని తెనిగించిన సహజ పండితుడు. పోతన భాగవతం ఇంటింటి పారాయణ గ్రంథమైంది. ‘‘పలికెడిది భాగవతమట, పలికించువిభుండు రామభద్రుండట...’’ అన్న పోతన తెలుగుల పుణ్యపేటి. పాల్కురికి సోమనాథుడు 12వ శతాబ్దంలోనే సామాజిక చైతన్యం రగిలించిన కవి. కృష్ణదేవరాయలకంటే ముందే తెలుగు భాషాభిమానాన్ని ప్రకటించిన దేశికవి. ఎన్నో సాహిత్య ప్రక్రియలకు పితామహుడు. గోన బుద్ధారెడ్డి ‘ఆదికవీశ్వరుడైన వాల్మీకి యాదరంబున పుణ్యులందరు మెచ్చ’ తొలి తెలుగు రామాయణం రాసిన ద్విపదకవి. రంగనాథ రామాయణాన్ని జనంలోకి తీసుకెళ్ళిన ప్రసిద్ధకవి. పొన్నగంటి తెలగన తెలుగుజాతికి తొలి అచ్చతెలుగు కావ్యామృతాన్ని అందించిన ప్రయోగవాది. ఇతని ‘యయాతి చరిత్ర’ దాదాపు 240 కందపద్యాల కబ్బము. లోకజ్ఞతకు, తెలుగు భాషాపటిమకు తెలగన చిహ్నపతాక. భక్త రామదాసు నేలకొండపల్లెలో జన్మించిన కంచర్ల గోపన్న ‘అంతా రామమయం ఈ జగమంతా రామమయం’ అంటూ రామదాసు అయ్యాడు. భజన సంప్రదాయానికి ఆద్యుడై, పావన గోదావరీ లహరీ శీకరాల వలె దాశరథీ శతక పద్యాలు గుప్పించి రామన్నకు బంటు అయ్యాడు. శేషప్ప కవి ‘భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర’ అంటూ నరసింహ శతకం రాసిన భక్తాగ్రగణ్యుడు. భగవంతుని సేవ గొప్పవరం ఇదే భక్తియోగం- అని చాటిచెప్పి లోకరీతిని కళ్లకు కట్టించిన దొడ్డకవి శేషప్ప. మల్లినాథ సూరి సకలశాస్త్ర పారంగతుడు, సంస్కృతంలో మహామహోపాధ్యాయుడు. మెదక్‌ జిల్లాకు చెందిన వ్యాఖ్యాతృ శిరోమణి. సంస్కృతకవులకు ప్రాచుర్యం కల్పించిన అంతర్జాతీయ సుప్రసిద్ధుడు.. మన తెలుగువాడు కావటం మన అదృష్టం. చెర్విరాల బాగయ్య మెదక్‌ జిల్లా నరసాపురం తాలుకాలో 1904లో పుట్టిన చెర్విరాల బాగయ్య 14వ ఏటనే కవిత్వం చెప్పిన ప్రజ్ఞాధురీణుడు. తెలంగాణ యక్షగాన పితామహుడు. 100కు పైగా యక్షగానాలు రాసిన ‘ఒకే ఒక్కడు’గా ఖ్యాతిపొందినవాడు. బాగయ్య రాసిన ‘‘సుగ్రీవ విజయం’’ యక్షగానం లక్ష ప్రతుల అమ్ముడుపోవటం నభూతో నభవిష్యతి’. కొక్కొరోకో.. తొలి తెలుగు కోడి కూసింది! తొలి కోడి కనువిచ్చి నిలిచి మైవెంచి జలజల రెక్కలు సడలించి నీల్గి గ్రక్కున గాలార్చి కంఠంబువిచ్చి ముక్కున నీకెలు చక్కొల్పి కడుపు నిక్కించి, మెడసాచి, నిక్కి మున్సూచి కొక్కొరో కుర్రని కూయకమున్న- తెలుగు తోటలో గొంతెత్తి కూసిన తొలి కోడి ఇది! ఈ కూత ఎవరిదో తెలుసా? తెలుగు సాహిత్యాన్ని.. దివి నుంచి భువికి, రాజకోటల నుంచి మన పెరటిలోకి తీసుకువచ్చిన పాల్కురికి సోమన్నది! పురాణాలూ, ప్రబంధాలే సాహిత్య వస్తువులనీ, దేవతలూ ధరాపతులే కావ్య మన్ననలకు అర్హులని పండిత లోకం ప్రగాఢంగా విశ్వసిస్తున్న రోజుల్లో.. సాహిత్యాన్ని దేశిమార్గం పట్టించి.. కవిత్వాన్ని మన పెరటిలోకి తీసుకువచ్చి ‘కొక్కొరో కో’ అంటూ పొలికేక పెట్టాడాయన! అందుకే జలజలా రెక్కలు సడలించి.. నిక్కించి మెడ సాచి.. కొక్కొరో కుర్రని కోడి కుయ్యటంలోనూ అద్భుత సౌందర్యాన్ని తాను దర్శించటమే కాదు.. మన కళ్లకూ కట్టాడు పాల్కురికి సోమనాధుడు. ఓరుగల్లు రాజధానిగా కాకతీయ సామ్రాజ్యాన్ని గణపతిదేవ చక్రవర్తి పాలిస్తున్న రోజుల్లో.. రాజధానికి పన్నెండు క్రోసుల దూరంలో ఉన్న పాల్కురికి గ్రామంలో 1240 సంవత్సరం ప్రాంతంలో జన్మించిన ఈ అమరకవి.. మన తెలుగు వారి అదృష్టం! ఆనాడే అబలలు కాదన్న అచ్చమాంబ భండారు అచ్చమాంబ- 1910 కన్నా ముందే తెలుగులో కథలు రాసినట్టు ప్రచారంలో ఉన్న రచయిత్రి. ఈమె కొమర్రాజు లక్ష్మణరావు సోదరి. ఈమె రాసిన పుస్తకమే ‘అబలా సచ్చరిత్ర రత్నమాల’. 