Thursday, February 26, 2015

సామాన్యుడికి జనరిక్ అభయం


సామాన్యుడికి జనరిక్ అభయం
Posted On:2/26/2015 2:38:05 AM

-రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం
-ప్రభుత్వ దవాఖానలకు వెళ్లే పేదలకు ఏటా రూ.కోట్లలో ఆదా
వైద్యుల సహకారమే కీలకమంటున్న నిపుణులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సాధారణ జ్వరం వచ్చినా ఓ మోస్తరు వైద్యుడు కూడా యాంటీ బయోటిక్స్ మందులు రాయడం సహజం. కనీసం వారంపాటు ఆ మందులు వాడాలంటే రూ.వందల్లో ఖర్చు పెట్టాల్సిందే. ఈ నేపథ్యంలో పది రూపాయల విలువైన మందులు రెండు రూపాయలకే వస్తే?! సామాన్య జనానికి ఏటా రూ.కోట్లల్లో డబ్బు ఆదా అవుతుంది. ఇందుకు మార్గం ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో చొరవ తీసుకున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రధాన దవాఖానలన్నింటిలోనూ జనరిక్ మందుల దుకాణాలు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. రాష్ట్రంలోని అన్ని బోధన, ప్రధాన దవాఖానలతోపాటు ఏరియా దవాఖానాల్లోనూ జనరిక్ మందుల దుకాణాలు పెట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించాలంటూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం నిరుపేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందనే చర్చ మొదలైంది. 

list



కనిపించని చిత్తశుద్ధి..



generic

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏటా రూ.35వేల కోట్ల మేర ఫార్మా రంగంలో టర్నోవర్ ఉంది. ఈ క్రమంలో జనరిక్ మందుల భాగస్వామ్యం కనీసంగా 10 శాతం ఉంటుందనేది అంచనా. అంటే ఏటా రూ.3500 కోట్ల వరకు జనరిక్ మందుల ఉత్పత్తి ఉంది. కానీ, ఆ స్థాయిలో వినియోగం లేదు. కనీసం ఉత్పత్తి ఉన్న మేరలోనైనా ప్రజలకు అందుబాటులోకి తెచ్చి వినియోగిస్తే.. సంవత్సరానికి ప్రజల సొమ్ము రూ.వేల కోట్లల్లో ఆదా అవుతుందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. తొలుత నిమ్స్ దవాఖానలో జనరిక్ మందుల దుకాణం ఏర్పాటు చేశారు. కానీ తర్వాత కొద్దికాలానికే ఆ మందుల దుకాణం మూతబడింది. జంట నగరాల్లో 12 జనరిక్ దుకాణాలు నడుస్తున్నాయి.


వైద్యుల సహకారం అనివార్యం


ప్రభుత్వ దవాఖానల్లో జనరిక్ మందుల దుకాణం ఏర్పాటు చేసినప్పటికీ వైద్యుల సహకారంలేనిది వాటి మనుగడ అసాధ్యమని ఒక రిటైర్డ్ వైద్యాధికారి స్పష్టం చేశారు. నిమ్స్, ఉస్మానియా, గాంధీ దవాఖానాల్లో అనుభవాలే ఇందుకు నిదర్శనమన్నారు. అమెరికాలో ఒక వైద్యుడు రాసే పది మందుల్లో ఎనిమిది జనరిక్ మందులనే సూచిస్తారని ఎఫ్‌డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ) నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలనుకుంటున్న జనరిక్ మందుల దుకాణం ఏర్పాటులో భాగంగా వైద్యుల సహకారం అనివార్యమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం వైద్యులను ఒక తాటిపైకి తీసుకువచ్చి.. జనరిక్ మందులను సూచించడం తప్పనిసరిచేస్తే తప్ప ఫలితం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మంచి మేలు తలపెట్టాలి

మంచి మేలు తలపెట్టాలి
Posted On:2/26/2015 1:49:27 AM
సూర్యోదయంతో మొదలైన రోజు చంద్రోదయంతో ముగుస్తూ అనేక అనుభవాలనూ, జ్ఞాపకాలనూ జీవితఖాతాలో చేరుస్తుంది. గొప్పగా బతకాలి, ఏదో చేయాలి అనే తపన ప్రతీ ఒక్కరిలో గంభీరమై నిగూఢమై ఉంటుంది. కానీ జీవన పోరాటంలో సమయం అలా గడిచిపోతూ మంచి ఆలోచనలకు తావివ్వదు. మనిషి తలుచుకుంటే ప్రయత్నంతో సాధించలేనిది ఏదీ లేదు. అనుకోకుండానే మహాత్ములు చేసిన మంచి అనేదే దానికి ఆలంబన.
నిసర్గాదారామే తరుకుల సమారోపసుకృతీ
కృతీ మాలాకారో బకులమపి కుత్రాపి నిదధే
ఇదం కో జానీతే యదహ మిహ కోణాంతరగతో
జగజ్జాలం కర్తా కుసుమభర సౌరభ్యభరితమ్ ॥
అందమైన ఉద్యానవనంలో మొక్కలు నాటే మంచిపనిని చేస్తుండే తోటమాలి అలవాటుగా ఓ మూలన పొగడచెట్టును కూడా నాటుతాడు. అనుకోకుండా ఒక చోటులో పాతిన ఆ చెట్టు తన పుష్పాల పరిమళంలో పరిసర ప్రాంతమంతా పరిమళభరితం చేస్తుందని అతననుకోలేదు. ప్రపంచం చాలా అందమైన అద్భుతం. అందులో భగవంతుడు చేసిన మంచి అపారం. దానిని అందిపుచ్చుకొని సుహృదాలోచనతో జీవించడమే మన బాధ్యత. ఎవరో ఎక్కడో చేసిన మంచికి ఫలాన్ని మనం అనుభవిస్తూ కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాన్ని మనస్ఫూర్తిగా మనస్సులోనే సమర్పించుకోగలం. మరి ప్రతిఫలాన్ని అందజేయలేమా! మనసుంటే మార్గముంటుంది. మనం చేసిన మంచి నేడు అనుభవించకపోవచ్చు. భావితరాలు దాని ఫలాన్ని అనుభవిస్తే చేసిన దానికి సార్థకత చేకూరినట్లే.

అనేక కట్టడాలు శ్రమకోర్చి, వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన మహా మహులు నేడు లేరు. కానీ వారి జ్ఞాపకాలుగా చరిత్రకు వన్నె తెచ్చిన నిర్మాణాలు కోకొల్లలు. సంప్రదాయాలను మొదలుపెట్టిన పూర్వీకులు నేటి సమాజానికి మార్గదర్శకులు. వాటిని పాటించడమే కర్తవ్యం. మంచిని పంచిన వారెన్నడూ మేమిది చేశామని చెప్పుకోలేదు. వారు చేసినదే తరతరాలూ అనుభవిస్తూ వచ్చాయి. భగవంతుడు ప్రతీచోటా ప్రత్యక్షంగా మనకు సాయపడలేడు. సర్వాంతర్యామియైన ఆయన ఏదో రూపంలో వచ్చి తన సహకారాన్నందిస్తూనే ఉంటాడు. మంచి అంటే లోకాలను ఉద్ధరించడమని కాదు. ముసలితనంలో చేతికర్ర సహాయంతో నడుస్తున్న వ్యక్తి చేతిలోని కర్రజారితే, దారిన పోయే పసిపిల్లాడు ఏ సంబంధం లేకుండా అందించడం కన్నా మించిన మంచేముంటుంది? లాభనష్టాలకతీతమైన సుహృద్భావన, ఆలోచన, మంచితనం, మనసా వాచా కర్మణా మనిషి చేయగల మహత్కార్యం. మంచిని పంచగల ఔన్నత్యం.

Tuesday, February 24, 2015

పవిత్ర జీవనం

పవిత్ర జీవనం
Posted On:2/24/2015 12:27:18 AM
జీవన దార్శనికత దైనందిన చర్యల్లో ప్రస్ఫుటమవుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఎదుటివారు ఎలా బతకాలో సలహాలివ్వచ్చు. నీటిలోకి దిగితేనే లోతెంతో తెలిసేది. అలాగే ఎవరి బతుకు వారిది. ఒక చిన్న వస్తువు కొనాలంటేనే ప్రణాళిక వేసుకొని, ముందు వెనుకా ఆలోచించి నిర్ణయం తీసుకునే మనం బతికేందుకు వేదం ఏనాడో అద్భుత కర్తవ్యోపదేశం ప్రణాళికబద్ధంగా సూచించింది. పవిత్ర జీవనానికి మార్గం చూపింది.

పునంతు మా దేవజనాః పునంతు మనవో ధియా
పునంతు విశ్వాభూతాని పవమానః పునంతు మా ॥
నైతిక విలువలతో మనిషి ఎదిగేందుకు నాలుగు విషయాలను జీవన సూత్రాలుగా మలుచుకొని బతకాలనేది వైదిక ప్రబోధం. భావనాజగత్తులో దివ్యగుణాల పరిపాలకులు దేవతలనీ, అసుర గుణసంపత్తి గలవారు రాక్షసులనీ అనుకుంటే సత్యభాషణం. పరోపకారం, దయ, తృప్తి గలిగిన మహజనులతో సహవాసం చేయగలిగితే జీవితం పావనం అవుతుంది.

మననశీలి మనిషి. వివేకంతో, బుద్ధితో సామాజిక దృక్పథాన్నీ, మంచి చెడులనూ ఆలోచిస్తూ ఆశావహ దృక్పథంతో, మంచి భావనలతో మనసును పదేపదే ప్రేరేపించే శక్తిని మనిషి సాధించాలి. మంచి ఆలోచన తప్పక మంచి కర్మలనే చేయిస్తుంది. పవిత్ర భావనలతో సమాజం వర్ధిల్లుతుంది.
పంచభూతాత్మకమైన ప్రకృతి, పంచేంద్రీయ సహిత మనిషీ లోకంలో సత్సంబంధంతో నిలబడతారు. ప్రకృతిలోనే మావనత్వం పరిమళిస్తుంది. దానికి అతీతమైన జీవనమే లేదు. అనంతమైన ప్రకృతిలో భాగమైన మనిషికి స్వార్థచింతన ఉండదు. పరార్థ భావనలో పరస్పర సహకారానికి ఆస్కారముంటుంది. ఆలోచన విశాలమవుతుంది.
సమాజం బాగుండాలి. మనుషులందరూ క్షేమంగా ఉండాలి. అనే భావనలు పారమార్థిక తత్తంతో భగవంతుని ప్రార్థించే సత్సంకల్పాలై మానసిక ధైర్యాన్నిస్తాయి. మనలోని భగవత్తత్వానికి ఏరూపమిచ్చినా సృష్టిని నడిపే శక్తి అతీంద్రియమై, అణువణువులోనూ దాగుంది. లోకాస్సమస్తాః సుఖినోభవంతు అనే విశ్వమానవ సౌభ్రాతృత్వం, సామాజిక వికాసం వంటి భావనలే భగవంతునికర్పించే నీరాజనాలు.

గొప్పదారి సహవాసంతో నేర్చిన గుణసంపద, మనిషి మేధస్సులో సంకల్పించే సుహృద్భావన, ప్రపంచమనే ఉదాత్తభావన నేను నుంచి మనం వరకు చేసే ప్రస్థానం, లోకక్షేమం లోనే స్వీయక్షేమం ఉందనే ఆలోచనాపరంగా చేసే భగవత్ప్రార్థన అనే నాలుగు విషయాలు పవిత్ర జీవనాన్ని మానవత్వానికి అంకితం గావిస్తాయి.