1947లో బెజవాడ అభ్యుదయ ప్రెస్‌ వారు దీనిని అచ్చువేశారు. స్త్రీ రత్నాల జీవితాలు, సాహస ఔదార్యాలు, భాషా సాహిత్యాలకు, సమాజానికి చేసిన సేవలు ఇందులో ఉన్నాయి. స్త్రీలు అబలలు కాదని ప్రకటించే పుస్తకమిది. ‘ఆత్మానమాత్మనాయాస్తు రక్షేయుస్తాస్సురక్షితాః’ - ఏ స్త్రీలు తమ ఆత్మను తామే కాపాడుకుంటారో, వారే సురక్షితురాండ్రు- అనే నినాదం లోపలి పుటలో కనిపిస్తుంది. నాలుగు సంవత్సరాలు ఎన్నో పుస్తకాలు చదివి, పెద్దల నుంచి సమాచారం సేకరించి మొదటి భాగం తీసుకువచ్చారు. రెండో భాగంలో వైదిక స్త్రీల చరిత్ర, పౌరాణిక స్త్రీల చరిత్రను రాయాలని ప్రణాళిక వేసుకున్నారు. ‘‘శ్రేష్ఠమైన కులములందు పుట్టి విద్య లేకుండిన ఏమి లాభము? నీచ కులమునందు పుట్టినను విద్యావంతులైన వారు అందరికీ పూజ్యులు’’ అంటూ స్త్రీ జనోద్ధరణ భావాలతో అనాడే ‘అబలా సచ్చరిత్ర రత్నమాల’ రాయడం విశేషం. గుండెల్లో కత్తులు నూరిన కవితా పాదాలు! కన్నూమిన్నూ కానని నియంతల పీచమణిచేందుకు కడు సామాన్యుడు సైతం ఓ కత్తుల వంతెన కడతాడు. పడిన బాధలు లోలోపల రక్తం మరిగిస్తుంటే శక్తికి మించిన సాహసానికి సైతం సిద్ధమైపోతాడు. రజాకార్ల ఘాతుకాలకు పడరాని పాట్లు పడి జీవచ్ఛవాల్లా కకావికలమైపోతున్న సామాన్యుడి గుండెలో ప్రతీకార జ్వాలలను రగిలించేందుకు ప్రజా కవి కాళోజీ రాసిన ఈ కవిత.. పదం పదం పేలిపోయింది. నిప్పు కణికలా రగిలిపోతూ జన సంద్రాన్ని కదిలించి ఉవ్వెత్తున ఉద్యమ పథం పట్టించింది. నాటి దురాగత దుర్ఘడియలకే కాదు.. నియంతలు బుసలు కొట్టిన ప్రతిసారీ ‘కాలంబు రాగానె కాటేసి తీరాలె’ అంటూ ఈ అద్భుత కవితా పాదాలు చరిత్ర పుటల్లో పైకి వస్తూనే ఉంటాయి. కడు సామాన్యులను సైతం కదిలిస్తూనే ఉంటాయి. సాహిత్యానికి ఇంతకు మించిన సార్థక్యం మరేముంటుంది! మన కొంపలార్చిన మన స్త్రీల చెరచిన మన పిల్లలను చంపి మనల బంధించిన మానవాధములను మండలాధీశులను మరచిపోకుండగ గురుతుంచుకోవాలె కసి ఆరిపోకుండ బుసకొట్టుచుండాలె కాలంబు రాగానె కాటేసి తీరాలె ‘సత్యమ్మహింస’యని సంకోచపడరాదు ‘దయము ధర్మం’బనుచు తడుముకోపనిలేదు ‘శాంతి’యని చాటినను శాంతింపగారాదు ‘క్షమ’యంచు వేడినను క్షమియింపగారాదు ‘చాణుక్యనీతి’ నాచరణలో పెట్టాలె కాలంబు రాగానె కాటేసి తీరాలె తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలె కొంగులాగిన వ్రేళ్లు కొలిమిలో పెట్టాలె కన్ను గీటిన కళ్ల కారాలు చల్లాలె తన్నిన కాళ్లను ‘డాకలి’గ వాడాలె కండకండగ కోసి కాకులకు వెయ్యాలె కాలంబు రాగానె కాటేసి తీరాలె! మదిమదినీ కదిలించే విశ్వంభర గానం ‘‘ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంభర. ఇతివృత్తం తేదీలతో నిమిత్తం లేని, పేర్లతో అగత్యం లేని మనిషి కథ. ఈ కథకు నేపథ్యం ప్రకృతి.. అంటూ విశ్వంభర గానాన్ని ఆరంభించిన సి.నారాయణరెడ్డి మనిషిలోని మూల ధాతువులను తట్టి లేపుతూ.. మనశ్శక్తులను ఉత్తేజితం చేసే అద్భుత ప్రయత్నం చేశారు. మానవుడే నాయకుడిగా వచన కవితలో ఒక సమగ్ర కావ్యంగా రూపుదిద్దుకున్న ఈ విశ్వమానవేతిహాసం.. సినారెకు జ్ఞానపీఠాన్ని తెచ్చిపెట్టటమే కాదు.. మనకు అనుదిన పాఠాలూ నేర్పిస్తుంది. ఊరుకోదు... అరుణోదయం ఊరుకోదు కిరణాలను సారించనిదే. వసంతోదయం ఊరుకోదు పరిమళాలను పారించనిదే. ప్రసరించే నీరు ఊరుకోదు పల్లం అంతు ముట్టనిదే. ప్రతిఘటించే మనస్సు ఊరుకోదు ప్రశ్నలను ఎక్కుపెట్టనిదే. - సినారె(విశ్వంభర)

    Friday, December 8, 2017

    అంతర్యామి సంకర్షణుడు


    అంతర్యామి సంకర్షణుడు భగవానుడు ఎన్ని అవతారాలు దాల్చినా, వాటి లక్ష్యం ఒక్కటే. అది లోకరక్షణ లేదా సకల జీవరాశి శ్రేయస్సు. మానవుడు బుద్ధిజీవి కాబట్టి, రక్షణే లక్ష్యంగా తన వంతు ప్రయత్నం సాగించాలి. జీవన శైలిలో మార్పుల్ని ఆహ్వానించాలి. వాటిని ఆచరణకు తెచ్చిన వివేకవంతుడే బలసంపన్నుడవుతాడు. సమాజ క్షేమానికీ ఉపయోగపడతాడు. తానే ఓ రక్షణ కవచంలా నిలిచి గెలుస్తాడు. సకల జీవరాశులకూ జీవంగా ప్రకాశించే భగవానుడే మహాబలుడు. ఆయన అనంతమైన బలం కలిగినవాడు, లోక రక్షకుడని పురాణ వాఙ్మయం చెబుతుంది. బలం ఉండేది బలహీనుల్ని కాపాడేందుకే అని ఆర్యోక్తి. అందుకే శారీరక, మానసిక బలాలు భగవానుడు తనకు ప్రసాదించిన దివ్యశక్తులని మానవుడు గ్రహించి వ్యవహరించాలి. శ్రీకృష్ణుడి అగ్రజుడు బలరాముడు. ఆయన ఆదిశేషుడి అవతారం. బల పరాక్రమాలకు పేరొందినవాడు. రాముడు అంటే, హృదయాన్ని రంజింపజేసేవాడు అని అర్థం. మనిషి ఉనికి, అతడు చేసే ప్రతి పనీ ఇతరులకు ఆనందం పంచేలా ఉండాలన్న సందేశమిస్తుంది బలరామావతారం! దేవకీ వసుదేవుల్ని చెరసాలలో ఉంచాడు కంసుడు. యోగమాయ భగవానుడి ఆజ్ఞ ప్రకారం దేవకీదేవి సప్తమ గర్భాన్ని రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టింది. అప్పుడు గర్భస్త పిండం సంకర్షణకు గురైంది. ఒరిపిడి చెందింది. రోహిణి గర్భవాసాన బలరాముడు జన్మించాడు. అందుకే శాస్త్రపురాణాలు ఆయనను ‘సంకర్షణుడు’ అని వ్యవహరిస్తాయి. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడై దేవకీదేవి అష్టమ గర్భంగా జన్మించాడు. ఆ భగవానుడికి బలరాముడే తోడు, నీడ. అక్కడే రమ్యమైన జగత్కథ మొదలైంది. పరమాత్మతో బాల్యక్రీడలు, విద్యాభ్యాసం మొదలుకొని అవతార సమాప్తి వరకు బలరాముడిది సుదీర్ఘ గాథ. ఆ చరితం పురాణ ప్రసిద్ధం. భగవానుడిలో తనను, తనలో భగవానుణ్ని దర్శనం చేసుకున్న ఆత్మజ్ఞాని ఆయన. ఏ సందర్భంలోనూ సోదరుడి మాటకు ఎదురాడలేదు. రాక్షస మాయల్ని ఛేదించడంలో బలరాముడే కృష్ణుడికి సచివుడు. కంస సభలో చాణూరాది దానవుల్ని సోదరుడితో కలిసి సంహరించి అపార పటిమ చాటాడు. విపత్తుల నుంచి రక్షించే కవచాలు శారీరక, బుద్ధిబలాలేనని బృందావనం, మధురల్లో పలు ఘట్టాల ద్వారా తెలియజెప్పాడు. సకల విద్యలకు, సమస్త శాస్త్రాలకు ఆదిశేషుడే అధిదేవుడు. అంతకుమించి భగవానుడికి ఆయనే సమస్తం! గురుముఖతః నేర్వని విద్య శోభించదు. అందుకే సోదరుడితో కలిసి సాందీప మహర్షి వద్ద విద్యాభ్యాసం చేశాడు. అది అవతార ధర్మం. బలరాముడు తానే గురువై భీముడికి, దుర్యోధనుడికి గదాయుద్ధం నేర్పించాడు. కృష్ణుడు పాండవ పక్షం వహించడంతో, ఆయన కౌరవులకు కొంత దగ్గరయ్యాడు. కురుక్షేత్ర సంగ్రామంలో దూరంగా ఉన్నాడు. శిష్యుడైన దుర్యోధనుడి పట్ల బలరాముడికి వాత్సల్యం ఉండేది. జగన్నాటకం రక్తికట్టాలి కాబట్టి, అంతటి అవతార పురుషుడికీ కొంత సాధారణ వైఖరి తప్పలేదు. కురుక్షేత్ర సంగ్రామం చివరిదశలో- భీమ, దుర్యోధనుల గదాయుద్ధం వేళ నీతిరాహిత్యాన్ని బలరాముడు నిరసిస్తాడు. ఆ తరవాతి పరిణామాల్లో తీర్థయాత్రలకు వెళ్లిపోతాడు. అన్నదమ్ముల అన్యోన్యతకు వారి బంధమే నిదర్శనం. అవతార పురుషులైనా, భూమిపై జన్మించినందుకు ‘నిష్క్రమణలు’ తప్పవు. వారు వచ్చిన బృహత్కార్యాలు పూర్తయ్యాయి. అందువల్ల బలరాముడు తిరిగి వైకుంఠానికి చేరతాడు. పూరి వంటి మహాక్షేత్రాలు శ్రీకృష్ణ, బలరామ, సుభద్రల అనురాగ బంధాల్ని అవతారాల ఆంతర్యాన్ని తెలియజేస్తాయి. దివ్యసందేశాల్ని అనుగ్రహిస్తాయి. అన్నదమ్ముల మధ్య ప్రేమాభిమానాలు ఉండాలే తప్ప, మాట పట్టింపులు ఉండకూడదు. ఏదో ఒక సందర్భంలో కోపతాపాలు ప్రదర్శించినా, మనసు ఎప్పుడూ నవనీతంలా ఉండాలి. ప్రేమాభిమానాలు సదా వెల్లివిరియాలని బలరామ అవతార తత్వం చాటి చెబుతుంది. - దానం శివప్రసాదరావు