Monday, February 23, 2015

ధనానికి మూడే గతులు

ధనానికి మూడే గతులు
Posted On:2/21/2015 1:36:50 AM
ధనవంతుని వద్దనున్న ధనం దానం చేయుటకు ఉపయోగపడును. అట్లే పంచభక్ష్యపరమాన్నాలను సమకూర్చుకొనుటకు, సుగంధపరిమళద్రవ్యాలను, హార చందనాదులను, సుందరమైన వస్త్రములను కొనుటకు, సుఖనివాసమునకు అవసరమైన భవన నిర్మాణమునకు, అలంకరించుకొనదగిన ఆభరణములను పొందుటకు, ఇష్టమైన అవసరమైన ప్రదేశాలలో సంచరించుటకు కావలసిన వాహనములను కొనుటకు ఉపకరిస్తూ ధనికునియొక్క భోగానుభవమునకు కారణమై నిలుచును.
దానధర్మాలకు, అనుభవం కోసం ధనాన్ని ఉపయోగించకపోతే ఆ ధనం నశిస్తుందని, ధనానికి దానము, భోగము, నాశము అనే మూడు గతులే ఉన్నాయి
దానం భోగో నాశః తిస్రో గతయో భవంతి విత్తస్య
యో న దదాతి, న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి ॥
అని భర్తృహరి మహాకవి పేర్కొన్నాడు.
రాశులకొద్ది ధనం ఉన్న వ్యక్తి తన దగ్గర ఉన్న ధనాన్ని తన అవసరాలకో, తన పరివారం యొక్క అనుభవానికో ఏ మాత్రం ఉపయోగించకపోతే, ఆపదలో ఉన్నవారికి, ఆకలితో అలమటించేవారికి, ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారికి సహాయంగా అందించకపోతే, విద్వాంసులను, కళాకారులను సత్కరించుటకు, దేవాలయ నిర్మాణమునకు, యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించుటకు వీలుగా దానంగా ధర్మంగా సమర్పించకపోతే ఆ ధనరాశులు ఇతరుల వశమయ్యే ప్రమాదమున్నది.
పంట పొలాల్లో గడ్డితో తయారుచేసి పెట్టే దిష్టిబొమ్మ పంటకు కాపలాగా ఉంటుంది. పొలం యజమాని శ్రేయస్సు కోసం ఉపయోగపడుతుంది. అంతేకానీ ఆ పంటను అనుభవించదు. అట్లే ధనాన్ని తాననుభవించక, ఇతరులకు దానం చేయకుండా ఉండే వ్యక్తి కూడా బొమ్మవలె ధనానికి కాపలాదారుగా మాత్రమే ఉంటాడు తప్ప యజమానిగా ఉండడు.
యో న దదాతి, న భుంక్తే విభవే సతి నైవ తస్య తద్ద్రవ్యమ్‌
తృణ కృత కృత్రిమపురుషః రక్షతి సస్యం పరస్యార్థే ॥ అని చెప్పబడినది.
సత్కార్యాలకు దానంగా ఉపయోగించడం, ధనానికి సద్గతి. యజమానికి, అతని పరివారానికి ఉపకరించడం సహజగతి. దుర్జనుల వ్యసనాలను తీర్చుకోవడానికి, దుర్మార్గులు ఆక్రమించుకోవడానికి, విలువ తెలియనివారి చేతికి చిక్కి నిరుపయోగంగా పడివుండడానికి కారణమయ్యే ధనం అధోగతిని పొందినట్లగును.

Thursday, February 19, 2015

సహజత్వం

సహజత్వం
Posted On:2/20/2015 1:17:45 AM
జీవితం అంటే... మహామహులు ఇచ్చే నిర్వచనాలు, ప్రతీరోజూ దుర్భరంగా బ్రతికే సగటు మనుషుల అభిప్రాయాలే కళ్ళముందూ, మనసులో మెదలుతాయే గానీ వాస్తవం ఆలోచించమెందుకు? జీవితం అంటే జీవించడం. తృప్తిగా బతకడం. మనకు నచ్చినట్టుగా బతికే ప్రయత్నంలో పరిస్థితుల ప్రభావం తప్పక ఉంటుంది. కానీ మనదైన సహజత్వం కోల్పోలము. సహజంగా వచ్చిన జీవన రుచులు పొమ్మంటే పోవు.
కస్తం లోహితలోచనాస్య చరణో హంసః కుతోమానసాత్
కిం తత్రాస్తి సువర్ణ పంకజవనాన్యంభః సుధా సన్నిభమ్!
తత్తీరం నవరత్న ఖండఖచితం కల్పద్రుమాలంకృతమ్
శంబూకాః కిముసంతినేతి చ బకైరాకర్ణ్య హీ హీకృతమ్
ఒకసారి కొన్ని కొంగలు... ఎర్రని కళ్ళూ, ముక్కు, కాళ్ళూ ఎవరు నువ్వు? అని అడిగాయి హంస ను. నేనూ హంస అంది. ఎక్కడి నుంచి వచ్చావు? మానససరోవరం నుంచి, అక్కడేముంటుంది? బంగారు పద్మవనాలు అమృతం లాంటి నీళ్ళు, దానిచుట్టూ నవరత్నములు ఖండాలుగా పొదిగి ఉంటాయి. కల్పవృక్షాల చేత అలంకృతమై చాలా అందంగా ఉంటుంది. నత్తగుల్లలుంటాయా? ఉండ వు. ఈ మాట వినగానే కొంగలు హహహ అంటూ నవ్వాయి. హంస కొంగల ఈ సంవాదం మనమూ నవ్వుకునేలా చేస్తాయి. కానీ ఆలోచిస్తే ఎవరిజీవితం వారిది. సహజగుణాలకతీతంగా మార్పులను, అనుకరణనూ అలవర్చుకోవాలంటే అసంభవం. ఒకే జాతికి చెందిన కొంగ-హంసల జీవితాలు ఒకేలా లేవు. ఎవరెవరి బతుకుల్లో వారు ఆనందంగా జీవిస్తున్నారు. మనుషులూ అంతే. ఆదర్శంగా బతకాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తారు. తదనుగుణంగా జీవితాంతం కష్టపడతారు. సామాన్యులు సామాన్యులుగానే, గొప్పవారు గొప్పవారుగానే ఉండిపోరు. ఎందుకంటే జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. ఎంత ఎదిగినా, ఎలా మారినా తనదైన సహజతను వదులుకోడు మనిషి.
జీవితం అంటే అభిరుచి. అది ఆర్భాటాలకతీతం. సహజంగానే జీవన ఒరవడి కొనసాగుతుంది. అసహజధోరణిలో ఇమడలేక కుంచించుకుపోతుంది. ప్రతీ మనిషి తనేంటో విడమర్చి సమాజానికి చెప్పుకోలేడు. చెప్పగలిగినా అర్థం చేసుకునే సమాజం లేదు. కనుక భగవంతుడు మనిషి జీవితాన్ని విభిన్నకోణాల్లో పరిశీలించి, పరిశోధించి, శ్రమించి, రచించాడు. ఎప్పుడు ఎవరికి ఏం కావాలో, ఎవరెవరికి ఏమేమివ్వాలో ఆయనకు బాగా తెలుసు. అనే భావన మానసికంగా కలిగినప్పుడు మనలోని సహజత్వం ఉట్టిపడుతుంది. అందులోని ప్రత్యేక తత్తం అర్థమవుతుంది. ఆనందం జీవనసారం అవుతుంది. తృప్తినిండిన జీవితమే ఆత్మ సమర్పణభావంతో భగవ దర్పితం గావించబడుతుంది.

Wednesday, February 18, 2015

ఆత్మగౌరవమే జాతి గౌరవం

ఆత్మగౌరవమే జాతి గౌరవం
Posted On:2/18/2015 2:58:07 AM
ఆలోచనే అన్నింటికీ మూలం. మానవ దృక్పథాన్ని చాటిచెప్పే అద్భుత సాధనం ఆలోచన. ఆత్మసాక్షిగా స్ఫురించే భావన గౌరవాన్ని పెంపొందించి ప్రపంచంలో సగర్వంగా నిలబడేలా చేస్తుంది. ఆత్మగౌరవమే జాతిగౌరవమై అలరారుతుంది. మనుషులంటేనే అంత. అని హేళనగా మాట్లాడి ఏదో చెప్పాలనే కసిని బహిర్గతం చేస్తాం. కానీ ఆ మనుషుల్లో మనమూ ఉన్నామనే సూక్ష్మ విషయాన్ని విస్మరిస్తాం.
త్రోటీపుటం కరట కుడ్మల యాథ తాత
యావత్ ప్రతివ్రజతి నాకమయం మరాలః
నోచేద మంగళ కఠోరరవా విహంగాః
సర్వే భువీతి నిజసంసది శంసితానః ॥
అనుభవం గల ఒక పక్షి కాకితో, హంస అనే అతిథి తన స్థానానికి వెళ్ళేవరకూ కొంచెం నీ నోరు కట్టిపెట్టు. లేదంటే భూ లోకంలోని పక్షులన్నీ అమంగళంగా, కఠోరంగా అరుస్తాయని వారి లోకంలో చెబుతుందని అంటుంది. ఈ మాత్రం అభిమానం మనుషులకు లేదా! పిల్లలు తప్పుచేస్తే తల్లిదండ్రులు ఆ దోషాన్ని నెత్తిన వేసుకుంటారు. తల్లిదండ్రులే తప్పుచేస్తే పిల్లలు అనుభవించక తప్పదు. ఎంత కుటుంబ కలహాలున్నా బయటివారి ముందు లోకువ కాము. ఎంతటి చెడుగుణం కలవాడైనా విదేశీయుల ముందు చెడ్డగా ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తిస్తే ఆ దేశమే అలాంటిదనే అభిప్రాయం ఏర్పడుతుంది.
అతిథిదేవోభవ అన్న సంస్కారమే ఆలంబనగా పెరిగిన భరతభూమిలో జన్మించిన మనమంతా పాశ్చాత్య ధోరణి అలవర్చుకొని ఆధునికంగా ఎదగడంలో తప్పులేదు. అలాగని కూర్చున్న కొమ్మనే నరికేసుకుంటే బాధపడేదీ మనమే కదా!
లోకంలోని అనేక జీవరాశులలో విలక్షణ తత్తంతో, వివేక గాంభీర్యంతో జనించిన మహామహుడు మనిషి. మనిషిని మనిషిగా సమాజానికీ, ప్రపంచానికీ పరిచయం చేసేది స్వీయ గౌరవమే. అదే ఆత్మగౌరవమై, జాతిగౌరవమై భాసిల్లుతుంది. శ్రీరామచంద్రుడు మనిషిగా జన్మించి మానవీ య విలువలనూ, ఔన్నత్యాన్నీ చాటిచెప్పాడు. వ్యక్తిలో మొదలైన మార్పు ఏదైనా కుటుంబాన్నీ, సమాజాన్నీ, జాతినీ, దేశాన్నీ, ప్రపంచాన్నీ, మార్చేస్తుందని, మార్పు మనతోనే మొదలవ్వాలనీ తెలియపరిచాడు. మనిషి తనను తాను గౌరవించుకోవాలి. ఏ సమయంలోనూ నిరుత్సాహపరుచుకోవద్దు. సహజంగా మంచి సంస్కారం గల వ్యక్తి మాత్రమే అంతరంగపు వాణి విని ఆదర్శపథంలో పయనిస్తాడు. మనిషిని మనిషి గౌరవించాలి. తద్వారా సమాజం గౌరవించబడాలి. జాతి గౌరవంతో విరాజిల్లాలి.