    MY GOOGLE DRIVE YSREDDY94HYD


    MY GOOGLE DRIVE YSREDDY94HYD

    Thursday, December 7, 2017

    OUR BHAKTI UPLOADS_gangaramplots


    OUR BHAKTI UPLOADS_gangaramplots

    అంతర్యామి ఏకాగ్రత

    అంతర్యామి


    ఏకాగ్రత
    త్మశుద్ధి లేని ఆచారం, భాండశుద్ధి లేని పాకం, చిత్తశుద్ధి లేని శివపూజ వ్యర్థమంటాడు వేమన. ఏకాగ్రత లేని పనులు సైతం వ్యర్థమైనవే. కార్యం- అది లౌకికమైనా, ఆధ్యాత్మికమైనా ఏకాగ్రత కొరవడితే చెడిపోతుంది. ‘ధ్యానం’ అనే మాట తరచుగా వింటుంటాం. ధ్యానం, ఏకాగ్రత- రెండూ సహ భావనలే! ఆ రెండింటికీ సన్నిహిత సామ్యం ఉంది.
    ధ్యానం అనే మాటను పారమార్థిక దృష్టితో వాడతాం. సర్వసాధారణంగా ‘పరధ్యానం’ అనే మాటనూ ఉపయోగిస్తుంటాం. ఎవరికైనా ధ్యానం అలవడాలంటే, ఏకాగ్రత కుదరాలి. అది సాధించాలంటే, ధ్యానం సాగించాలి.
    ప్రహ్లాదుడిది అనితరసాధ్యమైన విష్ణుభక్తి. తండ్రి ఎన్ని హింసలకు గురిచేసినా, అతడి మార్గానికి అవరోధం కలగలేదు. నమ్మిన దైవం పట్ల అచంచలమైన ఏకాగ్రతే దానికి కారణం. అలాగే, తండ్రి ప్రేమ పొందాలని ధ్రువుడు చెక్కుచెదరని దీక్షతో తపస్సు చేశాడు. ఆ ధ్యానానికి మూలం ఏకాగ్రత. వసిష్ఠుణ్ని మించిన బ్రహ్మర్షి కావాలన్నదే రాజర్షి విశ్వామిత్రుడి ప్రగాఢ కోరిక. దాన్ని ఆయన ఏకాగ్ర చిత్తం, పట్టుదలతో తపస్సు చేసి సాధించాడు. ‘భగీరథ ప్రయత్నం’ అనే మాట వింటుంటాం. తన పూర్వీకులకు పుణ్యలోకాలు ప్రాప్తింపజేయాలన్న తపన ఆయనది. అదే దీక్షతో, దివి నుంచి భువికి గంగ దిగివచ్చేలా తపస్సు ఆచరించాడు.
    ఒకే విషయం మీద దృష్టిని లగ్నం చేయడం ఏకాగ్రత. దాన్ని ‘లక్ష్యం’ అనీ పిలుస్తుంటాం. ద్రోణుడు చెట్టును చూపించిన తక్షణం, దాని కొమ్మమీద గల పక్షి కన్ను అర్జునుడి లక్ష్యమైంది. అందుకే మేటి విలుకాడయ్యాడు. అంటే- లక్ష్యం, ఏకాగ్రత ఒక్కటే.
    మనిషి మనసు నిండా ఆలోచనల పరంపరలుంటాయి. అతడి స్వేచ్ఛకు, బంధానికి మనసే కారణమని విజ్ఞులు చెబుతారు. పరమ చంచలమైనది మనసు. దానికి స్థిరత్వం లేదు. ఆ స్థిరత్వాన్ని ఎలాగైనా సాధించడమే ఏకాగ్రత. అభ్యాసం కూసువిద్య అంటారు. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అనీ చెబుతారు. అభ్యాసం, సాధన వల్ల ఏకాగ్రత సాధించవచ్చు. ఒకే లక్ష్యంపై మనసును కేంద్రీకరించవచ్చు. నిరంతర అభ్యాసం వల్ల మనసును ఎలా నిరోధించవచ్చో భగవద్గీత, పతంజలి యోగసూత్రాలు తెలియజేస్తాయి.
    ఏకాగ్రతతో ఏదైనా పని చేయాలంటే, ముందుగా దానిమీద ఇష్టం ఉండాలి. అది లేకుండా ఏ పని చేసినా, ఏ కోశానా ఏకాగ్రత కుదరదు. వ్యక్తి ఎప్పుడైతే సర్వశక్తుల్నీ ఒక అంశంపైనే కేంద్రీకరిస్తాడో, అప్పుడే అతడి లక్ష్యసాధన మార్గంలోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అందుకు వివేకానంద, గాంధీజీ జీవితాలే ఉదాహరణలు.
    అవధానాలు చేసే పండితులు ఏకాగ్రతకే అధిక ప్రాధాన్యమిస్తారు. వారి దృష్టి ఎప్పుడూ సంబంధిత అంశం మీదే ఉంటుంది. దానికి సంబంధించిన ఆలోచనలు తప్ప, వేరేవీ వారి మనసులోకి ప్రవేశించవు.
    ‘శబ్దం’ అనేది మనసును ఒక విషయంపై కేంద్రీకృతం చేయడానికి తోడ్పడుతుంది. పిల్లలు బిగ్గరగా చదువుతారు. అలా చదవడం వల్ల, వారి స్వరం సృష్టిస్తున్న శబ్దాలు చెవుల ద్వారా మనసులోకి చేరతాయి. ఆ మనసు వారు వల్లె వేస్తున్న విషయాలపైనే నిలిచి ఉంటుంది. బయటకు చదవడం వల్ల, వారి ఏకాగ్రత స్థిరపడుతుంది. వేదమంత్రాల్ని గట్టిగా చదవడం, వల్లె వేయడం వెనక అంతరార్థం అదే! ఏకాగ్రత సాధించేందుకు అదే మొదటి మెట్టు.
    అందరిలోనూ ఏకాగ్రత స్థాయి ఒకేలా ఉండదు. అందరికీ అన్ని విషయాలపైనా ధ్యాస నిలవదు. చేసే పని మీద ఇష్టం పెంచుకుంటే, మనసులో దృఢమైన సంకల్పం ఉంటే, ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేయవచ్చు. ఇష్టం, సంకల్పం- ఈ రెండే ఏకాగ్రతకు సోపానాలు. వ్యాకులత, ఆరాటం, చంచలత్వం ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. మనిషి ముందుగా వాటిని జయించాలి!
    - డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

    Wednesday, December 6, 2017

    అంతర్యామి ప్రతి క్షణం... సద్వినియోగం!