Tuesday, February 17, 2015

Seavadharmam

సేవాధర్మం
Posted On:2/17/2015 2:01:16 AM
శిశువును నవ మాసాలు గర్భంలో ధరించి, ఆ తరువాత జన్మనిచ్చి దేహ పోషణకు అవసరమైన పాలను ఇచ్చి, నడక నేర్పి, మాటల మూటను అందించే మాతృమూర్తి యొక్క సేవాతత్పరత మహనీయమైనది. మాటలతో వర్ణించలేనిది. తల్లిప్రేమకు సాటిరాగల ప్రేమగాని, తల్లి సేవలను వివరించే మాటలుగాని లభించుట దుర్లభము. సేవాభావం కల వ్యక్తులు అక్కడక్కడ మనకు దర్శనమిస్తారు. శిష్యులు గురువుల సేవలో, దేశసేవలో సైనికులు, రోగుల సేవలో వైద్యులు, అధికారుల సేవలో ఉద్యోగులు, ప్రజల సేవలో ప్రభువులు పాల్గొనటం జగద్విదితమే. వనవాస సమయంలో సీతారాములకు లక్ష్మణస్వామి చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలుచునట్టివి. శ్రీరామచంద్రు డు రాజ్యాన్ని పరిపాలించే సందర్భంలో తనను తాను ప్రభువుగా కాకుండా, ప్రజలకు సేవచేసే వ్యక్తిగానే భావించుకున్నాడు.
చూపులేని తల్లిదండ్రులకు శ్రవణకుమారుడు చేసిన సేవ, అరణ్యవాసియైన వ్యాధుడు తల్లిదండ్రుల పట్ల సేవాధర్మమును కలిగియున్న తీరు అందరికీ ఆదర్శ ప్రాయమైనట్టిదే. అయితే లోకంలో చాలాచోట్ల సేవలనందుకునే వ్యక్తులు సేవాభావంతో సేవలను అందిస్తున్నవారిపట్ల కృతజ్ఞతాభావం లేకుండా వ్యవహరిస్తారని, సేవచేసే వారిలో తప్పులు వెదుకుచూ మాటిమాటికి ఆక్షేపిస్తూ మందలిస్తూ ఉంటారని, సేవాధర్మాన్ని నిర్వర్తించడం చాలా కష్టమని భర్తృహరి మహాకవి ఈ క్రింది శ్లోకంలో వివరించాడు.
మౌనాన్మూకః ప్రవచనపటుః వాచకో జల్పకో వా
దృష్టః పార్శ్వే భవతి చ వసన్ దూరతో‚ ప్యప్రగల్భః
క్షాంత్యా భీరుః యది న సహతే ప్రాయశో నాభిజాతః
సేవాధర్మః పరమగహనః యోగినామప్యగమ్యః ॥

సేవలనందుకునేవారు తమకు సేవలనందించే వ్యక్తి ఎక్కువగా మాట్లాడకపోతే మూగివాడా అని, ఎక్కువ మాట్లాడితే వదురుబోతు, వాగుడుకాయ అని సంబోధిస్తారు. దగ్గరగా నిలబడితే భయభక్తులు లేనివాడని, దూరంగా నిలిచేవాణ్ణి అసమర్థుడని అంటారు. సేవలందించే వ్యక్తి సహనం కలవాడైతే అతణ్ణి భయగ్రస్తుడని, సేవలనందించునపుడు తనకు కలిగే ఇబ్బందులు అవమానాలను గురించి అతడు వివరిస్తే ఆ వ్యక్తి మంచి వంశంలో పుట్టనివాడని పేర్కొంటారు. ఎంతో జాగ్రత్తగా సేవలనందించినా ఆక్షేపణలు తప్పవని, అనేక విధములైన సేవలతో ప్రభువులను మెప్పించడం యోగీశ్వరులవల్ల కూడా కాదని సేవాధర్మాచరణ చాలా క్లిష్టమని భర్తృహరి ప్రబోధించెను.

Monday, February 16, 2015

భగవద్గీత నుండి లాభం పొందడం ఎలా?

భగవద్గీత నుండి లాభం పొందడం ఎలా?
Courtesy: Praveen Goud goudp68@yahoo.com
గీతాజయంతి నాడు దేశంలో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా భగవద్గీతను గురించి మారుమ్రోగి పోతూంటుంది. ఇన్ని పత్రికలు, 24గంటలూ పనిచేసే శతాధిక T.V.చానెళ్ళూ వచ్చాక, విషయబాహుళ్యం బాగా పెరిగింది.
ఏది ఎంతవరకు గ్రహించాలో, ఎట్లా ఉపయోగించుకోవాలో (ఆచరణలో పెట్టుకోవాలో) దిక్కుతోచనంత విశాల విషయ ప్రసారమే ఈనాటి అసలు సమస్య !
ఉదాహరణకు: గణితశాస్త్రమనేది, 1వ తరగతి విద్యార్థినుండి Ph.D.స్థాయి, ఆపైన Original Scientist (Mathematician)స్థాయి వరకు అందరికీ ఉపయోగపడేదే. అలాగని, 3వ తరగతి చదివే మన పిల్లలకు పేపర్లు, T.V.లలో చూపించే విచిత్ర, కాలక్షేప, ఆసక్తికర Maths Prograammes అన్నీ పనికి రావు గదా !
అదేవిధంగా భగవద్గీతా శాస్త్రం కూడా. మన పిల్లలకు ( ఆధ్యాత్మికంలోకి ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్న పెద్దలు కూడా పిల్లలతో సమానమే – వారుకూడ అధ్యాత్మికతా ప్రారంభ బాలశిక్ష నేర్చుకోవాల్సిందే కాబట్టి ) మొదటిమెట్టుగా ఉపయోగపడే గీతాంశాలను గూర్చి స్థూలంగా చర్చించుకుందాం !
౧. భారతీయుల ప్రతిగృహంలోనూ ఉండవలసిన గ్రంథం భగవద్గీత ! “ఎవరు చదువుతారులే” అనే మీమాంసకు తావు ఇవ్వకుండా, ఆ పుస్తకం కొనటం, ఇంట్లో రోజూ కంటబడేచోట ఉంచటంకూడ, మన జాతీయ, సాంస్కృతిక స్వాభిమానానికి (Self-Respect)కి మొట్టమొదటి చిహ్నం అనే స్పృహను పెంచుకోవాలి.
౨. గీతలో 17వ అధ్యాయం (శ్రద్ధాత్రయ విభాగ యోగః) బాలశిక్షకు ప్రారంభం. మానవులను గుణాలనుబట్టి ఉత్తమ – మధ్యమ – అధమ అనే మూడు రకాలుగా విభజించి చూపాడు జగద్గురువైన శ్రీకృష్ణుడు అని తెలిపాడు జగద్గురు వ్యాసమహర్షి !
౩. అవి సాత్త్విక, రాజసిక, తామసిక గుణాలు. అందరిలోనూ కూడా మూడు గుణాలూ కలిసే ఉంటాయి – వేరు వేరు పాళ్ళలో.
౪. ఏయే గుణాలు కలవారు ఏయే పనులను ఏయే దృక్పథంతో ఏయే విధంగా చేస్తారో ఈ 17వ అధ్యాయంలో చెప్పబడింది. పనులు చేసేటప్పుడు – మన దృక్పథం (Outlook), ఉద్దేశము (Motive), పద్ధతి (Method)లను బట్టి, మన స్థాయి (సత్త్వ, రజస్, తమస్సులలో) ఎక్కడ ఉందో మనమే తెలుసుకోగల Ready Reckoner ఇది !
౫. భారతీయుల సంస్కృతికి ముఖ్యాంశాలైన ఐదింటిని గూర్చి ఈ విభాగం చేశారు. 1.దేవపూజ, 2.ఆహారం, 3.యజ్ఞం (=సరియైన మేఘాలను సృష్టించటంద్వారా ప్రకృతి శక్తుల సంతులనం), 4.తపస్సు (=ఏకాగ్ర మనస్సుతో అభీష్ట విషయ నిరంతర పరిశోధన); 5.దానం ( ఐచ్ఛికంగా సంపద వికేంద్రీకరణా విధానం; Have-Nots కి Haves మానవతా దృష్టితో సహాయమందించే అద్భుత వ్యవస్థ) – ఈ అయిదు అంశాలను సాత్త్విక రాజసిక తామసిక పదతులుగా విభజించారు.
౬. వీటిలో మరీ ముఖ్యమైనవి – అంటే మొదట తెలుసుకోవలసినవి – ఆహారం, తపస్సు ( మానసిక తపస్సు, వాచిక తపస్సు, శారీరిక తపస్సు ), దైవపూజావిధానం.
కాబట్టి ప్రాథమిక విద్యార్థి దశలోనున్న మన పిల్లలకు మనం నేర్పవలసినది – ఈ 17వ అధ్యాయపు ఒక్కో శ్లోకం చదివి వినిపించటం, డాని తాత్పర్యాన్ని క్లుప్తంగా పుస్తకంలోనున్నదానిని చదివి వినిపించటం, మనకున్న లోకానుభవంతో – ఆ విషయం ఈనాటి పరిస్థితులలో ఎట్లా అన్వయించుకోవాలో వివరించటం ! వారిలో ఈ విషయాలపై ఆదరణాభావం కలిగించటం, ఆచరణాత్మక దృష్టిని రగిలించటం – ఇంతే మనం చేయవలసినది. మిగిలింది పైవాడూ వాళ్ళే చూసుకుంటారు !
ప్రతివారూ ఇప్పుడున్న మెట్టుమీద (స్థితి) నుంచి ఒక్కమెట్టు పైకిఎక్కినా, పురోగతి చెందినట్లే గదా ! లక్ష్యానికి దగ్గరౌతున్నట్లే గదా ! దానికి భగవద్గీత చేసే సాయం ఇంతా అంతా కాదు !