    అంతర్యామి ప్రతి క్షణం... సద్వినియోగం!
     మనిషి మనసులో ఎన్నో ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని సాధించేందుకు కొన్ని వనరులూ అవసరమవుతాయి. వనరులకు ఉండే ముఖ్య లక్షణాలు రెండు. ఒకే వనరు పలు విధాలైన ప్రయోజనాలు సాధించేందుకు ఉపకరిస్తుంది. దేనికి ఎంత కేటాయించాలో తెలిసి వ్యవహరించేవాడే నేర్పరి. రెండోది- వనరులు ఎప్పుడూ పరిమితమే. అవి అన్ని అవసరాలకూ సరిపడా ఉండవు. కలల లోకంలోని దృశ్యాల్ని సాకారం చేయగల మోతాదులో అసలుండవు. ఉన్న వనరుల్ని మనిషి తన ముందు గల లక్ష్యాల సాధనకు వినియోగిస్తాడు. అప్పుడు అతడు తీసుకునే నిర్ణయాలు, చేసుకునే ఎంపికలు, వాటి ఫలితాల సారాంశమే జీవితం. నిర్ణయాల్లో, ఎంపికల్లో ఆచితూచి ప్రవర్తించే వ్యక్తి తన జీవితాన్ని చక్కదిద్దుకుంటాడు. అనుకున్నవి సాధించడంలో ఎక్కువ సాఫల్యం సాధిస్తాడు. దూకుడు, సోమరితనం, తెలివితక్కువ వంటి లక్షణాలున్నవాడు తక్కువ సాఫల్యం పొందుతాడు. పరిమితమైన వనరుల్ని లక్ష్యసాధనకు వినియోగించుకోవడంలో వ్యక్తికో పోకడ ఉంటుంది. అందులో కొంత భాగం అతడి సహజ స్వభావం! చాలా భాగం- తన చుట్టూ గల ప్రపంచానికి సంబంధించి అతడి అనుసరణ, అనుకరణలకే సరిపోతుంది. ఆ రెండింటి కలగలుపూ వ్యక్తి ప్రవర్తనను, జీవనవిధానాన్ని నిర్దేశిస్తుంది. బాగుపడాలనుకునేవాడు ఉత్తముల పోకడల్ని గమనించి, తనకు అనువైన రీతిలో అనుసరిస్తాడు. మనిషికి ఉన్న పరిమితమైన వనరుల్లో సమయం ఒకటి. దాన్ని ఎంత నైపుణ్యంగా వినియోగించుకుంటే అంత శ్రేయోదాయకమని పెద్దలు చెబుతారు. సనాతన సంప్రదాయంలో శ్రేయస్సు అంటే ఇహ పర క్షేమం. జీవుడి మనుగడకు ఈ జన్మలో ఇహలోక జీవనం ఆరంభం కాదు, అంతమూ కాదు. ఆరంభం, అంతం- అన్నీ శరీరానికే వర్తిస్తాయి. శరీరం జీవుడికి సొంతం కానే కాదు. అది కేవలం ధర్మసత్రం గది లేదా తాత్కాలిక వసతిగృహం. అన్నింటి కంటే ముఖ్యం- ఆ గది ఖాళీ చేసిన తరవాతి దశలో క్షేమం! అది సుదీర్ఘమైన దశ. మోక్షప్రాప్తి కలిగే దాకా ఎన్నో జన్మలపాటు సాగేది. పగలు పనిపాటలతో గడిపి రాత్రికి విశ్రమించే మనిషి, తన భోజనాది ఏర్పాట్లు ముందే చేసుకోవాలి. వానకాలంలో పనులు సజావుగా సాగవు కాబట్టి, ఆ కాలానికి సరిపడా పదార్థాల్నీ ముందుగానే సిద్ధపరచుకోవాలి. అదే కోవలో పారలౌకిక జీవనాన్ని క్షేమకరం చేసుకొనేందుకు ముందుజాగ్రత్త అవసరం. ఆ పుణ్యఫలాన్ని ఇహలోకంలో ఈ జన్మలోనే సంపాదించుకోవాలని సంప్రదాయం చెబుతుంది. ఇహలోకంలో పుణ్యకర్మలు చేసుకొనేందుకు భౌతిక శరీరమనే సాధనం ఉంది. శరీరం లేకుంటే, జీవుడికి సాధనమూ లేనట్లే! అందుబాటులోని సమయంలో ఎక్కువ భాగాన్ని మనిషి పలు ఇతర ప్రయోజనాలు, బాధ్యతల కోసం వినియోగిస్తాడు. ఉన్న సమయమంతా పూర్తిగా వాటికే కేటాయించడం, కాలాన్ని కరిగించడం సరికాదు. అది, పరిమితమైన వనరును సద్వినియోగం చేయడం అనిపించుకోదు. ‘నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఇక్కడ ఎందుకు ఉన్నాను’ అని ప్రశ్నించుకోవాలి మనిషి. ‘నా గమ్యం ఏమిటి, ఈ లోకాన్ని నడిపే శక్తి ఏది’ అని తర్కించుకోవాలి. ఆధ్యాత్మిక అన్వేషణ అంటే అదే! పఠన, శ్రవణ, ధ్యానాది సాధనల ద్వారా సాగించేందుకు సమయాన్ని కేటాయించుకోవాలనీ పురాణ గాథలు చెబుతాయి. ‘ఆ అన్వేషణ ఇప్పుడే ఎందుకు’ అని ఎవరైనా భావిస్తే, అది అమాయకత్వం. అన్ని శక్తులూ ఉన్నప్పుడే ఆ అన్వేషణ కష్టసాధ్యం. అటువంటిది అన్ని జవసత్వాలూ ఉడిగిన తరవాత అన్వేషణ అంటే- అది అంతుపట్టేది కాదు, ఒంటపట్టేదీ లేదు! - మల్లాది హనుమంతరావు

    అంతర్యామి - సాధన శక్తి - రామబంటు

    అంతర్యామి - సాధన శక్తి 
    ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అంటారు పెద్దలు. ఏ పనైనా సాధనతోనే సఫలీకృతమవుతుంది. పారమార్థిక మార్గంలో వెయ్యి గ్రంథాల పఠనమైనా ఒక గంట సాధనకు సమానం కాదని వారు చెబుతారు. ‘సాధన’ అనే మాట ఆధ్యాత్మిక రంగంలో ఎక్కువగా వినిపిస్తుంది. భగవత్‌ మార్గంలోని ప్రతి చిన్న పనీ సాధనే!

    పంచాగ్ని యజ్ఞం నుంచి పుష్ప సేకరణ దాకా ప్రతి ఒక్కటీ సాధన అవుతుంది. తీవ్రమైన తపస్సు నుంచి నిర్మాల్య నిర్మూలన వరకు ప్రతిదీ సాధనే అనిపించుకుంటుంది. భగవంతుడి పేరును జత చేస్తే చాలు- ఎటువంటి పువ్వునైనా పరిమళాలు కమ్ముకుంటాయి. పుక్కిలించిన నీళ్లు సైతం పవిత్ర జలాలై అభిషేక అర్హత పొందుతాయి. ఎంగిలి పండ్లు కూడా అమృతతుల్యమై నైవేద్యంగా మారతాయి. అదీ భగవన్నామ ఘనత, సాధనలోని విలక్షణత. అదెంతో రుచిరం... అంతకు మించి, మనోభిరామం!