MAHA SHIVARATRI_2015_TELUGUDEVOTIONALSWARANJALI

MAHA SHIVARATRI_2015
శివరాత్రికి ఏం చేయాలి? ఎలా
జరుపుకోవాలి?
Courtesy: Praveen Goud goudp68@yahoo.com
సనాతన సంస్కృతిలో పండుగలంటే
కేవలం విశ్రాంతి కోసమో,
ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి
కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత,
దైవికత ఉంటుంది. ప్రతి
పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య,
శాస్త్రీయ కారణాలుంటాయి.
అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్
కిరణాలను, విద్యుత్ అయస్కాంత్
తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ
రోజున ఏ పని చేయడం వలన మనిషి
జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న
స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి
ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి
ఆయా రోజులలో ప్రత్యేక
పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.
శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి
రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు,
అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్
కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి
తన పరిపూర్ణమైన రూపాన్ని
తెలుసుకోవడానికి, ఆత్మ
సాక్షాత్కారానికి తోడ్పడుతాయి.
అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక
నియమాలు విధించారు.
1.ఉపవాసం
శివరాత్రికి చేసే ఉపవాసానికి,
జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది.
శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని
శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు,
ముసలివాళ్ళకు, అనారోగ్యంతో
బాధపడేవాళ్ళకు, గర్భవతులకు,
ఔషధసేవనం చేయాల్సిన
వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది
శాస్త్రం.
ఉపవాసం ఉండే ముందు రోజు,
ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం,
గుడ్డు మొదలైనవి తినకూడదు,
మద్యపానం చేయకూడదు.
ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా,
ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని,
ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా
చేయకూడదు.
ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి
ముందే నిద్రలేచి, తలపై నుంచి
స్నానం చేసి, ఈ
రోజు నేను శివునకు ప్రీతికరంగా
శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని
సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే
పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని.
భగవంతునికి మనసును,
ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం.
ఆరోగ్యపరంగా
చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న
విషపదార్ధాలను తొలగించడంతో
పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ
నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ
నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని
ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా.
ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ,
భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.
2. జీవారాధాన
అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత
బియ్యం, ఇతర
ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని
ఆకలితో ఉన్న పేదలకు పంచాలి.
అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో
జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు.
అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా
ఈశ్వరసేవయే అవుతుంది. అందుకే స్వామి
వివేకానంద 'జీవారాధానే శివారాధాన'
అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే
చెప్తాయి.
శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న
శివశక్తిని శరీరం గ్రహించాలంటే,
వెన్నును నిటారుగా పెట్టి
కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో
ముందుకు వంగి కూర్చోవడం లాంటివి
చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా
ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి.
3. మౌనవ్రతం
శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా
అద్భుత ఫలితాలను ఇస్తుంది.
మానసికప్రశాంతతను చేకూరుస్తుంది.
మౌనం అనగానే నోరు మూసుకుని
కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో
త్రికరణములు (మనోవాక్కాయములు)
ఏకం కావాలి.
మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది
. అందువల్ల అనవసరమైన ఆలోచనలను,
వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై
కేంద్రీకరించాలి. అవసరమైతే
శివాలయానికి వెళ్ళండి, అక్కడ
రుద్రాభిషేకం చేస్తారు.
రుద్రం ఒకసారి చదవటానికి అరగంట
పడుతుంది.
మీరు అభిషేకం చేయించుకోకపోయిన
ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా
కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే
చదవబడుతున్న రుద్ర -
నమకచమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే
ఫలితాలను చూడండి.
ఉద్యోగస్తులు, ముఖ్యంగా
ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి
ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు.
విదేశాల్లో చదువుతున్న
విద్యార్ధులకు అదే పరిస్థితి
ఎదురుకావచ్చు. మరి
అలాంటప్పుడు ఏం చేయాలి?
అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన
మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ
పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత
తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక,
కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని,
శివుడి ముందో, ఆలయంలోనో
కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా
కూర్చోండి.
4.అభిషేకం
శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి
కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో
పొంగిపోతాడు. శివరాత్రి
నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల
భేధం లేకుండా శివుడిని
అర్చించడం వలన, అభిషేకించడం వలన
సదాశివుని అనుగ్రహంతో జీవితానికి
పట్టిన పీడ తొలగిపోతుంది.
5.జాగరణ
శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న
శివత్వాన్ని జాగృతం చేస్తుంది.
జాగరణం మనలో ఉన్న శివుడిని
జాగృతం చేస్తుంది,
తమస్సును తొలగిస్తుంది.
సినిమాలు చూస్తునో, పిచ్చి
కబుర్లు చెప్పుకుంటూనో,
కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది
జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే
అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా,
ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన
పాపం వస్తుంది.
6.మంత్ర జపం
శివరాత్రి మొత్తం శివనామంతో,
ఓం నమః శివాయ అనే పంచాక్షరీ
మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో
నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని
జాగృతం చేస్తుంది. శివోహం అనే
భావనను కలిగిస్తుంది.
శివరాత్రి
మరునాడు ఉదయం శివాలయాన్నిసందర
్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి
వచ్చి భోజనం చేసి ఉపవాస
వ్రతం ముంగించాలి.
అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య
విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ
చేసినవారు, తరువాతి రోజు రాత్రి
వరకు నిద్రించకూడదు. అప్పుడే
సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు 
 జ్యోతిస్వరూపుడైన మహేశుడు ఈ పవిత్ర భారతావనిలో పన్నెండుచోట్ల జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు. భారతదేశంలోని నాలుగుదిక్కులలో పన్నెండు జ్యోతిర్లింగాలున్నాయి. సముద్రపుఒడ్డున రెండు (బంగాళాఖాతాతీరంలో రామేశ్వరలింగం, అరేబియా సముద్రతీరాన సోమనాథలింగం) పర్వత శిఖరాలలో నాలుగు (శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు, మేరుపర్వతాలపై వైద్యనాథలింగం) మైదాన ప్రదేశాలలో మూడు (దారుకావనంలో నాగేశ్వరలింగం, ఔరంగాబాద్ వద్ద ఘృష్ణేశ్వర లింగం, ఉజ్జయినీ నగరంలో మహాకాళేశ్వర లింగం) నదుల ఒడ్డున మూడు (గోదావరీతీరాన త్ర్యంబకేశ్వర లింగం, నర్మదాతీరాన ఓంకారేశ్వరుడు, గంగానదీతీరాన విశ్వేశ్వరుడు). ఇలా మొత్తం పన్నెండు జ్యోతిర్లింగ రూపాలలోనున్న ఈ లింగాలు పరమశివుని తేజస్సులు. ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు. పదమూడవ లింగం కాలలింగం. తురీయావస్థను పొందిన జీవుడే కాలలింగము. తైత్తీరీయోపనిషత్తుననుసరించి 1. బ్రహ్మ 2. మాయ 3. జీవుడు 4. మనస్సు 5. బుద్ధి 6. చిత్తము 7. అహంకారాము 8. పృథ్వి 9. జలము 10. తేజస్సు 11. వాయువు 12. ఆకాశం – ఈ పన్నెండు తత్త్వాలే పన్నెండు జ్యోతిర్లింగాలు. ఇవన్నీ ప్రతీకాత్మకంగా మన శరీరంలో ఉన్నాయి. ఖాట్మండులోని పశుపతినాథలింగం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది. ఈ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మహిమ ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినా, స్పృశించినా అనేక మహిమలు మన జీవితాలలో ప్రస్ఫుటమవుతుంటాయి. పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేనివారు, కనీసం ఒక్కలింగాన్నైనా దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందనేది పెద్దలవాక్కు.

-----------------------------------------------------------------------------------------------------------------------
Lord shiva 500 songs link:
https://drive.google.com/folderview?id=0B-8fCMz3zodeNWUya1M2M3FGYnc&usp=sharing_eid&tid=0B-8fCMz3zodeMlJfV1BaWlFGb2s#list
SRI SHIVAPURANAM_BHAGAVATULA SUBRAHMANYAM by ysreddy94hyd

LORD SHIVA_MY COLLECTIONS
http://www.mediafire.com/?hhmdunwodkmsf
Maha Shivarathri Special Songs....we have uploaded lord shiva songs and collections links are kept here for downloading....
Link
http://www.4shared.com/folder/UEo5f5Xp/SHIVASTUTHI.html
http://www.4shared.com/folder/ocxzSfQz/SIVA_BHAKTHI_TELUGU_DEVOTIONAL.html
http://www.4shared.com/folder/-BJev6aK/Siva_Sahasranamam.html
http://www.4shared.com/folder/2hDT0e7l/Uma_Shankara_Stuti_Mala_-_M_Ba.html
http://www.4shared.com/folder/zbP8PPpz/Lord_Siva.html
http://www.4shared.com/folder/Evx9o1Fs/01_Siva_Stuti_-_SP_Balu.html
http://www.4shared.com/folder/esC0CM9L/02_Om_Namah_Shivaya.html
http://www.4shared.com/folder/AsW7oFFY/03_Namakam.html
http://www.4shared.com/folder/GLz7Gv_w/04_Bhakti_Maala_-_various_arti.html
http://www.4shared.com/folder/Drhg2asm/05_Srisaila_Mallikarjuna_Bhaja.html
http://www.4shared.com/folder/Sg4KJvRx/Sri_Saila_Mallikarjuna__Single.html
http://www.4shared.com/folder/ZdvonYfI/Siva_Stuthi_Sri_Bramarambika_S.html
http://www.4shared.com/folder/STcCAnzv/Siva_Stuthi_Sri_Srinivasa_Stut.html
http://www.4shared.com/folder/PBDURZT5/Sivanaama_Smaranam-chanting.html
http://www.mediafire.com/?rzion4nk88xmlk8
http://www.mediafire.com/?x98116wyv26twhttp://www.blogger.com/img/blank.gif
http://www.mediafire.com/?lhl2rplvzy48i
http://www.mediafire.com/?e1ytouwdwedt1
http://www.mediafire.com/?70mcld6g1u2so
http://www.mediafire.com/?6op7d72nl7nm2
http://www.mediafire.com/?twh56wmyrlvlv
shiva_Jagjith Singh(Dhuns and Bhajans)
http://www.mediafire.com/?whq48vj7bgy0d
Maha Shivarathri Special Songs,Lord Shiva
http://www.4shared.com/dir/zVKt9nNE/LORD_SHIVASONGS.html .::SONGS LIST::. GYANA SLOKAM : Download MAHA MIRUTYUNJAYA MANTRAM : Download SRI DWADASA JYOTHIRLINGA STHOTHRAM : Download **Shiva Stuthi** Rudrastakam : Download Arthi : Download Siva Maanasa Pooja : Download Siva thandava sthothram : Download Bilvashtakam : Download Lingashtakam : Download Sivashtakam : Download Viswanathashtakam : Download All songs in One File: Download

Lord Shiva Telugu devotional Songs

http://www.4shared.com/dir/D5FpQi2j/MahaShivaratri_Songs.html


Maha Shivarathri Special Songs,Lord Shiva


http://www.4shared.com/dir/zVKt9nNE/LORD_SHIVASONGS.html

.::SONGS LIST::.


GYANA SLOKAM : Download

MAHA MIRUTYUNJAYA MANTRAM : Download

SRI DWADASA JYOTHIRLINGA STHOTHRAM : Download


**Shiva Stuthi**
Rudrastakam : Download

Arthi : Download

Siva Maanasa Pooja : Download

Siva thandava sthothram : Download

Bilvashtakam : Download

Lingashtakam : Download

Sivashtakam : Download

Viswanathashtakam : Download

All songs in One File: Download

Lord Shiva Telugu devotional Songs


http://www.4shared.com/dir/D5FpQi2j/MahaShivaratri_Songs.html

.::SONGS LIST::.

Lingashtakam: Download

Sivashtakam: Download

Bilvashtakam: Download

Viswanathashtakam: Download

Rudrastakam : Download

Maha Mrutyunjaya Mantram: Download

Siva thandava sthothram: Download

Siva Maanasa Pooja : Download

Rudram Namakam Chamakam: Download

Sree Saila Mallikarjuna Suprabhatam: Download

Siva Naamaavalastakam : Download

Siva thandava sthothram : Download

Hara Om Namashivaya-1 : Download

Hara Om Namashivaya-2 : Download


"Shivoham Telugu Devotional Mp3 Songs"

Chidananda : Download
Chidananda 1 : Download
Jata kataha : Download
Namo Bhutanadam : Download
Prabhu Meesha : Download
Ratna Saanu : Download
Samba Sadashiva : Download
Vishveshwara : Download
All songs in a single file : Download

శివరాత్రి శుభాకాంక్షలతో కినిగె అందిస్తున్న ప్రత్యేకమైన కానుక. రామకృష్ణ మఠం వారి శ్రీ శివ మహాపురాణం!