    ఒకనాడు శంకరాచార్యులు వెళ్తున్న దారిలో, ఇంటి అరుగుమీద కూర్చుని సూత్రాలు సిద్ధాంతాలు వల్లెవేస్తున్న వ్యక్తి కనిపిస్తాడు. ‘వీటన్నింటి వల్ల ప్రయోజనం ఏమిటి? దైవాన్ని భజించు, సాధనతో జీవించు’ అని స్వామి బోధిస్తారు. అంత అవసరమైనది సాధన. భగవంతుణ్ని భజించడాన్ని మించిన సాధన లోకంలో మరేదీ లేదు.

    ప్రతి చిన్న పనీ సాధనే అయినా, పరిణామ క్రమంలో దాని స్థాయి మారిపోతుంటుంది. అక్షరాల క్రమం నుంచి వ్యాకరణం, దాని నుంచి పాండిత్యం, ఆ తరవాత పరిశోధనల వరకు పరిణామం చెందుతుంది విద్య. అదే రీతిలో సాధన పక్వం కావాలి. దీప ప్రజ్వలనం నుంచి దినకర ఆరాధన దాకా, తపోనిష్ఠ నుంచి తత్వమసి భావన దాకా అది సాగిపోవాలి. అందరిలోనూ భగవంతుణ్ని చూడటం నుంచి ‘నేనే భగవంతుణ్ని’ అనే ‘అహం బ్రహ్మాస్మి’ భావనలోకి పరిణతి చెందే వరకు సమస్తమూ సాధనే!

    ధ్యాన సాధన కంటే పుష్ప సమర్పణ గొప్పది. సమాధి స్థితి కన్నా ధూప సమర్పణే ఘనమైనది. ఇదంతా పరిణామ క్రమం. ప్రమిద లేనిదే చమురు పోయలేం. అది లేనప్పుడు వత్తి వేయలేం. వత్తి లేనిది జ్యోతిని వెలిగించలేం. పరిణామ క్రమమన్నా, సాధన క్రమమన్నా ఇదే! ధారగా మొదలైనదే నదిగా మారుతుంది. అదే ఉత్తుంగ తరంగ మహానది అవుతుంది. భక్తుడి సాధనా అంతే!

    సమర్పణ లేదా సాధన చిన్నదిగానే మొదలవుతుంది. అదే కఠోర తపస్సుగా రూపాంతరం చెందుతుంది. కార్తిక మాసం చలిలో నిండు వస్త్రాలతోనే ప్రాథమిక సాధన ప్రారంభిస్తాడు భక్తుడు. క్రమానుగతంగా సంభవించే మార్పుల వల్ల, అతడే కౌపీనమాత్రధారిగా మిగిలే సాధకుడవుతాడు. అతడు రుషిలా ఘన పరిణామం చెందాలి. పతంజలి మహర్షి విరచిత అష్టాంగ యోగసాధన నియమావళి అదే చెబుతుంది.

    యమ నియమ అనే సాధారణ స్థాయిలో సాధన ప్రారంభమవుతుంది. ముందుకు, మున్ముందుకు, ఇంకా పైపైకి సాగాలని నిర్దేశిస్తారు. మానవ విద్యాసాధనలో, జీవిక సాధనలో అక్షర క్రమంలోని ‘అ ఆ’లు ఎప్పటికీ ఉపయోగపడతాయి. ఎంతగానో ఉపకరిస్తాయి. అంతమాత్రాన అదే విద్య కాదు. అదే జీవితమూ కాదు. తరవాతి విద్యలోనే ఎంతో వైవిధ్యం ఉంటుంది. వివేకం, విశిష్టతా నెలకొంటాయి. సాధనా అంతే.

    ఒక్కో దశలో పైపైకి సాగిపోతున్న శిష్యుణ్ని, గురువే ఆపుతాడు. మెల్లమెల్లగా అతడి చేయి వదిలి, ఇంకా పైకి వెళ్లనిస్తాడు. శిష్యుడు తనను మించి మరెంతో ప్రయోజకుడిగా ఎదగాలన్నదే గురువు ఆశయం. మరొక విశేష పరిణామమూ ఉంది. పరిణతి చెందుతున్న దశలో, మనసే సాధకుడికి మార్గదర్శనం చేస్తుంది. అప్పుడు అతడు పొరపాట్లు చేసే అవకాశమే ఉండదు. ప్రగతి సాధించాక, భగవంతుడే చేయి అందిస్తాడు. సాధకుణ్ని ఇంకా పైపైకి తీసుకొని వెళ్తాడు. అలాంటి ఉదాహరణలెన్నో పోతన, త్యాగరాజు, సక్కుబాయి వంటి భక్తుల జీవితాల్లో కనిపిస్తాయి.

    - చక్కిలం విజయలక్ష్మి
    అంతర్యామి - రామబంటు
    విశ్వాసం, భక్తి, ఆరాధన భావాలతో సేవ చేసే వ్యక్తిని ‘బంటు’ అంటారు. తాను మనసా వాచా నమ్మిన మనిషి కోసం యావత్‌ జీవితాన్నీ వినియోగించడం అంత సులభం కాదు. దానికి నమ్మకం, సహనం, పట్టుదల, నేర్పు వంటి ఉత్తమ లక్షణాలుండాలి.