వేదములే మూలములుగా గల అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఆ వేదములు చతుర్ముఖ బ్రహ్మకు పరమశివుడే ఉపదేశించాడు. కనుక వేదములు, వాటి నుండి వెలువడిన శ్రుతి, స్మృతులు, పురాణాలు అన్ని ప్రప్రథమంగా శివుని చేత బ్రహ్మదేవునికి తెలుపబడింది. కాబట్టి మహాశివుడే మొట్టమొదటి పురాణ కథానాయకుడని మహాభారతం శాంతిపర్వంలో – “అష్టాదశ పురాణానాం దశభిః కథ్యతే శివః” - అని పేర్కొనబడింది. అష్టాదశ పురాణాలలో పది పురాణాలు శివుని కథలతో నిండినవని స్పష్టంగా తెలియబడుచున్నది. సర్వవ్యాపకుడు,సర్వాధారుడు, నిర్వికారుడు, నిరంజనుడు అని బ్రహ్మ విష్ణ్వాది దేవతల చేత కీర్తించదగ్గ మహాశివుని లీలా మాహాత్మ్యాన్ని తెలిపేదే ఈ శివ మహా పురాణం. ఈ శివ మహా పురాణం మహా పుణ్యప్రదాలైన పన్నెండు సంహితలను కలిగి ఉంది. లక్ష శ్లోకాలతో కూడినది. అయితే కలియుగ జీవులు అల్పాయుష్కులని గ్రహించి వ్యాసమహర్షి ఏ�° �ు సంహితలు, ఇరువది నాలుగు వేల శ్లోకాలలో సంక్షిప్తం గావించారు. ఈ శివ మహా పురాణం అష్టాదశ పురాణాలలో నాల్గవది. ఏడు సంహితలలో నాల్గవదైన కోటి రుద్ర సంహితలో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రాదుర్భావ చరిత్ర పొందుపరచబడింది.
పురాణాలలో సాగే సంభాషణలలో ఆధ్యాత్మిక సాధకుల సాధనా మార్గాలు తేటతెల్లమవుతాయి. ఉదాహరణకు శివ మహా పురాణం రుద్ర సంహితలో దాక్షాయణి పరమశివుని సమీపించి నివృత్తి మార్గాన్ని ఉపదేశించమని కోరింది. జీవుడు ఏ తత్త్వాన్ని ఎరిగి సంసార దుఃఖాన్ని దాటగల్గుతాడో ఆ మోక్షసాధనను తెలియజేయమని కోరింది. పరమశివుడు భక్తిమార్గాన్ని బోధించి ముల్లోకాలలో భక్తి కంటె సులభమైన మార్గం లేదని వివరింà ��ాడు. ఈ పురాణంలో ప్రతీ ఘట్టం జీవులకు మేలైన సాధనా మార్గాన్ని ప్రతిపాదిస్తుంది.
“పఠనాచ్ఛ్ర శ్రవయా దస్య భక్తి మా న్నర సత్తమః, సద్యః శివపదప్రాప్తిం లభతే సర్వసాధనాత్‌” - భక్తితో శివపురాణం పఠించే మానవులూ, ఆ పురాణమును భక్తిశ్రద్ధలతో ఆలకించేవారూ, శివుని భక్తి ప్రపత్తులతో ఆరాధించే నరులు, మానవోత్తములై ఇహ లోకంనందు సుఖసౌఖ్యాలను, పరలోకమునందు శివసాన్నిధ్యాన్ని పొందగలరని ఈ పురాణమే చెబుతోంది. మఠం ద్వారా ప్రథమంగా వెలువడుతున్న ఈ శివ మహా పురాణాన్ని తెలుగు పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ...
ప్రకాశకులు
Preview free download of this Telugu book is available at Sri Shiva Maha Puranamu


Friday, February 13, 2015

పరనింద-స్వస్తుతి

పరనింద-స్వస్తుతి
Posted On:2/13/2015 11:33:37 PM
ఇతరులను ఎవరినీ నిందించకూడదు, మాటలతో హింసించకూడదు. కఠినంగా మాట్లాడితే, నిష్కారణంగా నిందిస్తే, ఎప్పుడూ అప్రియములనే పలుకుతూ ఉంటే మనకంటూ ఆత్మీయులు, ఆప్తులు ఉండనే ఉండరు.
తనలో శక్తిసామర్థ్యాలు అపరిమితంగా ఉన్నప్పటికీ, తనను తాను స్తుతించుకోకూడదు. ఎవరైతే ఇతరులను ఎప్పుడు కూడా నిందించరో, అట్లాగే తమను తాము స్తుతించుకోరో, తమ గొప్పతనా న్ని తామే చెప్పుకుండా ఉంటారో, అటువంటి వ్యక్తులే గుణసంపన్నులుగా కీర్తింపబడుతారు. గొప్పనైన యశస్సును పొందుతారు.

అబ్రువన్ కస్యచిత్ నిందాం ఆత్మపూజాం అవర్ణయన్
విపశ్చిత్ గుణసంపన్నః ప్రాప్నోత్యేవ మహద్యశః॥
అని వ్యాసమహాభారతం శాంతిపర్వంలోని శ్లోకం ద్వారా ప్రకటింపబడినది.
కొందరు తమను తాము ఎక్కువగా ప్రశంసించుకుంటూ ఉంటారు. ఇతరులు కూడా ఈ ప్రశంసలను విని వారు తమను గొప్పగా భావించి గౌరవించాలని భావిస్తారు. ఇట్టివారిని వ్యాసమహాభారతం శాంతిపర్వంలోని సూక్తి- మూర్ఖులు నలోకే దీప్యతే మూర్ఖః కేవలాత్మప్రశంసయా అని సంబోధించి, ఇట్టివారికి లోకంలో ప్రకాశం కలుగదు, సత్కీర్తి ప్రతిష్ఠలు లభించవు అని పేర్కొన్నది.

పూలలో ఉండే సుగంధాన్ని గురించి ఎవరూ చెప్పకపోయినా, సుగంధం అంతటా వ్యాపిస్తుంది కదా! ఆకాశంలో ప్రకాశించే సూర్యనారాయణుడు తన ప్రకాశాన్ని గురించిగానీ, తాను చేయు సత్కార్యాల గురించిగానీ ప్రచారం చేసుకోడు కదా! అట్లే మనం కూడా మన గురించి ఎక్కువగా చెప్పుకోరాదు, స్వస్తుతి చేసుకోరాదు.
అబ్రువన్ వాతి సురభిర్గంధః సుమనసాం శుచిః
తదైవ అవ్యాహరన్ భాతి విమలో భానురంభరే ॥
అని శాంతిపర్వంలోని సూక్తి మనకు ప్రబోధిస్తున్నది.
ప్రతిభావంతులు, ప్రజ్ఞావంతులు అయినట్టి వారు ఎంత మారుమూలన ఉన్నా, వారి కీర్తిప్రతిష్ఠలు అంతటా తప్పక వ్యాప్తమౌతాయి. అందువల్ల తమ కృషి మరుగున పడిపోకూడదు అనే ఉద్దేశ్యంతోనైనా సరే స్వస్తుతి అసలే పనికిరాదు.

ఇతరులలో ఏవో చిన్న లోపాలున్నాయని, వారిలో స్వార్థచింతన ఎక్కువ ఉన్నదని భావిస్తూ ఒకటికి పదిసార్లు ఇతరులను నిందిస్తూ ఉంటే మనకు శాంతి సౌఖ్యాలు దూరమౌతాయి. అందుకే మన పూర్వులు పరనింద తగదని, స్వస్తుతి కూడదని హితవు పలికారు. పూర్వుల హితప్రబోధాన్ని శిరసావహిద్దాం.

స్వర్గధామం జన్మభూమి

స్వర్గధామం జన్మభూమి
Posted On:2/13/2015 12:25:41 AM
నింగికెగిసే సామర్థ్యం నేలపై నిలబడి ఆకాశంవైపు చూసే ఆనందం ముందు చిన్నబోతుంది. వర్షపు జల్లుకై ఎదురుచూపు కన్నా దానికి ముందే పరిమళించే మట్టివాసన తృప్తినిస్తుంది. మనిషి ఎదిగినా తల్లిదండ్రులకు తనయుడే. వాస్తవం కంటే ఊహ చాలా అందంగా ఉంటుంది. కానీ చిరకాలం తోడుండేది వాస్తవమే. అట్లాగే విస్తృతమైన ప్రపంచంలో ఉద్యోగపర్వంలో, బతుకువేటలో అనేక ప్రాంతాలు వలస వెళ్ళే జనం ఉన్నవూరి కన్నా తన ఊరికై తపిస్తుంటారు. ఆ సంబంధం అం త బలీయమైంది. అస్థిత్వాన్నిచ్చిన తల్లిఒడిలాంటి జన్మస్థలం, నాది అనుకునే హక్కులిచ్చిన ఊరు ఎవ్వరికైనా అపురూపమైనదే.
వాసః కాంచన పంజరే నృపకారమ్భోజైస్తనోర్మార్జనం
భక్ష్యం సాధు రసాల దాడి మపలం పేయం సుధాభం పయః
పాఠః సంసది రామనామ సతతం ధీరస్స కీరస్యమే
హావాహన్త తథాపి జన్మవిటపిక్రోడే మనోధావతి॥

స్వేచ్ఛాకజీవిగా, ధీరగా జీవించిన నేను చిలుకను, బంగారు పంజరంలో నివసిస్తున్నారు. రాజు తన చేతులతో నన్ను ప్రేమగా స్పృశిస్తుంటాడు. మంచి మామిడి, దానిమ్మ పళ్ళను ఆరగిస్తున్నాను. అమృతం లాంటి నీళ్ళు తాగుతుంటాను. రామనామం స్మరిస్తుంటాను. ఇన్ని ఉన్నా నా మనస్సు నే పుట్టిన చెట్టు ఒడివైపే పరుగెడుతుంది. ఎంతటి భావగాంభీర్యత దాగుందీ మాటల్లో. లోకంలో భగవంతుడు ప్రతీదీ పొందిగ్గా అందంగా, సున్నితంగా స్పష్టించాడు. ఎక్కడుంటే ఏముందిలే! హాయిగా బ్రతికితే చాలు. అంటూ మనసు ను పదే పదే సమాధానపరుస్తూ బ్రతికేస్తాం. ఆ మనసు నొచ్చుకుంటే నా ఊరైతే ఎంత సౌకర్యంగా ఉండేదోననే సందర్భాలు జీవితంలో లేకపోవు. తన నా వాళ్ళూ, తల్లిదండ్రులూ, బంధువులు లేకుండా ఎంత ఆర్భాటంగా బ్రతికినా సంతృప్తి కలుగదు. కన్నూరిలో ఆనందంగా బ్రతికితే లభించే మానసిక సాంత్వనే వేరు. అది అనుభవైకవేద్యమే కానీ అనిర్వచనీయం.
రామారావణయుద్ధం ముగిసి విభీషణుని కోరిక మేరకు లంకలో అడుగుపెట్టారు సీతారామలక్ష్మణులు. అందమైన బంగారు లంక. ప్రాకారాలన్నీ సువర్ణమయం. ఎటుచూసిన స్వర్ణమే. అందులోనూ అద్భుతమైన భవన నిర్మాణ కౌశలం అబ్బురపడిన లక్ష్మణుడు తన్మయత్వంలో రామా మన మూ ఈ బంగారు లంకలోనే ఉండిపోదామా? అని అడిగినదే తడవు చిరుమందహాసంతో శ్రీరాముడు జననీ, జన్మభూమి స్వర్గం కన్నా గొప్పవని సెలవిస్తాడు. ప్రపంచంలో భోగభాగ్యాలన్నీ కల్పించిన పరాయి స్థానంలో కడుపునిండదు. కమ్మని నిద్రారాదు. ఎదో వెలితి. అదే పుట్టినగడ్డపై మనసులో ఉన్న ఆంతరంగిక మమకారం తాలూకు జ్ఞాపకం. తడి ఆరని కన్నీటి చెమ్మ. స్వేచ్ఛాజీవిగా పుట్టిన నీకు అస్తిత్వం ఇచ్చిన స్వస్థలానికి ఆదరణతో అంకితం చేయాలి జీవితం.

Thursday, February 12, 2015

ఆత్మావలోకనం

ఆత్మావలోకనం
Posted On:2/6/2015 11:53:44 PM
లోక పరిశీలనాశక్తి, ఆత్మసంకల్పం మనిషిని తారాస్థాయికి చేర్చాయి. జీవన పోరాటంలో కాలం సంధించే సమస్యల వలయాలు చేజేతులా చేసుకున్న పొరపాట్లు తాలూకు గుణపాఠాలు మనిషిని మరింత దృఢం చేస్తూనే ఉన్నాయి. కానీ యాంత్రిక జీవనాన్ని పక్కకునెట్టి బతుకు నడుస్తుంది కదా అనే ఆలోచనకు తెరదించి జీవితాన్ని పరికిస్తే మనసు ఆత్మావలోకనం చేసుకొమ్మని సలహా ఇస్తుంది. ఎక్కడి జీవితం మొదలయ్యిందో అక్కడి నుంచి జీవన చిత్రం మనోఫలకంపై కదలాడుతుంటే ఎంతో సాధించామన్న గర్వం ఎన్నిటిని దాటి ఈ స్థాయికి చేరామనే భావం ఏదో మూలన దాగుంటా యి.
ఏమీ చేయలేకపోయామనే బాధ మనసును తొలి చేస్తుంటే అసంతృప్తి హుదయ సామ్రాజ్యాన్ని ఆక్రమిస్తుంది. అశాంతి జీవితాన్ని చీకటి చేస్తుంది. నేను అనే భావనలో భగవంతుడున్నాడు. ప్రపంచమంతా భగవత్సరూపం. పరస్పర స్నేహభావంతో, నేను-నాకు అని కాక ఏ ఒక్కరికైనా చేసిన సహాయం, దానం మంచి పనులుగా జీవిత ఖాతాలో చేరిపోతాయి. పుణ్యకర్మలు జీవితాన్ని పునీతం గావిస్తాయి.
శిక్షాక్షయం గచ్ఛతి కాలపర్యయాత్
సుబద్ధమూలా నిపతన్తి పాదపాః
జలం జలస్థానగతం చశుష్యతి
హుతం చదత్తం చ తథైవ తిష్ఠతి॥

కాలం అనేది గడుస్తూ వుంటే నేర్చుకున్న విద్యలన్నీ మరుపుచే మరుగున పడిపోతాయి. భూమి లోతుల్లోకి అతిదృఢంగా పాతుకుపోయిన మొదళ్లు ఉన్నా చెట్లు కూలిపోతాయి. చెరువుల్లోని నీరూ ఎండిపోతుంది. కానీ చేసిన యజ్ఞాలూ, దానాలూ మంచి పనులుగా, పుణ్యకర్మలుగా శాశ్వతంగా లోకంలో నిలిచిపోతాయి.ఎందరో మహానుభావులు ఆదర్శమంటే అర్థం చెప్పేలా జీవించి కాలగర్భంలోకి వెళ్లిపోయారు. వారు చేసిన మంచిపనులు అనే కారణంతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. సేతుబంధన శాశ్వత్వాన్ని కార్యంలో భాగంగా చిన్నప్రాణి ఉడత ఇసుకను ఇచ్చి రామకథలో శాశ్వతత్వాన్ని పొందగలిగింది. ఆలోచన వివేకం, సంకల్పం గల మనిషి తలుచుకుంటే చేయలేనిది లోకంలో ఉంటుందా!
పంచభూత్మాతక ప్రపంచంలో పంచప్రాణాలు నిలుపుకునేందుకు శాయశుక్తుల పోరాడే మనిషి తోటివారి ఆకలిని గ్రహించకపోవడం అసంభవం. యధాశక్తి సాటి మనిషికి సాయపడటం, దానధర్మాది కార్యక్రమాలు చేయడం ఆపద సమయంలో సమాజం నిద్రపోదని చెప్పేలా ప్రవర్తించడం.. ఇవి చాలవా! మానవత్వాన్ని పరిమళింపజేసే మనిషిని చరిత్ర పుటల్లో చేర్చడానికి. లేదు-కాదు అనే పదాలు మానవ పదకోశంలో ఇమడలేక మనిషి సద్గుణ సంపత్తిని చూసి చెరిగిపోవాలి. సుహృదాలోచన పరంపరకు మానవత్వం శ్రీకారం చుట్టాలి.

దుర్జన వచనాలు

దుర్జన వచనాలు
Posted On:2/9/2015 11:53:47 PM
అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను అనే పద్యము తెలుగువారందరికీ సుపరిచితమే. సజ్జనులు ఇతరుల మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా మాట్లాడుతారు. అల్పుడు తనను అందరూ గొప్పగా భావించాలనే ఉద్దేశ్యంతో తనలో లేని గొప్పతనాన్ని ఉన్నట్టుగా చెప్పుతాడు. గొప్పలకు పోతాడు. అసత్యాలను పలుకడానికి కూడా వెనుకాడడు. అయితే అల్పుల పలుకుల కన్న సజ్జనుల సంభాషణ కన్న భిన్నంగా దుర్జన వచనాలు ఉంటాయి. ఇవి ఇతరులను అమితంగా బాధించేవిగా ఉంటాయి. పైగా చాలా తీక్ష్ణంగా ఉంటాయి. మండు వేసవిలో భరించలేనంత తీక్ష్ణంగా ఉండే సూర్యకిరణాలవలె మలమల మాడుస్తాయి. తీవ్రంగా తపింపజేస్తాయి.
తెలిసి పట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా కాల్చే అగ్నివలె దుర్జనుల వాక్కులు తీవ్రంగా గాయపరుస్తాయి. మసిచేస్తాయి. స్వపరభేదం లేకుండా అందినదాన్నల్లా కాల్చేసే స్వభావం కల అగ్నికన్నా, వేల మైళ్ళ దూరంలో ఉన్నవారిని కూడా బాధించే సూర్య కిరణాల కన్నా ఎక్కువ తీక్షంగా ఉండేవే దుర్జన వచనాలు.
సూర్యకిరణాలలోని, అగ్నిలోని వేడిమి శరీరాన్ని మాత్రమే గాయపరుస్తాయి. కాని దుర్జన వచనాలు మనసును గాయపరుస్తాయి. మనసుకు గాయమైతే మనిషి దుర్బలుడౌతాడు, క్రుంగిపోతాడు, కృశించిపోతాడు. దుర్జన వచనాలు తలచుకొని తలచుకొని బాధపడేలా ప్రభావితం చేస్తాయి. అందుకే నీతిశాస్త్రజ్ఞుడైన కవీశ్వరుడు సూర్యకిరణాలకన్న అగ్నికన్న దుర్జనవచనాలే తీక్షమైనవి.

దివసకరః కిల తీక్షో దివసకరాత్ పావకో మహాతీక్ష్ణః
దివసకర పావకాభ్యాం దుర్జనవచనాని తీక్ష్ణాని ॥ అని పేర్కొన్నాడు.
దుర్జనులు తమ మాటలతో ఇతరులను నిష్కారణంగానే బాధిస్తూ ఉంటారు. అని నొప్పించడం వారికి పట్టుబట్టలు కట్టుకొని పండుగ జరుపుకున్నంత ఆనందంగా ఉంటుందేమో. పంచభక్ష్య పరమాన్నాలతో విందు భోజనం చేసినంత సంతృప్తిని కలిగిస్తుందేమో. అలా మాట్లాడే దుర్జనులకు ఆప్తులు ఎవరూ ఉండరు. ఆత్మీయతను ఎవరూ పంచరు. అందరూ దుర్జనులను ఆమడదూరంలో ఉంచుతారు. అందుకే మనం కూడా దుర్జనులతో సాంగత్యం ఏర్పరచుకోకుండా, వారి మాటల బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్త పడుదాం.

సుభాషితం

సుభాషితం
Posted On:2/11/2015 1:55:52 AM
భూమండలంపై జలం, అన్నం, సుభాషితం అనే మూడు రత్నాలు వెలుగొందుతాయనీ, అవే జీవ న రత్నాలనీ విజ్ఞుల ప్రభోధం. మనిషి భౌతికంగా ఎదిగేందుకు జలం, అన్నం ఎంత అనివార్యమో మానసిక మనుగడకు సుభాషితం అంతే అవసరం.
మంచి ఎవరు చెప్పినా, ఎక్కడ నుంచి వచ్చినా నేర్చుకోవాలని వేదం చెబుతుంది. సామాజిక నేపథ్యంలో మనిషి ఎదగాలంటే తల్లిదండ్రులూ, గురువులూ, స్నేహితులూ, శ్రేయోభిలాషులూ, మార్గదర్శకులు ఇలా ప్రతి ఒక్కరూ మంచిమాటలు చెబుతూ భావితరాన్ని ప్రోత్సహించాలి. వారు చెప్పేమాటలు వింటూ పిల్లలు ఎదగాలి. జీవితం అందించే విభిన్న కోణాల్లో మనిషి మనుగడ కొనసాగాలంటే సుభాషితం మాత్రమే ఆలంబనం.
సుభాషితం హారి విశత్యధో గలాన్న
దుర్జనస్యార్క రిపోరివామృతమ్
తదేవ ధత్తే హృదయేన సజ్జనో
హరిర్మహారత్నమివాతి నిర్మలమ్‌॥

సూర్య భగవానుని శత్రువైన కేతువుకు తల తప్ప శరీరమే లేదు గనుక అమృతం హృదయంలోకి చేరదు. సహృదయమే లేని దుర్జనుడికి సుభాషితం హృదయాన్నెలా చేరుతుంది. అదే సుభాషితం శ్రీహరి హృదయసీమను కౌస్తుభం చేరినట్లుగా సజ్జనుని హృదయంలో నిలిచిపోతుంది.
ప్రపంచవ్యాప్తంగా భారతీయ మూలాలను ఆధారం చేసుకొని వివేకానందుడు చెప్పిన సుమధుర భాషణం తరగని సుభాషితమై నేటికీ అలరారుతుంది. ఎందరినో కార్యోన్ముఖం చేస్తూ ఉత్సాహపరుస్తుంది. భారతీయ సాహిత్యంలోని సుభాషితాలు సర్పకాల సర్వావస్థల్లో, సంక్లిష్ట పరిస్థితుల్లో, స్తబ్ధత ఆవరించిన సమయంలో ఆపన్నహస్తాలై, మానసిక సంకల్పాలై మనిషికి దారి చూపిస్తాయి.
ఆశావహదృక్పథంతో ప్రతి ఒక్కరూ సత్సంబంధాలను కలిగివుంటూ, మంచి మాటలే మానసిక భావాలవుతూ, మచ్చుకైనా అలుపే లేని ఆనందం జీవితమవుతూ బతకాలి. పుట్టుకతో గానీ, పరిస్థితుల వలనగానీ మనిషి ఎంత క్రింది స్థానంలో ఉన్నా తనకున్న సహజమైన ఉత్తమగుణం సహృదయం. దానికి కావలసిన ప్రేరణ సుభాషితం. మానవ ధర్మాన్ని తారాస్థాయికి చేర్చగల సాధకుడవుతాడు మనిషి. సంతోషంలో, దుఃఖంలో, బాధలో, ఆలోచనలో గుంఫనంగా ఉన్న మనిషి భావాలను ప్రేరేపించే సుభాషితం నిర్దిష్ట మర్గాన్ని సుగమం చేస్తుంది. దాని ని ఆకళింపు చేసుకొని ఆచరించగలిగితే చాలు జీవితం ధన్యమవుతుంది. మనిషి మహనీయుడై భావితరానికి ఆదర్శంగా నిలుస్తాడు. వారసత్వ సంపదగా సుభాషితమనే రత్నకోశం తరతరాలకూ విస్తరిస్తుంది. 