    యజమానులకు సేవకులుంటారు. వారు అహర్నిశలూ యజమానిని అంటి పెట్టుకొని ఉండరు. ఉదర పోషణార్థమే సేవాధర్మాన్ని అవలంబిస్తారు. మరికొన్ని చోట్ల బానిసత్వ సేవ కనిపిస్తుంది. అది సేవ కాదు, బతుకు భయంతో చేసే వూడిగం!

    కొంతమంది పుణ్యం కోసమో, పేరు కోసమో తమ సమయంలో కొంత వెచ్చించి మానవసేవ చేస్తారు. ఇంకొంతమంది భక్తిభావంతో దేవుణ్ని సేవిస్తారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఆలయాల్లో జరిగే వివిధ సేవాకార్యక్రమాల్లో పాల్గొని భక్తిప్రపత్తులు చాటుకుంటారు.

    మనిషి ఎందులోనూ సంపూర్ణంగా తనను తాను అర్పించుకోవడం అనేది ఉండదు. తల్లిదండ్రులకు, గురువులకు సేవలు ఆయా దశల్లో అవసరార్థం సాగిపోతుంటాయి. అవి యావజ్జీవం నెరవేర్చేవి కావు. ఎవరికైనా బంటుగా మారాలంటే, ఆ వ్యక్తి సర్వలక్షణ శోభితుడు కావాలి. ధర్మానికి ప్రతీకగా నిలవాలి. వినయ విధేయతలనే భూషణాలు ధరించాలి. పెద్దల పట్ల గౌరవం కనబరచాలి. తనవారు, ఇతరులు అనే తారతమ్యాలు లేకుండా సమభావన కలిగి ఉండాలి. అందరితోనూ మనసు విప్పి సౌమ్యంగా, ప్రీతిగా మాట్లాడాలి. అటువంటి ఉత్తమోత్తమ వ్యక్తికే జీవితాన్ని ధారపోయాలని అనిపిస్తుంది.

    శ్రీరాముడు అంతటి సద్గుణ సంపన్నుడు, మహోన్నతుడు కాబట్టి ఆంజనేయుడి మనసును ఎంతగానో స్వాధీనపరచుకున్నాడు. కిష్కింధలో పరిచయం మొదలు పట్టాభిషేకం వరకు రాముణ్ని ఏ దశలోనూ మారుతి వీడి ఉండలేదు. బంటు అనే పదం ఎక్కడ కనిపించినా, వినిపించినా సంపూర్ణ అర్థమివ్వదు. ఆ పదానికి ముందు ‘రామ’ అని చేరిస్తేనే, పరిపూర్ణ భావన కలుగుతుంది. రామబంటు అనగానే ఆంజనేయుడే మదిలో మెదులుతాడు!

    తాను రామబంటునని ఆ కేసరి నందనుడు వినమ్రంగా ప్రకటించుకున్నాడు. తన జీవితాన్ని సంపూర్ణంగా రామార్పితం చేశాడు. సీతమ్మ జాడ తెలియక దుఃఖిస్తున్న రాముణ్ని, నవనీతం లాంటి మాటలతో శాంతపరచాడు. ముల్లోకాల్లో ఎక్కడున్నా ఆమెను వెతికి తెస్తానని మాట ఇచ్చాడు. అదే దృఢసంకల్పంతో ముందడుగు వేశాడు. ద్విగుణీకృత శక్తితో సముద్రాన్ని లంఘించాడు. రాక్షసులతో పోరు సాగించాడు. రావణుడికి సమానమైన ఎత్తులో ఉండి సంభాషించాడు. నిప్పంటించిన తోకతో లంకాదహనం గావించాడు. ధర్మమూర్తి రాముడు తన మనసులో కొలువుదీరి ఉన్నాడు కాబట్టి, హనుమకు అంత ధైర్యం కలిగింది. కొండంత అండగా రాముడు ఉండటం వల్ల, సాహసం ఇనుమడించింది. ఫలితంగా, రామాయణంలో కేవలం ఆంజనేయుడి కోసమే కొన్ని పుటలు ‘సుందరకాండ’గా రూపుదిద్దుకున్నాయి. రామలక్ష్మణుల ముందు వినయంగా మోకరిల్లే హనుమలో ‘మూర్తీభవించిన బంటుతత్వం’ గోచరిస్తుంది.

    త్యాగరాజు శాశ్వతమైన రామభక్తి సామ్రాజ్యాన్ని కోరుకున్నాడు. ‘బంటురీతి కొలువియ్యవయ్య రామ!’ అని హంసనాద రాగంలో వేడుకొన్నాడు. ఆయన రాముడి పట్ల అపార భక్తి, అచంచల విశ్వాసం కలిగినవాడు. రామతారక మంత్రాన్ని గురువుల నుంచి గ్రహించి, నిష్ఠగా సాధన చేసినవాడు. సిద్ధి పొందిన తరవాత, రాముడి గుణవైభవాల్ని వర్ణిస్తూ వేల సంకీర్తనలు రచించాడు. ‘రామచరణాలే శరణు’ అని భావించిన పరిపూర్ణ యోగిపుంగవుడు త్యాగయ్య. అన్నింటినీ భక్తితో సాధించి, రాముడి మనసులో బంటు రీతి కొలువు సంపాదించి, ధన్యచరితుడయ్యాడు!

    - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

    NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

    NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

    NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

    Popular