దీర్ఘాయుష్యం

దీర్ఘాయుష్యం
Posted On:2/12/2015 3:39:44 AM
పెద్దలకు నమస్కరించే సంప్రదాయం మనది. పెద్దలందరూ తమకు నమస్కరించేవారికి చిరంజీవ (చాలా కాలం జీవించుము), దీర్ఘాయుష్యం అస్తు (దీర్ఘమైన ఆయుర్దాయము లభించుగాక) అనే ఆశీర్వాదాన్ని అందిస్తూ ఉంటారు.
మానవులు శతం జీవ శరదః అనే రీతిలో వంద సంవత్సరాలు జీవించాలని వేదమాతెక్క ఆకాంక్ష. శతమానం భవతి అంటూ మనుష్యులు నూరు సంవత్సరాలు జీవించాలని వేద పండితులు ఆశీర్వదిస్తూ ఉంటారు. సర్వేజనాః సుఖినో భవంతు (జనులందరూ సుఖంగా ఉందురుగాక), లోకాస్సమస్తా స్సుఖినో భవంతు (లోకాలన్నీ సుఖంగా ఉండుగాక), స్వస్తి ప్రజాభ్యః (ప్రజలకు శుభం కలుగుగాక) అని పురోహితులు ఆశీర్వాద పురస్సరంగా ఆకాంక్షిస్తూ ఉంటారు.
జనులలో సజ్జనులు, దుర్జనులు ఉంటారు కదా. అందరూ బాగుండాలి అని కోరుకుంటే సజ్జనులతో పాటు దుర్జనులు కూడా బాగుండాలని కోరినట్లు అవుతుంది. దుర్జనులు బాగుంటే వారు చేసే దుర్మార్గాలు కూడా రోజురోజుకీ పెరిగిపోతుంటాయి కదా. అందువల్ల జనులందరూ ముందుగా సజ్జనులు కావాలి. సజ్జనులందరూ క్షేమంగా ఉండాలని కోరడంలోనే ఔచిత్యం ఉంటుంది. సర్వేజనాః సజ్జనాః భవంతు, సజ్జనాః సర్వే సుఖినో భవంతు అని సమాజానికి హితాన్ని ప్రబోధిస్తున్న కొందరు ఆధ్యాత్మిక గురువులు భావిస్తున్నారు.
అన్యాయాలకు అధర్మాలకు పాల్పడే వారివల్ల సమాజంలో శాంతి కొరవడి సమాజక్షేమానికి, భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. అధర్మాత్ములైనవారికి పదేపదే దీర్ఘాయుష్యం కలగాలని కాంక్షించడం సముచితం కాదు. అధర్మం చేసేవాడికి చిరంజీవిత్వం వ్యర్థం అనర్థం కూడాను. అందువల్ల ధర్మనిష్ఠలు, తమ శ్రేయస్సుతో పాటు తోటి ప్రాణుల యోగక్షేమాలను కూడా కాంక్షించేవారు స్వపరభేదం లేకుండా ఔదార్యబుద్ధితో విశ్వమానవశ్రేయస్సును కలిగియుండాలి.
చిరజీవిత్వ మనర్థం పురుషస్యాధర్మచారిణో భవతి
చిరజీవిత్వం సఫలం భవతి హి ధర్మైకనిరతస్య॥
అని సుప్రసిద్ధ నీతి శాస్త్రజ్ఞుడైన సుందరపాండ్యుడు పేర్కొన్నాడు.
ధర్మనిరతులు పెరగాలని, ధర్మనిష్ఠలు దీర్ఘాయుష్యం కలవారు కావాలని, వీరిని ఆదర్శంగా గ్రహిస్తూ అధర్మాత్ములు తమ జీవనశైలిని మార్చుకోవాలి అనే సుందరపాండ్యుడు భావనకనుగుణంగా లోకోపకార బుద్ధి కలిగిన మహనీయులు అందరూ దీర్ఘాయుష్యులై, పరిపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాలని ఆకాంక్షిద్దాం.

12 HOUR SIVARATRI MUSIC FESTIVAL ON 17.02.2015

I INVITE ALL FOR THE 12 HOUR SIVARATRI MUSIC FESTIVAL ON 17.02.2015. PLEASE COME AND ENJOY THE MUSIC.

SRIKALAHASTHI_SIVARATRI BRAHMOTSAVAMS-2015 FEB 12 TO 24

​​హరిఃఓమ్
ఓమ్ నమో నారాయణాయ
శివరాత్రి బ్రహ్మోత్సవాలు-శ్రీకాళహస్తి-2015 ఫిబ్రవరి 12-24 

హరిఃఓమ్
ఓమ్ నమో నారాయణాయ.
భగవత్సేవలో,
బ్రహ్మచారి విజయానంద .-081 06 85 19 01
శ్రీ శుకబ్రహ్మఆశ్రమము-517640
శ్రీకాళహస్తి-ఆంధ్రప్రదేశ్-ఇండియా
HARI OM.
OM NAMO NARAYANAYA,
IN THE SERVICE OF THE ALMIGHTY,
BRAHMACHARI  VIJAYANANDA,
SRI SUKA BRAHMA ASHRAM-517640.
SRIKALAHASTI-(AP)-INDIA
081 06 85 19 01


Friday, February 6, 2015

kamba-ramayana-in-english

Today by the wishes, blessings and prayers of you all I completed the translation of Kamba Ramayanam In to English.May God bless you all.
The index of the various sections is given in 
http://englishkambaramayanam.blogspot.in/2015/01/index-of-kamba-ramayana-in-english.html

శ్రేయోమార్గం

శ్రేయోమార్గం Posted On:2/6/2015 2:55:40 AM పశుపక్ష్యాదులకంటె విశిష్టుడైన మానవునికి శ్రేయస్సును కలిగించే మార్గాలను ఆర్షవాఙ్మయం మనకు విస్పష్టంగా తెలుపుతున్నది. సర్వప్రాణుల పట్ల మృదు ప్రవర్తనను, వ్యవహారాలలో ఋజుప్రవర్తనను కలిగియుండుట, తోటి వ్యక్తులతో మధురంగా మాట్లాడుట, నిస్సంశయమైన శ్రేయోమార్గం - మార్దవం సర్వభూతేష వ్యవహారేష చార్జవమ్ వాక్ చైవ మధురా ప్రోక్తా శ్రేయ ఏతదసంశయమ్ ॥ అని మహాభారతం శాంతి పర్వంలో చెప్పబడింది. మిత్రులపట్ల అనుగ్రహమును, శత్రువులపట్ల నిగ్రహమును కలిగియుంటూ శాస్త్రోక్త ప్రకారంగా ధర్మాచరణ చేస్తూ ధర్మబద్ధంగా ధనార్జనను, భోగానుభవాన్ని కొనసాగించెడివారు శ్రేయస్సును పొందుతారు. అనుగ్రహం చ మిత్రాణాం అమిత్రాణాం చ నిగ్రహమ్ సంగ్రహం చ త్రివర్గస్య శ్రేయ ఆహుర్మనీషిణః ॥అని శాన్త్రపండితులు పేర్కొన్నారు. వ్యాస మహాభారతంలోని గురుపూజా చ సతతం, వృద్ధానాం పర్యుపాసనమ్‌ శ్రవణంచైవ శాస్త్రాణాం కూటస్థం శ్రేయ ఉచ్యతే ॥ అనే శ్లోకము పేద-ధనిక, పండిత-పామర తారతమ్యం లేకుం డా జాతి-మత-వయో-ప్రాంత భేదము లేకుండా, అందరూ తమకు విజ్ఞానాన్ని ప్రబోధించిన గురువులకు, వయోవృద్ధులకు, జ్ఞాన వృద్ధులకు, అనుభవజ్ఞులకు గౌరవమర్యాదలతో సపర్యలను అందించుట లౌకిక విజ్ఞానాన్ని అందించే శాస్త్రాలతో పాటు, ఆధ్యాత్మిక గ్రంథాలను, బ్రహ్మవిద్యలను, వేదవేదాంగములను అధ్యయనం చేయుటవంటివి శాశ్వతమైన శ్రేయస్సును కలిగించే పద్ధతులని ఉద్బోధించినది.శ్రేయస్సును కోరువారు పరిమితమును తప్పి వ్యవహరించరాదు. ఇంద్రి య సుఖములను కూడా మితముగనే అనుభవించవలెను. శబ్ద రూప రస స్పర్శాన్ సహగంధేన కేవలాన్ నాత్యర్థముపేవేత శ్రేయసో-ర్థీ కథంచన ॥అని చెప్పబడినది. శాస్త్రోక్తమైన, గురూపదేశమైన శ్రేయోమార్గాన్ని అనుసరిద్దాం, జన్మను సార్థకం చేసుకుందాం. -సముద్రాల శఠగోపాచార్యులు

SRI LAKSHMI VENKATESHWARA POLAPRAGADA CHARITABLE TRUST

SRI LAKSHMI VENKATESHWARA POLAPRAGADA CHARITABLE TRUST 


Wednesday, February 4, 2015

Parama gurustotramu

Parama gurustotramu
​​
హరిఃఓమ్
ఓమ్ నమో నారాయణాయ.
భగవత్సేవలో,
బ్రహ్మచారి విజయానంద .-081 06 85 19 01
శ్రీ శుకబ్రహ్మఆశ్రమము-517640
శ్రీకాళహస్తి-ఆంధ్రప్రదేశ్-ఇండియా
HARI OM.
OM NAMO NARAYANAYA,
IN THE SERVICE OF THE ALMIGHTY,
BRAHMACHARI  VIJAYANANDA,
SRI SUKA BRAHMA ASHRAM-517640.
SRIKALAHASTI-(AP)-INDIA

Tuesday, February 3, 2015

తపశ్చర్య

తపశ్చర్య
Posted On:2/4/2015 1:33:07 AM
వేదవిహితములైన పరమపావనకరములైన యజ్ఞ-దాన-తపములు అను కర్మలను ప్రతిఒక్కరు తప్పక ఆచరించవలసిందే. వేదవిహిత కర్మలలో ఒకటైన తపమును ఆచరించడమంటే అన్నం తినకుండా, ఏ రకమైన ద్రవ పదార్థాలను కూడా తీసుకోకుండా, ఉపవాసదీక్షతో ఉంటూ శరీరాన్ని శుష్కింపచేసుకోవడం కాదు. మనసు యొక్క, ఇంద్రియముల యొక్క ఏకాగ్రతయే గొప్ప తపము మనసశ్చేంద్రియాణాంచాపి ఐకాగ్య్రం పరమం తపః అని చెప్పబడినది.అహింస, సత్యము, దమము, నీచబుద్ధి లేకుండుట, మార్దవము, దయ అనే గుణములను అలవరచుకొనుటయే నిజమైన తపస్సు -
అహింసా సత్యవచనం ఆనృశంస్యం దమో ఘృణా
ఏతత్ తపోవిదుః ధీరా న శరీరస్య శోషణమ్ ॥

అని మహాభారతం శాంతిపర్వంలోని సూక్తి మనకు ప్రబోధిస్తున్నది. మాటలతో కాని, చేష్టలతోకాని, మన సంకల్పములలోగాని ఎవరినీ ఏ రకంగా కూడా బాధించకపోవడాన్ని అహింస అంటారు. మూడు కాలాలలో బాధింపబడని సరైన వాక్కును సత్యమని అంటారు. ఉన్నది ఉన్నట్లు చెప్పడం కాకుండా సర్వ ప్రాణి సంక్షేమా న్ని కోరుతూ చెప్పే మాటలే, చేసే క్రియలే సత్య శబ్దముచే ప్రకటింపబడుతాయి సత్యం భూతహితం ప్రోక్తం యథార్థ కథనం నహి అనే వ్యాస భారతసూక్తి వెల్లడిస్తున్నది.
బాహ్యంగా ఉండే ఇంద్రియములను నిగ్రహించడాన్ని దమము అని వ్యవహరిస్తారు. అహింస, సత్యము, దమము అను లక్షణములను కలిగియుండడంతో పాటు నీచబుద్ధి లేకుండా, మృదుస్వభావాన్ని కలిగియుండుట, సర్వప్రాణులపట్ల దయతో మెలగుట అను గుణములను అలవరచుకొనుటయే తపశ్చర్యగా మన ప్రాచీన వాఙ్మయం పేర్కొంటున్నది. మన పూర్వులైన మహర్షుల, మునుల ఆచరణ కూడా మహాభారతం శాంతిపర్వంలోని సూక్తిని ధృవపరచునట్టిదే.
శరీరాన్ని బక్కచిక్కించుకొనేరీతిలో ఉపవాసాలు చేస్తూ, గడ్డాలు మీసాలు పెంచుకుంటూ, కళ్ళుమూసుకొని అడవిలో కూర్చోవడమే తపస్సు అనే కొందరి ఆలోచనా విధానానికి భిన్నంగా తపశ్చర్య అని దేనిని పేర్కొనాలో మనకు శాంతిపర్వ సూక్తి విశదంగా పేర్కొన్నది. వ్యాసభారతోక్తులను అనుసరించి మనం కూడా ఈ రకమైన తపశ్చర్యను ఆచరించే ప్రయత్నం చేద్దాం.

ఆధ్యాత్మికం,ఆహ్లాదం,అడ్వెంచర్‌ చెర్వుగట్టు క్షేత్రం

ఆధ్యాత్మికం,ఆహ్లాదం,అడ్వెంచర్‌ చెర్వుగట్టు క్షేత్రం

Updated : 1/29/2015 12:24:41 PM
Views : 599

NkpChervugattuStory01


మూడు కిలోమీటర్ల దూరంలో ఉండగానే మైకుల నుంచి శివ-పార్వతుల స్తోత్రాలు చెవులను చేరుతున్నాయి. నార్కట్‌పల్లికి సమీపంలో యల్లారెడ్డిగూడెం వద్ద అద్దంకి హైవేను దాటి ముందుకు సాగుతోంది మా ప్రయాణం. పార్వతీ సమేత జడల రామలింగేశ్వరుడు కొలువైన చెర్వుగట్టు క్షేత్రమే మా గమ్యం. శివాలయమే కావచ్చు.. కానీ ఆధ్యాత్మికతను మించిన ఆహ్లాదాన్నీ, అడ్వెంచర్‌నూ అక్కడ రుచి చూడవచ్చు.

బ్రహ్మోత్సవాల వేళ కిక్కిరిసిన జన సందోహం నడుమ గుట్ట పైకి మెట్ల మార్గంలో వెళ్లినా.. ఫీట్లు పడుతూ ఘాట్ రోడ్డులో పయనించినా.. ఆ థ్రిల్ అనుభవించాల్సిందే తప్ప మాటల్లో చెప్పలేం. ఇక పైనున్నంత సేపూ కలిగే ప్రత్యేక అనుభూతి.. మూడు గుండ్ల ముచ్చట.. కోనేటి స్నానం.. కొత్తగా కట్టిన కల్యాణ మండపం.. వాటిని మించి రామలింగేశ్వరుడి దర్శనం ఇలా ప్రతిదీ వర్ణనకు కొత్తగా మాటల మూటలను చేర్చే అంశమే.

నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు.. ఇక్కడ నిత్యం జన సందోహమే.. ఇక జాతర సమయంలో అయితే.. ఇసుకేస్తే అన్న చందంగా గుట్ట నిండా జన జాతరే. స్వాగత తోరణం నుంచే జాతర సంబురం కళ్లల్లో నింపుకున్న భక్తుల సందడి కనిపిస్తున్నది. వరుసగా కొలువుదీరిన జాతర కొట్లు చెర్వుగట్టుకు పండుగ శోభను మోసుకొచ్చాయి. దుకాణాల మధ్య కాలు దూర సందు లేని రీతిలో జనం సందడి.. మొక్కు కోడెలను పట్టుకెళ్లే భక్తుల హడావిడి.. ఒక్కటేమిటి కళ్లతో ఆరగించే మనసుండాలే కానీ కంటితోపాటు చెవులకూ ఇంపైన కొత్త సందడి బోలెడంత దొరుకుతుంది అక్కడ.

చెర్వుగట్టు గుట్ట కింది గాలిగోపురం నుంచి పైకెళ్లే మెట్ల మార్గం ప్రారంభమైంది. సుమారు వెయ్యి ఉండే రాతి మెట్ల మీద పైకి వేసే ఒక్కో అడుగు.. కింద కిక్కిరిసిన జన సందోహం, దూరంగా నిలిపిన వేలాది వాహనాలు.. వాటిని దాటి చూస్తే చుట్టూ పరుచుకున్న పొలాలు, ఫ్యాక్టరీలు, స్టేట్ హైవే, అటూ ఇటుగా ఉన్న అసంపూర్ణ వెంచర్లు.. అనేకాంశాలు కళ్లకు చేరువవుతాయి. కానీ.. జాతర సమయంలో మెట్ల మార్గం నుంచి గుట్ట పైకి వెళ్లాలంటే జనం మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతూ ఊపిరి సలపని పరిస్థితులు పదులసార్లు ఎదుర్కోవాల్సిందే. ఒకే దారిలో పైకి వెళ్లే వాళ్లు.. దిగువకు వచ్చే వాళ్లు కోకొల్లలుగా కనిపిస్తున్నారక్కడ. ఆ జనసందోహాన్ని చూసి మెట్ల మార్గంలో వెళ్లేందుకు జడిసింది మా బృందం. అందుకే ఘాట్ రోడ్డు మీదుగా గుట్ట పైకి చేరుకున్నాం. వెళ్తుంటే ఒక్కో అడుగు ఎత్తు పెరుగుతున్నా కొద్ది కవ్వించే అందాలు కోకొల్లలు.

కొత్తగా సుమారు రూ. 2 కోట్లతో ప్రారంభించుకున్న కళ్యాణ మండపం కన్నులను కట్టి పడేస్తుంటే ఆ అందాలను దాటుకుని పక్కనే ఉన్న కోనేరు వైపు పడ్డాయి మా అడుగులు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తలోకం అక్కడ స్నానమాచరిస్తూ శివ నామస్మరణతో భక్తి పారవశ్యంలో మునిగితేలుతోంది. కాళ్లు కడిగి దర్శనార్థం బయల్దేరాం. వేలాదిగా బారులు తీరిన భక్తుల నడుమ రెండు గంటల ప్రయాస తర్వాత కానీ శివయ్య దర్శనం కలగలేదు.

NkpChervugattu02


గుట్ట పై నుంచి చూస్తుంటే అబ్బుర పరిచే అందాలన్నింటినీ కళ్లల్లో మూటగట్టుకుని మరింత పైపైకి వెళ్తున్నాం. మూడు గుండ్లుగా చెప్పుకునే ముచ్చటైన థ్రిల్ జర్నీ కోసం గతంలో అనుభవమున్నవాళ్లంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తల ఒక్కింటికి రూ. 10 టిక్కెట్ తీసుకుని మూడుగుండ్ల పైన కొలువైన ప్రత్యేక శివలింగం దర్శనం కోసం బయల్దేరాం. ఇరుకైన బండరాళ్ల సందుల్లోంచి.. రాతి బండల మధ్య ఏర్పరిచిన ఇనుప మెట్ల మీదుగా వెళ్లాలి. మరీ దగ్గరగా ఉండడంతో భయం.. మనసులో కాసింత ఆందోళన.. కానీ అందరూ ఉన్నారులే అన్న అభయం.. అన్నీ కలుపుకొని ముందుకు సాగాం.

రెండు గుళ్లు దాటి మూడో గుండు ఎక్కే దగ్గర మొదలైంది అసలైన ట్విస్ట్. తొలిసారిగా వచ్చిన వాళ్లు కళలో కూడా ఊహించలేదు ఆ ఇరుకైన సంధును. రెండు పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య కేవలం 20 సెంటీమీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న ప్రాంతం గుండా సుమారు 5 మీటర్ల మేర ప్రయాణించాల్సి ఉండడమే ఈ జర్నీలో అసలైన కొసమెరుపు. ఎత్తు, లావులతో అస్సలే సంబంధం లేదు. దేవుడిపై భారం మోపుతూ ఓం నమశ్శివాయ అంటూ ముందుకు సాగితే.. ఎంతటి భారీ ఆకారమైనా సులువుగా బండరాళ్లను దాటుతుంది అనేది ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం.

బృందంలోని నలుగురు అతి కష్టం మీద అంగీ గుండీలు ఊడదీసుకుని మరీ ఒడ్డుకు చేరారు. మరో నలుగురు మాత్రం ప్రత్యామ్నాయ మార్గంలో మూడో గుండు పైనున్న శివలింగాన్ని దర్శించుకున్నారు. చెప్తుంటేనే ఒళ్లు గగుర్పొడిచే దైవ దర్శనం పక్కన పెడితే.. చెర్వుగట్టు క్షేత్రంలో వేసే ప్రతీ అడుగూ ఆశ్చర్యార్థకమే. ఇప్పటికే పలుమార్లు దర్శించినా సరికొత్త అనుభూతితో.. కొత్తగా వచ్చిన వాళ్లు కొంగొత్త అనుభవంతో తిరుగుపయనమయ్యాం. మొత్తంగా పరిశీలించినపుడు.. గతంతో పోలిస్తే మెరుగుపడిన అంశాలు ఈసారి గుట్టలో అనేకానేకం ఉండడమే ప్రత్యేకాంశం.

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular